వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల పాటు తన సొంత జిల్లా కడపలో పర్యటించారు. ఆ సందర్భంగా పులి వెందుల పంచాయతీని ఒక కొలిక్కి తీసుకు వచ్చినట్టు సమాచారం. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పట్టు కోల్పోతోంది. ముఖ్యంగా బలమైన తిరుపతి, తుని వంటి ప్రాంతాల్లో నూ వైసీపీ సభ్యులు పార్టీ మారి.. కూటమికి జై కొట్టడంతో స్థానికంలో టీడీపీ జెండా లేదా జనసేన జెండా ఎగుతోంది. ఈ పరిణామాల తో రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ ఉక్కిరి బిక్కిరికి గురవుతోంది.
మరోవైపు.. కొన్నికొన్ని ప్రాంతాల్లో అయితే.. జెండా మోసే నాయకుడు కూడా లేకుండా పోయారు. అంతేకాదు.. పార్టీ నేతలు కూడా డీలా పడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితి ఇంత త్వరగా వస్తుందని పార్టీ నాయకులు అస్సలు ఊహించలేదు. దీంతో సర్దుబాటు, దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ.. ఈ పరిణామాలు ఎక్కడా సర్దుబాటు కావడం లేదు. అనేక మంది నాయకులు ఇంకా సుప్తచేతనావస్థలోనే ఉన్నారు.
దీనిని సరిదిద్దేందుకు జిల్లాల పర్యటన చేస్తానన్న జగన్.. మరోసారి వాటిని వాయిదా వేశారు. ఇదిలా వుంటే.. సొంత జిల్లాలోనే కూసాలు కదిలిపోయే ప్రమాదం పొంచి ఉందని పార్టీ వర్గాలుచెబుతున్నాయి. గత వారం పదిరోజుల్లోనే కడపలో పరిణామాలు తీవ్రంగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా పులివెందుల మునిసిపాలిటీలో ఒక కీలక కౌన్సిలర్ ఇటీవల కుటుంబంతో సహా .. టీడీపీకి జై కొట్టారు. ఇక, పులివెందులలో పాగా వేసేందుకు టీడీపీ నేత బీటెక్ రవి కూడా.. ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
త్వరలోనే ముగ్గురు నుంచి ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సొంత నియోజకవర్గం.. సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే.. భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఎదిరించడం కష్టమని భావించిన జగన్ అనూహ్యంగా పులివెందుల పర్యటన పెట్టుకున్నారు. తనకు చేరువలో ఉన్న సీనియర్లతో చర్చలు జరిపారు. అందరూ కలిసి ఉండాలని.. పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. మరి ఎంత వరకు జగన్ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో చూడాలి.
This post was last modified on February 27, 2025 8:42 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…