దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు పోలీసు కస్టడీ ముగిసింది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు వంశీని తమ కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోరగా… వంశీకి కోర్టు 3 రోజుల పాటు కస్టడీ విధించింది. ఈ కస్టడీ గురువారం సాయంత్రానికి పూర్తి కాగా… వైద్య పరీక్షల అనంతరం వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కస్టడీలో పోలీసులు ఏమైనా అతిగా వ్యవహరించారా? అని కోర్టు ప్రశ్నించగా… అదేమీ లేదని వంశీ చెప్పారు. ఆ తర్వాత తనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని కూడా కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని చెప్పిన వంశీ… అవసరమైతే తనను తాను నిరూపించుకునేందుకు నార్కో అనాలసిస్ పరీక్షకు కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. ఈ మేరకు తానే తనకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని కూడా ఆయన తెలిపారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఓ వైపు చెబుతూనే… నార్కో టెస్టు కోసం తానే పిటిషన్ దాఖలు చేస్తానని వంశీ చెప్పడం నిజంగానే పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇదిలా ఉంటే… తనను ప్రస్తుతం ఉంచిన బ్యారక్ లో కాకుండా వేరే బ్యారక్ కు మార్చాలని వంశీ న్యాయమూర్తిని కోరారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పిన వంశీ… ఇప్పుడున్న బ్యారక్ లో ఒంటరిగా ఉండటం కష్టంగా ఉందని తెలిపారు. ఈ కారణంగా తనను వేరే బ్యారక్ కు అది కూడా… ఇతరులతో కలిసి ఉండేలా మరో బ్యారక్ కు మార్చాలని కోరారు. ఈ మేరకు మెమో దాఖలు చేయాలని వంశీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ ముగిసిన తర్వాత వంశీ ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.
ఇదిలా ఉంటే… 3 రోజుల విచారణలో భాగంగా పోలీసులు వందలాది ప్రశ్నలు సంధించినా… వంశీ నుంచి వాటిలో చాలా ప్రశ్నలకు సరైన సమాధానమే రాలేదని సమాచారం. ఈ సమాధానాలు సంతృప్తిగా లేవని కూడా పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వంశీని మరోమారు తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఎన్నిసార్లు, ఎన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నా.. సత్యవర్ధన్ కిడ్నాప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని వంశీ చెబుతున్న తీరుపై పోలీసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎన్ని ఆధారాలు ముందు పెట్టినా వంశీ ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదని భావిస్తున్న పోలీసులు.. ఈ దఫా ఇతర నిందితులతో కలిపి వంశీని విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…