ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే ఏపీలో పర్యటించనున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి న తర్వాత..ఏపీపై ప్రత్యేక ప్రేమ చూపిస్తున్న ప్రధాని.. ఈ క్రమంలో ఇప్పటికి ఒకసారి విశాఖలో పర్యటించా రు. అదేవిధంగా రాష్ట్ర సర్కారు కోరినట్టు అన్నీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా.. మరోసారి ఏపీకి వస్తున్నట్టు రాష్ట్ర సర్కారుకు సమాచారం అందింది. దీని ప్రకారం ఆయన ప్రధాని మోడీ ఈ నెల రెండో వారంలో ఏపీకి రానున్నారు.
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో నిర్మించ తలపెట్టిన రక్షణ శాఖకు చెందిన క్షిపణి పరీక్షా కేంద్రానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రక్షణ శాఖలో కీలకమైన క్షిపణి వ్యవస్థకు మోడీ సర్కారు ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత టీడీపీ హయాంలోనే నాగాయలంకలోని గుల్లల మోదను ఎంపిక చేశారు. సమీపంలోనే తీరం ఉండడం.. భూమ్యాకర్షణ శక్తి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనిని ఎంచుకున్నారు.
ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం డీఆర్ డీఓ రూ.15 వేల కోట్ల నుంచి 20వేల కోట్ల వరకు ఈ ప్రాజెక్టుపై ఖర్చు చేయనుంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచాయి. వైసీపీ హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని మోడీ స్వయంగా వచ్చేందుకుఅంగీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా పీఎంవో(ప్రధాని కార్యాలయం) నుంచి రాష్ట్ర సర్కారుకు సమచారం అందింది.
This post was last modified on March 3, 2025 9:49 pm
రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…
గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను…
నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్…
మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం…