టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశాల్లో వైరి వర్గాలకు చుక్కలు చూపిస్తున్నారు కదా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియాను పిలిచి.. సదరు మీడియా ప్రతినిధిని చూసి మరీ తన ప్రసంగాన్ని మొదలుపెడుతున్నారు. ఈ తరహా పద్ధతితో లోకేశ్ మీడియా సమావేశాలకు హాజరు కావాలంటేనే సాక్షి, ఎన్టీవీ సంస్థలకు చెందిన జర్నలిస్టులు జడుసుకుంటున్నారు. ఎవరైనా ఏదో ఒక్కసారి అంటే ఓకే గానీ… ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా… లోకేశ్ అదే పద్ధతిని పాటిస్తూ ఉండటంతో ఈ మీడియా సంస్థల ప్రతినిధులు కొంత ఇబ్బంది పడుతున్నారు.
లోకేశ్ అవలంబిస్తున్న ఈ పద్ధతి వైసీపీ నేతలను… అది కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలను బాగానే ఆకట్టుకుంది. ఏం లోకేశేనా… మన మీడియా సంస్థల పేర్లను చెబుతూ మనల్ని టార్గెట్ చేసేది?..ఏం మనం చేయలేమా? అనుకున్నారో… లేదంటే లోకేశ్ తీరుకు జనంలో మాబాగా అప్లాజ్ వస్తున్న విషయాన్ని చూసి ముచ్చటపడ్డారో తెలియదు గానీ… వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. లోకేశ్ స్టైల్ ను మక్కికి మక్కి ఫాలో అయిపోయారు. మీడియా సమావేశంలో లోకేశ్ ఎలా అయితే ప్రారంభిస్తున్నారో… అచ్చు గుద్దినట్టుగా రాంబాబు కూడా అదే తీరును ఫాలో అయిపోయారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయిపోతోంది.
అంబటి రాంబాబు ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దాదాపుగా అన్ని మీడియా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా టీవీ ఛానెళ్లు వరుసగా తమ మైకులను అంబటి ముందు వరుసగా పేర్చి పెట్టి… సార్ ఇక మీదే ఆలస్యం అంటూ చెప్పారు. అంతా సరిచూసుకున్న అంబటి.. లోకేశ్ మాదిరిగా.. టీవీ 5 వచ్చిందా?.. ఆంధ్రజ్యోతి వచ్చిందా?.. ఆ రెండూ వస్తే చాలు…ఇక మొదలెట్టేయవచ్చు అంటూ అలా సాగిపోయారు. ఈ మాట విన్నంతనే ఇటు మీడియా మిత్రులతో పాటుగా అటు అంబటి అనుచరులు కూడా ముసిముసిగా నవ్వుకున్నారు.
This post was last modified on March 4, 2025 2:22 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…