Political News

ఈ బంధం ద్రుఢం.. క‌మ్మ‌-కాపు పాలిటిక్స్ స‌క్సెస్‌.. !

“చిన్న చిన్న క‌ష్టాలు ఉంటే స‌ర్దుకుంటాయి. వాటిని భూత‌ద్దంలో చూడాల్సిన అవ‌స‌రం లేదు. మేం క‌లిసే ఉంటాం.. విడిపోం!” అంటూ అసెంబ్లీ వేదిక‌గా.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. మ‌రో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో తాము అధికారంలోనే ఉంటామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఈ ప‌రిణామాల‌పై రాష్ట్రంలోని రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌సాగింది. 2024 ఎన్నిక‌ల‌కు ముందు కాపు, క‌మ్మ స‌మాజాన్ని ఏకం చేయ‌డం ద్వారా మెజారిటీ ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఈ కూట‌మి స‌క్సెస్ అయింది.

అయితే.. దీనిని ర‌క్తిక‌ట్టించ‌కుండా అడ్డుకునేందుకు వైసీపీ అనేక వ్యూహ ప్ర‌తివ్యూహాలు వేసింది. కాపు నాయ‌కుల ద్వారానే కాగ‌ల కార్యం.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించినా.. స‌క్సెస్ కాలేదు. ఇక‌, ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరిగిపోయింద‌ని.. ఇది త‌మ‌కుసానుకూలంగా మారుతుంద‌ని చెప్పుకొచ్చారు. అయితే.. దీనికి ఆలంబ‌న‌గా.. క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన‌కు, టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న వివాదాలు కార‌ణం కావొచ్చ‌న్న చ‌ర్చ ఉంది. కానీ, దీనిని జ‌న‌సేన అధినేత లైట్ తీసుకుంటున్నారనే విష‌యం తాజాగా స్ప‌ష్ట‌మైంది.

ఎన్ని వివాదాలు వ‌చ్చినా.. జ‌న‌సేన – టీడీపీ కూట‌మి విడిపోద‌న్న సంకేతాలు బ‌లంగా ఇచ్చారు. ఇదే వాస్త‌వం అయితే.. భ‌విష్యతులో కొంత వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ.. సామాజిక వ‌ర్గాల ప‌రంగా ఉన్న బ‌లాన్ని ఏకం చేసే అవకాశం మెండుగానే ఉంటుంది. నిజానికి జ‌గ‌న్ చెబుతున్న‌ట్టుగా క్షేత్ర‌స్థాయిలో కాపు, క‌మ్మ సామాజిక వ‌ర్గాల మ‌ధ్య చిన్న‌పాటి వివాదాలు , విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు వ‌చ్చే స‌రికి.. క‌మ్మ‌లు చంద్ర‌బాబును వ‌దులుకునే అవ‌స‌రం, అవ‌కాశం లేదు. అదేస‌మ‌యంలో కాపులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను వ‌దులుకునే సాహ‌సం చేయ‌బోర‌న్న‌ది వాస్త‌వం.

ఈ నేప‌థ్యంలో ఓట‌ర్లు క్షేత్ర‌స్థాయి నాయ‌కుల కంటే కూడా.. హెడ్ ట్యాంకును న‌మ్ముకున్న‌ట్టుగా అగ్ర‌నేత‌ల‌ను న‌మ్ముకునే అవ‌కాశం మెండుగా ఉంటుంది. దీనిని ఊహించే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ ప్ర‌క‌ట‌న చేసి ఉంటారు. స‌హ‌జంగా.. పార్టీలో విభేదాలు ఇప్పుడు కొత్త‌కాదు. గ‌తంలోనూ ఎన్నిక‌ల‌కు ముందు అనేక మంది టికెట్ల విష‌యంలో వివాదానికి సిద్ధ‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో మ‌న‌కు బ‌లం లేదు.. అంటూ.. వారిని ప‌వ‌న్ క‌ల్యాణ్ అనున‌యించారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ప్ర‌స్తుతం ఉన్న బ‌లాన్నిచూపించి.. ఆయ‌న నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను లైన్‌లో పెట్టుకునే అవ‌కాశం ఉంది త‌ప్ప‌.. వైసీపీకి ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం లేద‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

6 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

6 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

8 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

9 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

11 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

11 hours ago