Political News

త్వ‌ర‌లోనే ఏపీకి ప్ర‌ధాని రాక‌.. రీజ‌నేంటంటే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ త్వ‌ర‌లోనే ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి న త‌ర్వాత‌..ఏపీపై ప్ర‌త్యేక ప్రేమ చూపిస్తున్న ప్ర‌ధాని.. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికి ఒక‌సారి విశాఖ‌లో ప‌ర్య‌టించా రు. అదేవిధంగా రాష్ట్ర స‌ర్కారు కోరిన‌ట్టు అన్నీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా.. మ‌రోసారి ఏపీకి వ‌స్తున్న‌ట్టు రాష్ట్ర స‌ర్కారుకు స‌మాచారం అందింది. దీని ప్ర‌కారం ఆయ‌న ప్ర‌ధాని మోడీ ఈ నెల రెండో వారంలో ఏపీకి రానున్నారు.

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో నిర్మించ త‌ల‌పెట్టిన ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన‌ క్షిపణి పరీక్షా కేంద్రానికి ప్ర‌ధాని మోడీ శంకుస్థాపన చేయ‌నున్నారు. ర‌క్ష‌ణ శాఖ‌లో కీల‌క‌మైన క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌కు మోడీ స‌ర్కారు ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో గ‌త టీడీపీ హ‌యాంలోనే నాగాయ‌లంక‌లోని గుల్ల‌ల మోద‌ను ఎంపిక చేశారు. స‌మీపంలోనే తీరం ఉండ‌డం.. భూమ్యాకర్ష‌ణ శ‌క్తి కూడా ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో దీనిని ఎంచుకున్నారు.

ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం డీఆర్ డీఓ రూ.15 వేల కోట్ల నుంచి 20వేల కోట్ల వ‌ర‌కు ఈ ప్రాజెక్టుపై ఖర్చు చేయనుంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచాయి. వైసీపీ హ‌యాంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని మోడీ స్వ‌యంగా వ‌చ్చేందుకుఅంగీక‌రించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా పీఎంవో(ప్ర‌ధాని కార్యాల‌యం) నుంచి రాష్ట్ర స‌ర్కారుకు స‌మ‌చారం అందింది.

This post was last modified on March 3, 2025 9:49 pm

Share
Show comments
Published by
Satya
Tags: PM Modi

Recent Posts

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

1 hour ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

3 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

8 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

8 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

9 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

9 hours ago