టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశాల్లో వైరి వర్గాలకు చుక్కలు చూపిస్తున్నారు కదా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియాను పిలిచి.. సదరు మీడియా ప్రతినిధిని చూసి మరీ తన ప్రసంగాన్ని మొదలుపెడుతున్నారు. ఈ తరహా పద్ధతితో లోకేశ్ మీడియా సమావేశాలకు హాజరు కావాలంటేనే సాక్షి, ఎన్టీవీ సంస్థలకు చెందిన జర్నలిస్టులు జడుసుకుంటున్నారు. ఎవరైనా ఏదో ఒక్కసారి అంటే ఓకే గానీ… ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా… లోకేశ్ అదే పద్ధతిని పాటిస్తూ ఉండటంతో ఈ మీడియా సంస్థల ప్రతినిధులు కొంత ఇబ్బంది పడుతున్నారు.
లోకేశ్ అవలంబిస్తున్న ఈ పద్ధతి వైసీపీ నేతలను… అది కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలను బాగానే ఆకట్టుకుంది. ఏం లోకేశేనా… మన మీడియా సంస్థల పేర్లను చెబుతూ మనల్ని టార్గెట్ చేసేది?..ఏం మనం చేయలేమా? అనుకున్నారో… లేదంటే లోకేశ్ తీరుకు జనంలో మాబాగా అప్లాజ్ వస్తున్న విషయాన్ని చూసి ముచ్చటపడ్డారో తెలియదు గానీ… వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. లోకేశ్ స్టైల్ ను మక్కికి మక్కి ఫాలో అయిపోయారు. మీడియా సమావేశంలో లోకేశ్ ఎలా అయితే ప్రారంభిస్తున్నారో… అచ్చు గుద్దినట్టుగా రాంబాబు కూడా అదే తీరును ఫాలో అయిపోయారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయిపోతోంది.
అంబటి రాంబాబు ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దాదాపుగా అన్ని మీడియా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా టీవీ ఛానెళ్లు వరుసగా తమ మైకులను అంబటి ముందు వరుసగా పేర్చి పెట్టి… సార్ ఇక మీదే ఆలస్యం అంటూ చెప్పారు. అంతా సరిచూసుకున్న అంబటి.. లోకేశ్ మాదిరిగా.. టీవీ 5 వచ్చిందా?.. ఆంధ్రజ్యోతి వచ్చిందా?.. ఆ రెండూ వస్తే చాలు…ఇక మొదలెట్టేయవచ్చు అంటూ అలా సాగిపోయారు. ఈ మాట విన్నంతనే ఇటు మీడియా మిత్రులతో పాటుగా అటు అంబటి అనుచరులు కూడా ముసిముసిగా నవ్వుకున్నారు.
This post was last modified on March 4, 2025 2:22 pm
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…