Political News

సామాజిక పింఛ‌నులో చైత‌న్యం .. బాబు భ‌లే ఐడియా ..!

రాష్ట్రంలో ప్ర‌తి నెలా 1వ తేదీన అందించే సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్‌-ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్‌పై సీఎం చంద్ర‌బాబు వినూత్న ఐడియా ప్లే చేస్తున్నారు. ఇది మార్చి 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానుంది. దీని ప్ర‌కారం.. పింఛ‌ను దారుల‌కు సీఎం సందేశం ఇవ్వ‌నున్నారు. పేరు పేరునా.. ఈ సందేశం వినిపించ‌డం గ‌మ‌నార్హం. అధికారులు చెబుతున్న దాని ప్ర‌కారం.. ప్ర‌స్తుతం పింఛ‌ను తీసుకునేవారు… వేలి ముద్ర వేసి.. సొమ్ములు అందుకుంటున్నారు.

సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్లు మొత్తం 5 ర‌కాలుగా ఉన్నాయి. వితంతు, వృద్ధులు, దివ్యాంగులు, లెప్ర‌జీ, కిడ్నీ స‌హా ఇత‌ర బాధితుల‌కు పింఛ‌న్లు ఇస్తున్నారు. అయితే.. వీరంతా వేలిముద్ర వేసిన వెంట‌నే సంబంధించి వార్డు లేదా గ్రామ స‌చివాల‌య సెక్ర‌ట‌రీ న‌గ‌దు ఇచ్చి వెళ్లిపోతున్నారు. అయితే.. ప్ర‌భుత్వం ఈ పింఛ‌న్లు ఇచ్చేందుకు ఎంత కృషి చేస్తోందో.. ఎన్ని ర‌కాలుగా ఇబ్బందులు ప‌డుతోందో.. ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని.. ప్ర‌జ‌ల మేలు కోసం చేస్తున్న విష‌యాల‌ను వారి చెవిన ప‌డాల‌ని స‌ర్కారు భావిస్తోంది.

ఈ నేప‌థ్యంలో స్వ‌యంగా చంద్ర‌బాబు వాయిస్‌తోకూడి ఏఐ(ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) ఆధారిత ఆడియోను మార్చి 1 నుంచి ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. త‌ద్వారా.. 20 సెకన్ల పాటు ఆ ఆడియో వినిపించ‌నుం ది. అది కూడా.. సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను దారు.. వేలి ముద్ర వేసిన వెంట‌నే స‌ద‌రు ల‌బ్ది దారుని పేరుతో సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా మాట్లాడిన‌ట్టుగా ప్లే చేస్తారు. రాష్ట్ర ప్ర‌భుత్వం పింఛ‌ను పెంచిన నేప‌థ్యంలో.. జ‌రుగుతున్న ల‌బ్ధి, ప్ర‌భుత్వం ఎంత నిబ‌ద్ధ‌త‌తో ఇస్తున్న సొమ్ముల వివ‌రాల‌ను ఆ ఆడియోలో ప్లే చేయ‌నున్నారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. వేలి ముద్ర వేసిన త‌ర్వాత‌.. వెంట‌నే గ‌తంలో ల‌బ్ధిదారుల‌కు పింఛ‌ను ఇచ్చేందుకు స‌క్సెస్ లేదా యాక్సప్ట్ అనే సందేశాలు వ‌చ్చేవి. దీంతో స‌ద‌రు సెక్ర‌ట‌రీ సొమ్ములు చేతిలో పెట్టి వెళ్లిపోయేవారు. కానీ, తాజాగా చేసుకున్న మార్ప‌తో.. వేలి ముద్ర వేసిన త‌ర్వాత‌.. 20 సెక‌నుల పాటు.. సందేశం వినిపిస్తుంది. దీనిని పూర్తిగా విని ధ్రువీక‌రించుకున్న త‌ర్వాత‌..(అంటే ఈ సందేశం విన్నామ‌ని పేర్కొంటూ.. రెండోసారి కూడా వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది. ) మాత్ర‌మే పింఛ‌ను సొమ్ము ఇచ్చేందుకు యాక్స‌ప్ట్ చేయ‌నుంది. దీనిని ప్ర‌స్తుతం మార్చి 1 నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ లేని జిల్లాల్లో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Satya

Recent Posts

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

13 minutes ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

1 hour ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

1 hour ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

2 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

2 hours ago

తెలంగాణ పాలిటిక్స్‌: ప‌వ‌న్ భ‌య‌మా… ఓట్ల భ‌య‌మా?

తెలంగాణ రాజ‌కీయాలు వ్యూహాత్మ‌క మ‌లుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌న‌సేన పార్టీపై…

2 hours ago