నటుడు, నిర్మాత, వైసీపీ మాజీ నాయకుడు పోసాని కృష్ణ మురళి ఇప్పట్లలో బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం.. ఒక జిల్లా కాదు.. రెండు జిల్లాలు కాదు.. ఏకంగా.. 9 జిల్లాల్లో ఆయనపై కేసులు నమోదు కావడమే. నిన్న మొన్నటి వరకు కడప జిల్లా రాయచోటి నియజకవర్గం పోలీసులు మాత్రమే ఆయనపై కేసు నమోదు చేశారని అనుకుంటే.. తర్వాత నరసరావు పేట పోలీసులు ముందుకు వచ్చారు. మేం కోర్టు అనుమతి తీసుకున్నాం.. మాకు అప్పగించాలంటూ..వారు రాయచోటి పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.దీంతో రాయచోటి నియోజకవర్గం పోలీసులు పోసానిని నరసరావు పేట పోలీసులకు అప్పగించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు.. మరిన్ని జిల్లాలకు చెందిన పోలీసులు.. పోసాని కోసం ముందుకు వచ్చారు. ఏపీ వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి పై నమోదైన కేసులను వారు ఉటంకిస్తున్నారు. పోసాని పై 30కి పైగా ఫిర్యాదులు, 14 కేసులు నమోదు చేసినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీటిలో నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, యాదమరి(కర్నూలు), పుత్తూరు, విజయవాడ, పాలకొండ, పాతపట్నంలో పోసానిపై కేసులు నమోదయ్యాయయని వివరించారు. నరసరావుపేట పీఎస్లో నమోదైన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్పై విచారణ చేపట్టారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టుకి పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చిన పోలీసులు.. ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే బాటలో ఇతర జిల్లాల పోలీసులు కూడా నడవనున్నారు. అయితే.. వంతుల వారీగా.. ఒకరు తర్వాత.. పోసానిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే.. దీనిపై వైసీపీ తరఫున న్యాయవాదులు కోర్టును మరోసారి ఆశ్రయించారు. పోసానికి న్యాయం చేయాలని కోరుతూ.. పిటిషన్ వేశారు.
అన్ని కేసులు సోషల్ మీడియాకు సంబంధించిన వివాదా స్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే నమోదైనవి కావడంతో.. అన్ని కేసులను ఒకే ఎఫ్ ఐఆర్గా నమోదు చేసి.. ఒకే కేసుగా పరిగణించి.. పోలీసు హెడ్ కార్టర్స్కు అప్పీల్ చేసుకునేలా కోర్టు ఆదేశించాలని కోరారు. అయితే.. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అప్పటి వరకు పోసానికి రిలీఫ్ ఉండే అవకాశం లేదని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్టుగా పోసాని వ్యవహారం రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.
This post was last modified on March 3, 2025 10:18 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…