టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశాల్లో వైరి వర్గాలకు చుక్కలు చూపిస్తున్నారు కదా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియాను పిలిచి.. సదరు మీడియా ప్రతినిధిని చూసి మరీ తన ప్రసంగాన్ని మొదలుపెడుతున్నారు. ఈ తరహా పద్ధతితో లోకేశ్ మీడియా సమావేశాలకు హాజరు కావాలంటేనే సాక్షి, ఎన్టీవీ సంస్థలకు చెందిన జర్నలిస్టులు జడుసుకుంటున్నారు. ఎవరైనా ఏదో ఒక్కసారి అంటే ఓకే గానీ… ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా… లోకేశ్ అదే పద్ధతిని పాటిస్తూ ఉండటంతో ఈ మీడియా సంస్థల ప్రతినిధులు కొంత ఇబ్బంది పడుతున్నారు.
లోకేశ్ అవలంబిస్తున్న ఈ పద్ధతి వైసీపీ నేతలను… అది కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలను బాగానే ఆకట్టుకుంది. ఏం లోకేశేనా… మన మీడియా సంస్థల పేర్లను చెబుతూ మనల్ని టార్గెట్ చేసేది?..ఏం మనం చేయలేమా? అనుకున్నారో… లేదంటే లోకేశ్ తీరుకు జనంలో మాబాగా అప్లాజ్ వస్తున్న విషయాన్ని చూసి ముచ్చటపడ్డారో తెలియదు గానీ… వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. లోకేశ్ స్టైల్ ను మక్కికి మక్కి ఫాలో అయిపోయారు. మీడియా సమావేశంలో లోకేశ్ ఎలా అయితే ప్రారంభిస్తున్నారో… అచ్చు గుద్దినట్టుగా రాంబాబు కూడా అదే తీరును ఫాలో అయిపోయారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయిపోతోంది.
అంబటి రాంబాబు ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దాదాపుగా అన్ని మీడియా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా టీవీ ఛానెళ్లు వరుసగా తమ మైకులను అంబటి ముందు వరుసగా పేర్చి పెట్టి… సార్ ఇక మీదే ఆలస్యం అంటూ చెప్పారు. అంతా సరిచూసుకున్న అంబటి.. లోకేశ్ మాదిరిగా.. టీవీ 5 వచ్చిందా?.. ఆంధ్రజ్యోతి వచ్చిందా?.. ఆ రెండూ వస్తే చాలు…ఇక మొదలెట్టేయవచ్చు అంటూ అలా సాగిపోయారు. ఈ మాట విన్నంతనే ఇటు మీడియా మిత్రులతో పాటుగా అటు అంబటి అనుచరులు కూడా ముసిముసిగా నవ్వుకున్నారు.
This post was last modified on March 4, 2025 2:22 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…