ఏపీలో వైసిపి హయాంలో టిడిపి నేతలపై, కార్యకర్తలపై వైసీపీ నేతలు, పోలీసులు, అధికారులు వేధింపులకు పాల్పడ్డారని టిడిపి నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తప్పు చేసిన వైసీపీ నేతలు, అధికారులు, పోలీసులను వదలబోమని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ రెడ్ బుక్ సాక్షిగా చెప్పిన సంగతి తెలిసిందే.
ఆ క్రమంలోనే రెడ్ బుక్ లో పేర్లను ఒక్కొక్కటిగా బయటకు తీసి చట్టపరంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే లోకేశ్ ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు పింక్ బుక్ మొదలుబెట్టి కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి పింక్ బుక్ ప్రస్తావనను ఎమ్మెల్సీ కవిత తెచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పింక్ బుక్ ప్రకారం చర్యలు తీసుకుంటామని కవిత హెచ్చరించారు. బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను కాంగ్రెస్ నేతలు, అధికారులు, పోలీసులు వేధిస్తున్నారని, అటువంటి వారి పేర్లను పింక్ బుక్ లో నోట్ చేస్తున్నామని కవిత అన్నారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా పోలీసులు , అధికారులు అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకున్నారని, రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని తొక్కేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడితే ఏమీ రాదని, పాలనపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని కవిత హితవు పలికారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నానని, కవిత వార్నింగ్ ఇచ్చారు. కచ్చితంగా పింక్ బుక్ ను మెయిన్ టెయిన్ చేస్తామని, తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబమని హెచ్చరించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించేవారు ఎంత పెద్ద నాయకులైనా, అధికారులనైనా ఎవరిని వదిలిపెట్టబోమని, అధికారంలోకి రాగానే పింక్ బుక్ ను అమలు చేస్తామని కవిత తేల్చి చెప్పారు. పింక్ బుక్ లో అందరి చిట్టా రాసుకుంటామని, తమ టైం వస్తుందని, అప్పుడు అందరి సంగతి చెప్తామని కవిత హెచ్చరించారు.
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…