టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. ‘వన్ మ్యాన్ ఆర్మీ’ అన్న మాటను సార్థకం చేసుకున్నారు. తన శైలికి చాలా భిన్నంగా.. నారా లోకేష్ వ్యవహరించి.. విమర్శకుల నుంచి కూడా మెప్పు పొందుతున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. తాజాగా శాసన మండలిలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు.. ప్రతిపక్ష సభ్యులకు సూటిగా.. సుత్తిలేకుండా చెప్పిన సమాధానాలు వంటివి నారా లోకేష్ను వన్ మ్యాన్ ఆర్మీగా నిలబెట్టాయి. నిజానికి ఆయనకు శాసన మండలి కొత్తకాదు. 2017-22 వరకు కూడా.. ఆయన శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. అయితే.. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత.. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు.
ముఖ్యంగా మూడు రాజధానుల వ్యవహారం మండలికి వచ్చినప్పుడు.. చాలా దూకుడుగా నారా లోకేష్ వ్యవహరించారు. ఆ బిల్లును నిలువరించడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. అయితే.. అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపించడం గమనార్హం. అప్పట్లో విపక్షంలో ఉండడంతో అధికార పార్టీపై దూకుడు ప్రదర్శిస్తే.. తాజాగా అదికార పక్షంలో ఉన్న నాయకుడిగా.. మంత్రిగా చాలా పరిణితి ప్రదర్శించారు. ముఖ్యంగా .. రాష్ట్ర ప్రయోజనాల వ్యవహారాలపై మాట్లాడిన సందర్భంలో “రండి అందరం కలిసి పనిచేద్దాం. రాష్ట్రాన్నిఅభివృద్ధి చేద్దాం” అని చెప్పిన మాట నభూతో అనే చెప్పాలి.
సాదారణంగా ఒక సభలో ప్రతిపక్ష నాయకులను కలుపుకొని పోతామంటూ.. నాయకులు వ్యవహరించిన విధానం ఇప్పటి వరకు లేదు. ఇది నారా లోకేష్ తొలిసారి చేసిన ప్రయోగమనే చెప్పాలి. ఇదేసమయంలో లెక్కలు, పద్దులు చెప్పాల్సివచ్చినప్పుడు కూడా ఎక్కడా తడబడకుండా.. వాటిని వల్లెవేశారు. అదేసమయంలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేస్తున్నప్పుడు.. చూస్తూ కూర్చోకుండా.. వారిని వారించే ప్రయత్నం చేసి.. ‘పెద్ద తరహా’లో వ్యవహారించారు. అదేసమయంలో ప్రభుత్వంపై ఆరోణలు చేసినప్పుడు.. వాటిలో పసలేదన్న విషయాన్ని చెప్పే సమయంలో అంతే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకరకంగా.. చెప్పాలంటే.. అన్ని రసాలను పోషించారన్న మాట. ఇది అంత ఈజీ అయిన విషయం కాదు. మండలిలో బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కొంటూ.. అదేసమయంలో వివాదాలకు తావులేకుండా సమాధానం చెబుతూ.. మరోవైపు.. రాష్ట్ర భవిష్యత్తు ముఖ చిత్రాన్ని ఆవిష్కరించడం ద్వారా నారా లోకేష్ వన్ మ్యాన్ ఆర్మీగా టీడీపీకి, కూటమి సర్కారుకు బలమైన బూస్ట్ ఇచ్చార న్న వాదనలో వాస్తవం ఖచ్చితంగా ఉంది. ఎక్కడా తడబాటు లేకుండా.. ఆయన వ్యవహరించిన తీరు మండలిలో అందరికీ ఆకట్టుకుంది. ముఖ్యంగా విమర్శకుల నుంచి కూడా.. ప్రశంసలు అందుకునేలా చేసింది.
This post was last modified on February 27, 2025 2:03 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…