ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. పథకాలు, సంక్షేమం, మేనిఫెస్టో .. అనే మాటలు వినిపించడం కుదరదు. ఈ విషయంలో కూటమి పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చేశాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జగన్.. అధికారంలో ఉండి.. కేవలం ఈ మూడు అంశాలనే ప్రాతిపదికగా చేసుకుని ముందుకు సాగారు. అయితే.. పథకాలు అందరికీ అందే అవకాశం లేదు. ఎంత ఖర్చు చేసినా.. ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకునే ఉంటుంది. ఇక, సంక్షేమం మాటా అంతే!
ఇక, మేనిఫెస్టోలోని అంశాలను పూర్తిగా అమలు చేశామని చెప్పినా.. జగన్ మాటను పెద్దగా ఎవరూ విశ్వసించలేదు.పైగా.. ప్రత్యర్థులకు.. ఈ మూడు అంశాలు.. ఆయుధంగా మారాయి. పథకాలను మరింత ఎక్కువగా చేసి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. సంక్షేమం అందరికీ అందలేదన్న విషయాన్ని నారా లోకేష్ క్షేత్రస్థాయిలో వివరించారు. మేనిఫెస్టోలో చాలా అంశాలు మిగిలి ఉన్నాయని.. బీజేపీ చెప్పుకొచ్చింది. పైగా కేంద్రం ఇచ్చిన నిధులతోనే వీటిని అమలు చేశారని తెలిపింది.
ఇవన్నీ.. సాధారణ ప్రజలకు చాలా చక్కగా ఎక్కాయి. ఇక, మధ్యతరగతి ఓటర్లు.. తాము కట్టిన పన్నులతో సంక్షేమం ఏంటి? అంటూ.. పెద్ద ఎత్తున వైసీపీకి వ్యతిరేకంగా మారిపోయారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రక్రియలో కూటమి పార్టలు సక్సెస్ అయ్యాయి. ఇక, వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. అంటే.. జమిలితో ముందుగానే వచ్చినా.. ఈ దఫా పథకాలు, సంక్షేమం, మేనిఫెస్టో .. అనే మాటలు వినిపించడం సాధ్యం కాదు. ఒకవేళ జగన్ వీటిని పట్టుకున్నా.. అది విఫలమైన రాజకీయం అవుతుంది.
కాబట్టే.. కూటమి సర్కారు పెద్దలు.. అభివృద్ధి, సామాజిక సమీకరణలను ఎంచుకున్నారు. మూడు పార్టీలను గమనిస్తే.. మూడు రకాల రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి సహా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అజెండాతో టీడీపీ ముందుకు సాగుతోంది. వీరికి బడ్జట్లోనూ నిధులు ఎక్కువగానే కేటాయించారు. ఇక, తన ఇమేజ్తోనే ముందుకు సాగేందుకు పవన్ నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. హిందూత్వ ఓటు బ్యాంకు చేజారకుండా.. బీజేపీ పవన్కు కలిసి వస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ రెండు అంశాలు.. కీలకంగా మారనున్న నేపథ్యంలో వైసీపీ తన పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…