వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు వ్యవహారం పోలీసుల మెడకు చుట్టుకోవడం ఖాయమేనా? అన్నదిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఓ సెలబ్రిటీని అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసులు అన్ని అంశాలను పక్కాగా ఉన్నాయో, లేవో చూసుకుని మరీ ముందుకు సాగాల్సి ఉంది. అయితే ఏమరపాటుగా జరిగిందో… లేదంటే కావాలనే అలా చేశారో తెలియదు గానీ.. పోసాని అరెస్టు సందర్భంగా పోలీసులు ఓ తప్పు చేశారు. అది ఇప్పుడు వారి మెడకు చుట్టుకోవడం ఖాయమేనని నిపుణులు చెబుతున్నారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు విపక్షంలో ఉండగా… వైసీపీ నేత హోదాలో పోసాని వారిపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించిన పోసాని.. ఏపీలో వరుసబెట్టి జరుగుతున్న అరెస్టుల నేపథ్యంలో…గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పేశారు. వైసీపీకి రాజీనామా చేశారు. ఇకపై రాజకీయాల జోలికి వెళ్లను మహాప్రభో.. తనను వదిలేయాలంటూ వేడుకున్నారు. అయితే గతంలో ఆయన బాబు, లోకేశ్, పవన్ లపై చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని పలు ప్రాంతాల్లో నమోదు అయిన కేసులను తీసుకుని బుధవారం హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఐడీ పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పోసానిని అరెస్టు చేస్తున్నట్లుగా సీఐడీ అదికారులు పోసాని సతీమణికి నోటీసులు అందజేశారు. ఈ నోటీసుల్లో తేదీని పోలీసులు తప్పుగా పేర్కొన్నారు. బుధవారం తేదీ 26 2 2025 కాగా… దానికి బదులుగా 27 2 2025 అని డేట్ వేసి ఇచ్చారు. హడావిడిలో పోసాని గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ దానిని చూసుకోలేదు. పోలీసులు అదుపులోకి తీసుకోగానే… పోసాని కూడా పోలీస్ జీపు ఎక్కేశారు. ఆ తర్వాత పోలీసులు ఇచ్చిన నోటీసును పోసాని కుటుంబ సభ్యులు ఒకింత పరిశీలించి చూడగా… అందులో డేట్ తప్పుగా ఉంది. దీనిని వారు తమకు తెలిసిన వారి దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఇచ్చిన కాపీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా కాపీని పట్టుకున్న వైసీపీ నేతలు… పోలీసులు కావాలనే ఇలా తర్వాతి రోజు డేట్ వేసి… దానికి ముందు రోజే పోసానిని అరెస్ట్ చేశారని, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందంటూ ఆరోపిస్తున్నారు. ఈ పరిణామంపై కోర్టుల్లోనూ పోసాని వర్గం ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. దీంతో పోలీసులకు చిక్కులు తప్పేలా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 27, 2025 10:25 am
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…