Political News

ఏపీలో ఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా అజెండా ఇదే…!

ఏపీలో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. ప‌థ‌కాలు, సంక్షేమం, మేనిఫెస్టో .. అనే మాట‌లు వినిపించ‌డం కుదర‌దు. ఈ విష‌యంలో కూట‌మి పార్టీలు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశాయి. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌.. అధికారంలో ఉండి.. కేవ‌లం ఈ మూడు అంశాల‌నే ప్రాతిప‌దిక‌గా చేసుకుని ముందుకు సాగారు. అయితే.. ప‌థ‌కాలు అంద‌రికీ అందే అవ‌కాశం లేదు. ఎంత ఖ‌ర్చు చేసినా.. ప్ర‌జ‌ల్లో అసంతృప్తి గూడుక‌ట్టుకునే ఉంటుంది. ఇక‌, సంక్షేమం మాటా అంతే!

ఇక‌, మేనిఫెస్టోలోని అంశాల‌ను పూర్తిగా అమ‌లు చేశామ‌ని చెప్పినా.. జ‌గ‌న్ మాట‌ను పెద్ద‌గా ఎవ‌రూ విశ్వ‌సించ‌లేదు.పైగా.. ప్ర‌త్య‌ర్థుల‌కు.. ఈ మూడు అంశాలు.. ఆయుధంగా మారాయి. ప‌థ‌కాల‌ను మ‌రింత ఎక్కువ‌గా చేసి ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. సంక్షేమం అంద‌రికీ అంద‌లేద‌న్న విష‌యాన్ని నారా లోకేష్‌ క్షేత్ర‌స్థాయిలో వివ‌రించారు. మేనిఫెస్టోలో చాలా అంశాలు మిగిలి ఉన్నాయ‌ని.. బీజేపీ చెప్పుకొచ్చింది. పైగా కేంద్రం ఇచ్చిన నిధుల‌తోనే వీటిని అమ‌లు చేశార‌ని తెలిపింది.

ఇవ‌న్నీ.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు చాలా చ‌క్క‌గా ఎక్కాయి. ఇక‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఓట‌ర్లు.. తాము క‌ట్టిన ప‌న్నుల‌తో సంక్షేమం ఏంటి? అంటూ.. పెద్ద ఎత్తున వైసీపీకి వ్య‌తిరేకంగా మారిపోయారు. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌క్రియ‌లో కూట‌మి పార్ట‌లు స‌క్సెస్ అయ్యాయి. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. అంటే.. జమిలితో ముందుగానే వ‌చ్చినా.. ఈ ద‌ఫా ప‌థ‌కాలు, సంక్షేమం, మేనిఫెస్టో .. అనే మాట‌లు వినిపించ‌డం సాధ్యం కాదు. ఒక‌వేళ జ‌గ‌న్ వీటిని ప‌ట్టుకున్నా.. అది విఫ‌ల‌మైన రాజ‌కీయం అవుతుంది.

కాబ‌ట్టే.. కూట‌మి స‌ర్కారు పెద్ద‌లు.. అభివృద్ధి, సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌ను ఎంచుకున్నారు. మూడు పార్టీల‌ను గ‌మ‌నిస్తే.. మూడు ర‌కాల రాజ‌కీయాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అభివృద్ధి స‌హా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అజెండాతో టీడీపీ ముందుకు సాగుతోంది. వీరికి బడ్జ‌ట్‌లోనూ నిధులు ఎక్కువ‌గానే కేటాయించారు. ఇక‌, త‌న ఇమేజ్‌తోనే ముందుకు సాగేందుకు ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. హిందూత్వ ఓటు బ్యాంకు చేజార‌కుండా.. బీజేపీ ప‌వ‌న్‌కు క‌లిసి వ‌స్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ రెండు అంశాలు.. కీల‌కంగా మారనున్న నేప‌థ్యంలో వైసీపీ త‌న పంథాను మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 4, 2025 10:27 am

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

2 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

2 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

2 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

5 hours ago