Political News

సామాజిక పింఛ‌నులో చైత‌న్యం .. బాబు భ‌లే ఐడియా ..!

రాష్ట్రంలో ప్ర‌తి నెలా 1వ తేదీన అందించే సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్‌-ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్‌పై సీఎం చంద్ర‌బాబు వినూత్న ఐడియా ప్లే చేస్తున్నారు. ఇది మార్చి 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానుంది. దీని ప్ర‌కారం.. పింఛ‌ను దారుల‌కు సీఎం సందేశం ఇవ్వ‌నున్నారు. పేరు పేరునా.. ఈ సందేశం వినిపించ‌డం గ‌మ‌నార్హం. అధికారులు చెబుతున్న దాని ప్ర‌కారం.. ప్ర‌స్తుతం పింఛ‌ను తీసుకునేవారు… వేలి ముద్ర వేసి.. సొమ్ములు అందుకుంటున్నారు.

సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్లు మొత్తం 5 ర‌కాలుగా ఉన్నాయి. వితంతు, వృద్ధులు, దివ్యాంగులు, లెప్ర‌జీ, కిడ్నీ స‌హా ఇత‌ర బాధితుల‌కు పింఛ‌న్లు ఇస్తున్నారు. అయితే.. వీరంతా వేలిముద్ర వేసిన వెంట‌నే సంబంధించి వార్డు లేదా గ్రామ స‌చివాల‌య సెక్ర‌ట‌రీ న‌గ‌దు ఇచ్చి వెళ్లిపోతున్నారు. అయితే.. ప్ర‌భుత్వం ఈ పింఛ‌న్లు ఇచ్చేందుకు ఎంత కృషి చేస్తోందో.. ఎన్ని ర‌కాలుగా ఇబ్బందులు ప‌డుతోందో.. ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని.. ప్ర‌జ‌ల మేలు కోసం చేస్తున్న విష‌యాల‌ను వారి చెవిన ప‌డాల‌ని స‌ర్కారు భావిస్తోంది.

ఈ నేప‌థ్యంలో స్వ‌యంగా చంద్ర‌బాబు వాయిస్‌తోకూడి ఏఐ(ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) ఆధారిత ఆడియోను మార్చి 1 నుంచి ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. త‌ద్వారా.. 20 సెకన్ల పాటు ఆ ఆడియో వినిపించ‌నుం ది. అది కూడా.. సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను దారు.. వేలి ముద్ర వేసిన వెంట‌నే స‌ద‌రు ల‌బ్ది దారుని పేరుతో సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా మాట్లాడిన‌ట్టుగా ప్లే చేస్తారు. రాష్ట్ర ప్ర‌భుత్వం పింఛ‌ను పెంచిన నేప‌థ్యంలో.. జ‌రుగుతున్న ల‌బ్ధి, ప్ర‌భుత్వం ఎంత నిబ‌ద్ధ‌త‌తో ఇస్తున్న సొమ్ముల వివ‌రాల‌ను ఆ ఆడియోలో ప్లే చేయ‌నున్నారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. వేలి ముద్ర వేసిన త‌ర్వాత‌.. వెంట‌నే గ‌తంలో ల‌బ్ధిదారుల‌కు పింఛ‌ను ఇచ్చేందుకు స‌క్సెస్ లేదా యాక్సప్ట్ అనే సందేశాలు వ‌చ్చేవి. దీంతో స‌ద‌రు సెక్ర‌ట‌రీ సొమ్ములు చేతిలో పెట్టి వెళ్లిపోయేవారు. కానీ, తాజాగా చేసుకున్న మార్ప‌తో.. వేలి ముద్ర వేసిన త‌ర్వాత‌.. 20 సెక‌నుల పాటు.. సందేశం వినిపిస్తుంది. దీనిని పూర్తిగా విని ధ్రువీక‌రించుకున్న త‌ర్వాత‌..(అంటే ఈ సందేశం విన్నామ‌ని పేర్కొంటూ.. రెండోసారి కూడా వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది. ) మాత్ర‌మే పింఛ‌ను సొమ్ము ఇచ్చేందుకు యాక్స‌ప్ట్ చేయ‌నుంది. దీనిని ప్ర‌స్తుతం మార్చి 1 నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ లేని జిల్లాల్లో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on February 28, 2025 2:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago