టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశాల్లో వైరి వర్గాలకు చుక్కలు చూపిస్తున్నారు కదా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియాను పిలిచి.. సదరు మీడియా ప్రతినిధిని చూసి మరీ తన ప్రసంగాన్ని మొదలుపెడుతున్నారు. ఈ తరహా పద్ధతితో లోకేశ్ మీడియా సమావేశాలకు హాజరు కావాలంటేనే సాక్షి, ఎన్టీవీ సంస్థలకు చెందిన జర్నలిస్టులు జడుసుకుంటున్నారు. ఎవరైనా ఏదో ఒక్కసారి అంటే ఓకే గానీ… ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా… లోకేశ్ అదే పద్ధతిని పాటిస్తూ ఉండటంతో ఈ మీడియా సంస్థల ప్రతినిధులు కొంత ఇబ్బంది పడుతున్నారు.
లోకేశ్ అవలంబిస్తున్న ఈ పద్ధతి వైసీపీ నేతలను… అది కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలను బాగానే ఆకట్టుకుంది. ఏం లోకేశేనా… మన మీడియా సంస్థల పేర్లను చెబుతూ మనల్ని టార్గెట్ చేసేది?..ఏం మనం చేయలేమా? అనుకున్నారో… లేదంటే లోకేశ్ తీరుకు జనంలో మాబాగా అప్లాజ్ వస్తున్న విషయాన్ని చూసి ముచ్చటపడ్డారో తెలియదు గానీ… వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. లోకేశ్ స్టైల్ ను మక్కికి మక్కి ఫాలో అయిపోయారు. మీడియా సమావేశంలో లోకేశ్ ఎలా అయితే ప్రారంభిస్తున్నారో… అచ్చు గుద్దినట్టుగా రాంబాబు కూడా అదే తీరును ఫాలో అయిపోయారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయిపోతోంది.
అంబటి రాంబాబు ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దాదాపుగా అన్ని మీడియా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా టీవీ ఛానెళ్లు వరుసగా తమ మైకులను అంబటి ముందు వరుసగా పేర్చి పెట్టి… సార్ ఇక మీదే ఆలస్యం అంటూ చెప్పారు. అంతా సరిచూసుకున్న అంబటి.. లోకేశ్ మాదిరిగా.. టీవీ 5 వచ్చిందా?.. ఆంధ్రజ్యోతి వచ్చిందా?.. ఆ రెండూ వస్తే చాలు…ఇక మొదలెట్టేయవచ్చు అంటూ అలా సాగిపోయారు. ఈ మాట విన్నంతనే ఇటు మీడియా మిత్రులతో పాటుగా అటు అంబటి అనుచరులు కూడా ముసిముసిగా నవ్వుకున్నారు.
This post was last modified on March 4, 2025 2:22 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…