ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే ఏపీలో పర్యటించనున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి న తర్వాత..ఏపీపై ప్రత్యేక ప్రేమ చూపిస్తున్న ప్రధాని.. ఈ క్రమంలో ఇప్పటికి ఒకసారి విశాఖలో పర్యటించా రు. అదేవిధంగా రాష్ట్ర సర్కారు కోరినట్టు అన్నీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా.. మరోసారి ఏపీకి వస్తున్నట్టు రాష్ట్ర సర్కారుకు సమాచారం అందింది. దీని ప్రకారం ఆయన ప్రధాని మోడీ ఈ నెల రెండో వారంలో ఏపీకి రానున్నారు.
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో నిర్మించ తలపెట్టిన రక్షణ శాఖకు చెందిన క్షిపణి పరీక్షా కేంద్రానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రక్షణ శాఖలో కీలకమైన క్షిపణి వ్యవస్థకు మోడీ సర్కారు ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత టీడీపీ హయాంలోనే నాగాయలంకలోని గుల్లల మోదను ఎంపిక చేశారు. సమీపంలోనే తీరం ఉండడం.. భూమ్యాకర్షణ శక్తి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనిని ఎంచుకున్నారు.
ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం డీఆర్ డీఓ రూ.15 వేల కోట్ల నుంచి 20వేల కోట్ల వరకు ఈ ప్రాజెక్టుపై ఖర్చు చేయనుంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచాయి. వైసీపీ హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని మోడీ స్వయంగా వచ్చేందుకుఅంగీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా పీఎంవో(ప్రధాని కార్యాలయం) నుంచి రాష్ట్ర సర్కారుకు సమచారం అందింది.
This post was last modified on March 3, 2025 9:49 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…