“చిన్న చిన్న కష్టాలు ఉంటే సర్దుకుంటాయి. వాటిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. మేం కలిసే ఉంటాం.. విడిపోం!” అంటూ అసెంబ్లీ వేదికగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో తాము అధికారంలోనే ఉంటామని కూడా ఆయన చెప్పారు. ఈ పరిణామాలపై రాష్ట్రంలోని రాజకీయ నేతల మధ్య చర్చసాగింది. 2024 ఎన్నికలకు ముందు కాపు, కమ్మ సమాజాన్ని ఏకం చేయడం ద్వారా మెజారిటీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేయడంతో ఈ కూటమి సక్సెస్ అయింది.
అయితే.. దీనిని రక్తికట్టించకుండా అడ్డుకునేందుకు వైసీపీ అనేక వ్యూహ ప్రతివ్యూహాలు వేసింది. కాపు నాయకుల ద్వారానే కాగల కార్యం.. అన్నట్టుగా వ్యవహరించినా.. సక్సెస్ కాలేదు. ఇక, ఇప్పుడు వైసీపీ అధినేత జగన్.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని.. ఇది తమకుసానుకూలంగా మారుతుందని చెప్పుకొచ్చారు. అయితే.. దీనికి ఆలంబనగా.. క్షేత్రస్థాయిలో జనసేనకు, టీడీపీ నేతలకు మధ్య జరుగుతున్న వివాదాలు కారణం కావొచ్చన్న చర్చ ఉంది. కానీ, దీనిని జనసేన అధినేత లైట్ తీసుకుంటున్నారనే విషయం తాజాగా స్పష్టమైంది.
ఎన్ని వివాదాలు వచ్చినా.. జనసేన – టీడీపీ కూటమి విడిపోదన్న సంకేతాలు బలంగా ఇచ్చారు. ఇదే వాస్తవం అయితే.. భవిష్యతులో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. సామాజిక వర్గాల పరంగా ఉన్న బలాన్ని ఏకం చేసే అవకాశం మెండుగానే ఉంటుంది. నిజానికి జగన్ చెబుతున్నట్టుగా క్షేత్రస్థాయిలో కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య చిన్నపాటి వివాదాలు , విభేదాలు ఉన్నప్పటికీ.. ఓటు బ్యాంకు రాజకీయాలకు వచ్చే సరికి.. కమ్మలు చంద్రబాబును వదులుకునే అవసరం, అవకాశం లేదు. అదేసమయంలో కాపులు పవన్ కల్యాణ్ను వదులుకునే సాహసం చేయబోరన్నది వాస్తవం.
ఈ నేపథ్యంలో ఓటర్లు క్షేత్రస్థాయి నాయకుల కంటే కూడా.. హెడ్ ట్యాంకును నమ్ముకున్నట్టుగా అగ్రనేతలను నమ్ముకునే అవకాశం మెండుగా ఉంటుంది. దీనిని ఊహించే పవన్ కల్యాణ్ ఈ ప్రకటన చేసి ఉంటారు. సహజంగా.. పార్టీలో విభేదాలు ఇప్పుడు కొత్తకాదు. గతంలోనూ ఎన్నికలకు ముందు అనేక మంది టికెట్ల విషయంలో వివాదానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో మనకు బలం లేదు.. అంటూ.. వారిని పవన్ కల్యాణ్ అనునయించారు. ఇక, వచ్చే ఎన్నికల నాటికి.. ప్రస్తుతం ఉన్న బలాన్నిచూపించి.. ఆయన నాయకులు, కార్యకర్తలను లైన్లో పెట్టుకునే అవకాశం ఉంది తప్ప.. వైసీపీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 27, 2025 2:10 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…