Political News

రేవంత్ కు కవిత ‘పింక్’ వార్నింగ్

ఏపీలో వైసిపి హయాంలో టిడిపి నేతలపై, కార్యకర్తలపై వైసీపీ నేతలు, పోలీసులు, అధికారులు వేధింపులకు పాల్పడ్డారని టిడిపి నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తప్పు చేసిన వైసీపీ నేతలు, అధికారులు, పోలీసులను వదలబోమని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ రెడ్ బుక్ సాక్షిగా చెప్పిన సంగతి తెలిసిందే.

ఆ క్రమంలోనే రెడ్ బుక్ లో పేర్లను ఒక్కొక్కటిగా బయటకు తీసి చట్టపరంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే లోకేశ్ ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు పింక్ బుక్ మొదలుబెట్టి కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి పింక్ బుక్ ప్రస్తావనను ఎమ్మెల్సీ కవిత తెచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పింక్ బుక్ ప్రకారం చర్యలు తీసుకుంటామని కవిత హెచ్చరించారు. బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను కాంగ్రెస్ నేతలు, అధికారులు, పోలీసులు వేధిస్తున్నారని, అటువంటి వారి పేర్లను పింక్ బుక్ లో నోట్ చేస్తున్నామని కవిత అన్నారు.

సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా పోలీసులు , అధికారులు అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకున్నారని, రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని తొక్కేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడితే ఏమీ రాదని, పాలనపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని కవిత హితవు పలికారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నానని, కవిత వార్నింగ్ ఇచ్చారు. కచ్చితంగా పింక్ బుక్ ను మెయిన్ టెయిన్ చేస్తామని, తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబమని హెచ్చరించారు.

బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించేవారు ఎంత పెద్ద నాయకులైనా, అధికారులనైనా ఎవరిని వదిలిపెట్టబోమని, అధికారంలోకి రాగానే పింక్ బుక్ ను అమలు చేస్తామని కవిత తేల్చి చెప్పారు. పింక్ బుక్ లో అందరి చిట్టా రాసుకుంటామని, తమ టైం వస్తుందని, అప్పుడు అందరి సంగతి చెప్తామని కవిత హెచ్చరించారు.

This post was last modified on February 28, 2025 3:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

43 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

52 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago