ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం, ఓబులవారి పల్లె పోలీసుల అదుపులో ఉన్న సినీ నటుడు, వైసీపీ మాజీ నాయకుడు(తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు గతంలోనే ప్రకటించారు) పోసాని కృష్ణ మురళిని ఎస్పీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించారు. గతంలో అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు సాధారణ మీడియా ముందు కూడా.. ఆయన చేసిన వ్యాఖ్యలు, కాపులు-కమ్మలు అంటూ చేసిన కామెంట్లు, పవన్ కల్యాణ్ను లక్ష్యం గా చేసుకుని చేసిన విమర్శలపై ఆయనను విచారించారు.
అయితే.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పోసాని సినిమాటిక్లో సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. మీరు చేసిన వ్యాఖ్యలతో సమాజంలో కల్లోలం రేపేందుకు ఎందుకు ప్రయత్నించారు? అన్న ప్రశ్నకు.. “ఔనా రాజా” అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు.. ఏ ప్రశ్న అడిగినా.. తనకు తెలీదని, కొన్ని కొన్ని గుర్తు ఉండడం లేదని.. వయసు మీరిపోయిందని.. తాతను అయ్యానని ఇలా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు చిర్రెత్తిపోయినట్టు సమాచారం.
ఎంత విసిగించినా.. సెలబ్రిటీ కావడంతో చాలా సంయమనంతో పోలీసులు వ్యవహరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి రెండు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అరెస్టు చేశారు.
గురువారం ఉదయం స్థానికంగా వైద్య పరీక్షలు చేయించి.. ఆరోగ్యం బాగానే ఉందని ధ్రువీకరించుకున్నా క.. ఎస్పీ ఆధ్వర్యంలో పోసానిని విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. అధికారుల కీలక ప్రశ్నలు ఇవీ..
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…