Political News

త్వ‌ర‌లోనే ఏపీకి ప్ర‌ధాని రాక‌.. రీజ‌నేంటంటే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ త్వ‌ర‌లోనే ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి న త‌ర్వాత‌..ఏపీపై ప్ర‌త్యేక ప్రేమ చూపిస్తున్న ప్ర‌ధాని.. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికి ఒక‌సారి విశాఖ‌లో ప‌ర్య‌టించా రు. అదేవిధంగా రాష్ట్ర స‌ర్కారు కోరిన‌ట్టు అన్నీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా.. మ‌రోసారి ఏపీకి వ‌స్తున్న‌ట్టు రాష్ట్ర స‌ర్కారుకు స‌మాచారం అందింది. దీని ప్ర‌కారం ఆయ‌న ప్ర‌ధాని మోడీ ఈ నెల రెండో వారంలో ఏపీకి రానున్నారు.

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో నిర్మించ త‌ల‌పెట్టిన ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన‌ క్షిపణి పరీక్షా కేంద్రానికి ప్ర‌ధాని మోడీ శంకుస్థాపన చేయ‌నున్నారు. ర‌క్ష‌ణ శాఖ‌లో కీల‌క‌మైన క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌కు మోడీ స‌ర్కారు ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో గ‌త టీడీపీ హ‌యాంలోనే నాగాయ‌లంక‌లోని గుల్ల‌ల మోద‌ను ఎంపిక చేశారు. స‌మీపంలోనే తీరం ఉండ‌డం.. భూమ్యాకర్ష‌ణ శ‌క్తి కూడా ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో దీనిని ఎంచుకున్నారు.

ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం డీఆర్ డీఓ రూ.15 వేల కోట్ల నుంచి 20వేల కోట్ల వ‌ర‌కు ఈ ప్రాజెక్టుపై ఖర్చు చేయనుంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచాయి. వైసీపీ హ‌యాంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని మోడీ స్వ‌యంగా వ‌చ్చేందుకుఅంగీక‌రించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా పీఎంవో(ప్ర‌ధాని కార్యాల‌యం) నుంచి రాష్ట్ర స‌ర్కారుకు స‌మ‌చారం అందింది.

This post was last modified on March 3, 2025 9:49 pm

Share
Show comments
Published by
Satya
Tags: PM Modi

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago