వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టుపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏమీ అమలు కావడం లేదని ఆయన అన్నారు. ఎవరి పాపాలకు వారు మూల్యం చెల్లించక తప్పదని కూడా అనగాని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పోసాని వ్యవహారంలోనూ ఇదే జరిగిందని ఆయన అన్నారు. గత పాపాలకు ఫలితం అనుభవించక తప్పదని ఆయన పేర్కొన్నారు.
రాజకీయాల్లో అయినా… ఇంకే రంగంలో అయినా వ్యక్తిగత దూషణలకు తావు లేదని అనగాని అన్నారు. వ్యక్తిగత విమర్శలు సరికాదన్న విషయం ఒక్క వైసీపీకో, ఒక్క టీడీపీలో వర్తించేది కాదని… అందరికీ, అన్ని పార్టీలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. వ్యక్తిగత విమర్శల ద్వారా ఆయా వ్యక్తులు, వారి కుటుంబాలు ఎంతగా ఇబ్బంది పడతాయన్నవిషయాన్ని ఆరోపణలు గుప్పించే వారు పట్టించుకోరని అనగాని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అవతలి వారి స్వేచ్ఛకు భంగం కలిగించేవేనని కూడా ఆయన తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే… వైసీపీలో కొనసాగిన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై పోసాని వరుసగా పరుష పదజాలాన్ని వినియోగించి దూషణలకు దిగిన సంగతి తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి గెలిచినంతనే… తనకు బెదిరింపులు వస్తున్నాయని పోసాని ఆరోపించారు. ఆ తర్వాత తాను గతంలో చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా వైసీపీకి రాజీనామా చేస్తున్నానని.. ఇకపై రాజకీయాల జోలికే రానని, రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని కూడా పోసాని పేర్కొన్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 27, 2025 1:28 pm
బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల…
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…