ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం, ఓబులవారి పల్లె పోలీసుల అదుపులో ఉన్న సినీ నటుడు, వైసీపీ మాజీ నాయకుడు(తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు గతంలోనే ప్రకటించారు) పోసాని కృష్ణ మురళిని ఎస్పీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించారు. గతంలో అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు సాధారణ మీడియా ముందు కూడా.. ఆయన చేసిన వ్యాఖ్యలు, కాపులు-కమ్మలు అంటూ చేసిన కామెంట్లు, పవన్ కల్యాణ్ను లక్ష్యం గా చేసుకుని చేసిన విమర్శలపై ఆయనను విచారించారు.
అయితే.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పోసాని సినిమాటిక్లో సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. మీరు చేసిన వ్యాఖ్యలతో సమాజంలో కల్లోలం రేపేందుకు ఎందుకు ప్రయత్నించారు? అన్న ప్రశ్నకు.. “ఔనా రాజా” అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు.. ఏ ప్రశ్న అడిగినా.. తనకు తెలీదని, కొన్ని కొన్ని గుర్తు ఉండడం లేదని.. వయసు మీరిపోయిందని.. తాతను అయ్యానని ఇలా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు చిర్రెత్తిపోయినట్టు సమాచారం.
ఎంత విసిగించినా.. సెలబ్రిటీ కావడంతో చాలా సంయమనంతో పోలీసులు వ్యవహరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి రెండు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అరెస్టు చేశారు.
గురువారం ఉదయం స్థానికంగా వైద్య పరీక్షలు చేయించి.. ఆరోగ్యం బాగానే ఉందని ధ్రువీకరించుకున్నా క.. ఎస్పీ ఆధ్వర్యంలో పోసానిని విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. అధికారుల కీలక ప్రశ్నలు ఇవీ..
This post was last modified on February 28, 2025 9:01 am
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…