Political News

‘ఆరోగ్యశ్రీ’ని మరిపించే బాబు ‘ఆరోగ్య బీమా’


పేదలకు ఉచిత వైద్య సేవల రంగంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ జనాల్లోకి బాగా ఎక్కేసింది. ఉచిత వైద్యం అనే మాట వినిపించినంతనే… ఆరోగ్యశ్రీ పేరే గుర్తుకు వచ్చే పరిస్థితి. అలాంటి ఆరోగ్యశ్రీని మరిపించే మరో కొత్త ఆరోగ్య సేవల పథకానికి ఏపీలోని కూటమి సర్కారు శ్రీకారం చుడుతోంది. ప్రతి పేద కుటుంబానికి రూ.25 లక్షలతో ఆరోగ్య బీమా పథకాన్ని అందించే దిశగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చందరబాబునాయుడు చాలా రోజుల కిందే కసరత్తు మొదలుపెట్టారు. తాజాగా శుక్రవారం అసెంబ్లీ ముందుకు వచ్చిన 2025 26 బడ్జెట్ లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ పథకం గురించి కీలక ప్రస్తావన చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ.25 లక్షల విలువైన ఆరోగ్య బీమాను ఈ ఏడాదే అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగంలో ఇంకా పేరు ఖరారు కాని ఈ పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారంటే.. ఈ పథకం త్వరలోనే పట్టాలెక్కడం ఖాయమే. ఈ పథకం కింద ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబానికి రూ.25 లక్షల మేర ఆరోగ్య బీమాను ప్రభుత్వం అందించనుంది. ఆరోగ్య బీమా అందించే సంస్థల నుంచి ఈ మేరకు బీమా సౌకర్యాన్ని అందించనున్నారు.

బీమాకు సంబంధించిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. అంటే… ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఆయా కంపెనీలు అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ మాదిరిగా… బాబు సర్కారు.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య బీమాను అందించనుందన్న మాట. ఈ బీమాకు అర్హులైన కుటుంబాలు… ప్రభుత్వం అందించే కార్డులతో నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఉచితంగానే వైద్య సేవలు పొందుతారు.

ఆరోగ్యశ్రీలో సర్కారు ఇచ్చిన కార్డులు తీసుకుని ముందుగా ఆరోగ్య మిత్రలను సంప్రదించి… వారు చెప్పిన సమయానికి ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయా కార్డులకు సంబంధించి ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అనుమతి లభించిన తర్వాతే వైద్య సేవలు అందుతాయి. ఈ సేవల వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తున్న నేపథ్యంలో బిల్లుల మంజూరీలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఫలితంగా ఆరోగ్యశ్రీ చికిత్సలకు చాలా ఆసుపత్రులు అంతగా ఆసక్తి చూపడం లేదు. అదే ఇన్సూరెన్స్ సంస్థల నుంచి అందే హెల్త్ కార్డుల ద్వారా వెళ్లే వారికి మాత్రం సత్వరమే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.

ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే రీతిన ఆలోచించి.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ను ఇప్పించడం ద్వారా ఉద్యోగుల మాదిరే మెరుగైన వైద్య సేవలు సత్వరం అందుతాయని చెప్పొచ్చు. ఈ లెక్కన బాబు సర్కారు ప్రవేశపెట్టనున్న ఆరోగ్య బీమా పథకం.., వైఎస్ బ్రాండ్ స్కీంగా ప్రచారంలోకి వచ్చిన ఆరోగ్యశ్రీని మరిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

This post was last modified on February 28, 2025 3:14 pm

Share
Show comments
Published by
Satya
Tags: AP Budget

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

1 hour ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

4 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

8 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

8 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

8 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

9 hours ago