Political News

ఈ బంధం ద్రుఢం.. క‌మ్మ‌-కాపు పాలిటిక్స్ స‌క్సెస్‌.. !

“చిన్న చిన్న క‌ష్టాలు ఉంటే స‌ర్దుకుంటాయి. వాటిని భూత‌ద్దంలో చూడాల్సిన అవ‌స‌రం లేదు. మేం క‌లిసే ఉంటాం.. విడిపోం!” అంటూ అసెంబ్లీ వేదిక‌గా.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. మ‌రో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో తాము అధికారంలోనే ఉంటామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఈ ప‌రిణామాల‌పై రాష్ట్రంలోని రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌సాగింది. 2024 ఎన్నిక‌ల‌కు ముందు కాపు, క‌మ్మ స‌మాజాన్ని ఏకం చేయ‌డం ద్వారా మెజారిటీ ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఈ కూట‌మి స‌క్సెస్ అయింది.

అయితే.. దీనిని ర‌క్తిక‌ట్టించ‌కుండా అడ్డుకునేందుకు వైసీపీ అనేక వ్యూహ ప్ర‌తివ్యూహాలు వేసింది. కాపు నాయ‌కుల ద్వారానే కాగ‌ల కార్యం.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించినా.. స‌క్సెస్ కాలేదు. ఇక‌, ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరిగిపోయింద‌ని.. ఇది త‌మ‌కుసానుకూలంగా మారుతుంద‌ని చెప్పుకొచ్చారు. అయితే.. దీనికి ఆలంబ‌న‌గా.. క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన‌కు, టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న వివాదాలు కార‌ణం కావొచ్చ‌న్న చ‌ర్చ ఉంది. కానీ, దీనిని జ‌న‌సేన అధినేత లైట్ తీసుకుంటున్నారనే విష‌యం తాజాగా స్ప‌ష్ట‌మైంది.

ఎన్ని వివాదాలు వ‌చ్చినా.. జ‌న‌సేన – టీడీపీ కూట‌మి విడిపోద‌న్న సంకేతాలు బ‌లంగా ఇచ్చారు. ఇదే వాస్త‌వం అయితే.. భ‌విష్యతులో కొంత వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ.. సామాజిక వ‌ర్గాల ప‌రంగా ఉన్న బ‌లాన్ని ఏకం చేసే అవకాశం మెండుగానే ఉంటుంది. నిజానికి జ‌గ‌న్ చెబుతున్న‌ట్టుగా క్షేత్ర‌స్థాయిలో కాపు, క‌మ్మ సామాజిక వ‌ర్గాల మ‌ధ్య చిన్న‌పాటి వివాదాలు , విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు వ‌చ్చే స‌రికి.. క‌మ్మ‌లు చంద్ర‌బాబును వ‌దులుకునే అవ‌స‌రం, అవ‌కాశం లేదు. అదేస‌మ‌యంలో కాపులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను వ‌దులుకునే సాహ‌సం చేయ‌బోర‌న్న‌ది వాస్త‌వం.

ఈ నేప‌థ్యంలో ఓట‌ర్లు క్షేత్ర‌స్థాయి నాయ‌కుల కంటే కూడా.. హెడ్ ట్యాంకును న‌మ్ముకున్న‌ట్టుగా అగ్ర‌నేత‌ల‌ను న‌మ్ముకునే అవ‌కాశం మెండుగా ఉంటుంది. దీనిని ఊహించే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ ప్ర‌క‌ట‌న చేసి ఉంటారు. స‌హ‌జంగా.. పార్టీలో విభేదాలు ఇప్పుడు కొత్త‌కాదు. గ‌తంలోనూ ఎన్నిక‌ల‌కు ముందు అనేక మంది టికెట్ల విష‌యంలో వివాదానికి సిద్ధ‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో మ‌న‌కు బ‌లం లేదు.. అంటూ.. వారిని ప‌వ‌న్ క‌ల్యాణ్ అనున‌యించారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ప్ర‌స్తుతం ఉన్న బ‌లాన్నిచూపించి.. ఆయ‌న నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను లైన్‌లో పెట్టుకునే అవ‌కాశం ఉంది త‌ప్ప‌.. వైసీపీకి ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం లేద‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 27, 2025 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

3 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

6 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

7 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

8 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

8 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

8 hours ago