Political News

విచారణకు రమ్మంటే గోరంట్ల ఏమన్నారంటే?

ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా… వీర విహారం చేసిన ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీకి చెందిన చాలా మంది కీలక నేతలపై కేసులు నమోదు కాగా… గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తో పాటు మాజీ ఎంపీ నందిగం సురేశ్, తాజాగా వైసీపీని వీడిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు. ఇక కేసులు నమోదు అయిన వైసీపీ నేతల సంఖ్యకు అయితే లేక్కే లేదని చెప్పాలి.

తాజాగా హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వంతు వచ్చింది. 2019 ఎన్నికల దాకా ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారిగా ఉన్న మాధవ్… తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో నెలకొన్న వివాదంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన మాధవ్.. వైసీపీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాధవ్ కు హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చిన జగన్.. ఆయనను ఏకంగా పార్లమెంటుకే పంపారు. దీంతో జగన్ ఆదేశానుసారం మాధవ్ ఓ రేంజిలో స్వైర విహారం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కియా పరిశ్రమ ప్రతినిధులకు మాధవ్ బెదిరింపుల వీడియో వైరల్ కాగా.. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజుకు పార్లమెంటు ఆవరణలోనే బెదిరింపులు, ఓ మహిళతో దిగంబరంగా మాట్లాడిన వీడియో కాల్… మాధవ్ కెరీర్ ను సర్వ నాశనం చేశాయన్న వాదనలు ఉన్నాయి.

పోలీసుల నుంచి తాఖీదులు అందుకుంటున్న వైసీపీ నేతల జాబితాలో ఇప్పుడు మాధవ్ కూడా చేరిపోయారు. మార్చి 5న తమ ముందు విచారణకు హాజరు కావాలని అనంతపురం సైబర్ క్రైమ్ పోలీసులు మాధవ్ కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం మాధవ్ ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫోక్సో కేసులో బాధితురాలి పేర్లను వెల్లడిండానికి వీల్లేదు. ఆ నిబంధనను అతిక్రమించిన మాధవ్ ఓ ఫోక్సో కేసులో బాధితురాలి పేరును బహిర్గతం చేశారు. దీంతో గతేడాది మాధవ్ పై మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే మాధవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే… ఈ నోటీసులపై మాధవ్ ఘాటుగా స్పందించారు. పోలీసుల నుంచి నోటీసులు తీసుకున్నానని ఆయన తెలిపారు. అంతటితో ఆగని ఆయన విచారణకు హాజరయ్యే తేదీని మార్చాలని కోరతానన్న మాధవ్.. న్యాఃయ నిపుణుల సలహాలు తీసుకున్నాకే విచారణకు హాజరయ్యే విషయాన్ని ఆలోచిస్తానని తెలిపారు. అప్పటిదాకా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించిన మాధవ్… రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతోందని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

This post was last modified on February 27, 2025 8:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

1 hour ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago