జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు త్వరలోనే ఏపీ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమేనని చెప్పాలి. అంతేకాకుండా ఎమ్మెల్సీగా పదవి చేపట్టిన మరుక్షణమే ఆయనను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన కేబినెట్ లోకి తీసుకోవడం కూడా లాంఛనమేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీలతో ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లలో ఓ సీటును జనసేన కోరింది. దాని ద్వారా నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ భావించారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన వారు టీడీపీ, బీజేపీల్లో చేరిపోవడం…వారిలో ఇద్దరిని తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయాల్సి రావడం, మిగిలి ఉన్న ఒకే ఒక్క సీటు కోసం టీడీపీలో భారీ డిమాండ్ ఉండటంతో అది కుదరలేదు. ఈ విషయంపై పవన్ తో చర్చించిన చంద్రబాబు… నాగబాబును ఎమ్మెల్సీగా పంపి కేబినెట్ లోకి తీసుకుందామని చెప్పారు. ఈ ప్రతిపాదనకు పవన్ కూడా ఓకే అన్నారు.
తాజాగా ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ సీట్లకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఖాళీ కానున్న 5 సీట్లలో నాలుగు సీట్లు టీడీపీవి కాగా… మరొకటి వైసీపీ కోటాలోనిది. అయితే ఆ వైసీపీ సీటు కూడా వైసీపీని వీడిన జంగా కృష్ణమూర్తి రాజీనామాతో ఖాళీ అయిన సీటు. టీడీపీ కోటా సీట్లను టీడీపీ సభ్యులకే కేటాయించినా… వైసీపీ కోటా సీటును జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయి. ఇటీవల ఓ రాజ్యసభ సీటు దక్కిన నేపథ్యంలో బీజేపీ కూడా ఈ ప్రతిపాదనకు అడ్డు చెప్పే అవకాశం లేదు. 11 సీట్లు మాత్రమే ఉన్న వైసీపీ అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్సే లేదు. వెరసి 5 సీట్లూ కూటమి ఖాతాలోనే పడనున్నాయి. ఈ లెక్కన జనసేన తరఫున నాగబాబు ఎమ్మెల్సీగా పోటీ చేయడం, ఎమ్మెల్సీగా గెలవడం నల్లేరుపై నడకే. ఆ వెంటనే ఆయనకు కేబినెట్ లో స్తానం దక్కడం లాంఛనమే.
This post was last modified on February 27, 2025 8:39 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…