Political News

అనారోగ్యం అంటూనే… ‘నార్కో’కు సిద్ధమంటున్నారే

దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు పోలీసు కస్టడీ ముగిసింది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు వంశీని తమ కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోరగా… వంశీకి కోర్టు 3 రోజుల పాటు కస్టడీ విధించింది. ఈ కస్టడీ గురువారం సాయంత్రానికి పూర్తి కాగా… వైద్య పరీక్షల అనంతరం వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కస్టడీలో పోలీసులు ఏమైనా అతిగా వ్యవహరించారా? అని కోర్టు ప్రశ్నించగా… అదేమీ లేదని వంశీ చెప్పారు. ఆ తర్వాత తనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని కూడా కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని చెప్పిన వంశీ… అవసరమైతే తనను తాను నిరూపించుకునేందుకు నార్కో అనాలసిస్ పరీక్షకు కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. ఈ మేరకు తానే తనకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని కూడా ఆయన తెలిపారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఓ వైపు చెబుతూనే… నార్కో టెస్టు కోసం తానే పిటిషన్ దాఖలు చేస్తానని వంశీ చెప్పడం నిజంగానే పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇదిలా ఉంటే… తనను ప్రస్తుతం ఉంచిన బ్యారక్ లో కాకుండా వేరే బ్యారక్ కు మార్చాలని వంశీ న్యాయమూర్తిని కోరారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పిన వంశీ… ఇప్పుడున్న బ్యారక్ లో ఒంటరిగా ఉండటం కష్టంగా ఉందని తెలిపారు. ఈ కారణంగా తనను వేరే బ్యారక్ కు అది కూడా… ఇతరులతో కలిసి ఉండేలా మరో బ్యారక్ కు మార్చాలని కోరారు. ఈ మేరకు మెమో దాఖలు చేయాలని వంశీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ ముగిసిన తర్వాత వంశీ ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

ఇదిలా ఉంటే… 3 రోజుల విచారణలో భాగంగా పోలీసులు వందలాది ప్రశ్నలు సంధించినా… వంశీ నుంచి వాటిలో చాలా ప్రశ్నలకు సరైన సమాధానమే రాలేదని సమాచారం. ఈ సమాధానాలు సంతృప్తిగా లేవని కూడా పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వంశీని మరోమారు తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఎన్నిసార్లు, ఎన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నా.. సత్యవర్ధన్ కిడ్నాప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని వంశీ చెబుతున్న తీరుపై పోలీసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎన్ని ఆధారాలు ముందు పెట్టినా వంశీ ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదని భావిస్తున్న పోలీసులు.. ఈ దఫా ఇతర నిందితులతో కలిపి వంశీని విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on February 27, 2025 8:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

23 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago