ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం, ఓబులవారి పల్లె పోలీసుల అదుపులో ఉన్న సినీ నటుడు, వైసీపీ మాజీ నాయకుడు(తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు గతంలోనే ప్రకటించారు) పోసాని కృష్ణ మురళిని ఎస్పీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించారు. గతంలో అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు సాధారణ మీడియా ముందు కూడా.. ఆయన చేసిన వ్యాఖ్యలు, కాపులు-కమ్మలు అంటూ చేసిన కామెంట్లు, పవన్ కల్యాణ్ను లక్ష్యం గా చేసుకుని చేసిన విమర్శలపై ఆయనను విచారించారు.
అయితే.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పోసాని సినిమాటిక్లో సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. మీరు చేసిన వ్యాఖ్యలతో సమాజంలో కల్లోలం రేపేందుకు ఎందుకు ప్రయత్నించారు? అన్న ప్రశ్నకు.. “ఔనా రాజా” అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు.. ఏ ప్రశ్న అడిగినా.. తనకు తెలీదని, కొన్ని కొన్ని గుర్తు ఉండడం లేదని.. వయసు మీరిపోయిందని.. తాతను అయ్యానని ఇలా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు చిర్రెత్తిపోయినట్టు సమాచారం.
ఎంత విసిగించినా.. సెలబ్రిటీ కావడంతో చాలా సంయమనంతో పోలీసులు వ్యవహరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి రెండు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అరెస్టు చేశారు.
గురువారం ఉదయం స్థానికంగా వైద్య పరీక్షలు చేయించి.. ఆరోగ్యం బాగానే ఉందని ధ్రువీకరించుకున్నా క.. ఎస్పీ ఆధ్వర్యంలో పోసానిని విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. అధికారుల కీలక ప్రశ్నలు ఇవీ..
This post was last modified on February 28, 2025 9:01 am
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…