టాలీవుడ్ ప్రముఖ నటుడు, మొన్నటిదాకా వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హార్డ్ కోర్ ఫ్యాన్ గా వ్యవహరించిన పోసాని కృష్ణ మురళి అరెస్టయ్యారు. ఏపీ నుంచి వచ్చిన పోలీసులు…హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోం భుజాలో నివాసం ఉంటున్న కృష్ణమురళి నివాసంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు చెందిన కీలక నేతలపైై ఘాటు పదజాలంతో పోసాని దూషించిన సంగతి తెలిసిందే.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ లు విపక్షంలో ఉండగా… వారిపై పోసాని ఘాటు పదాలతో విరుచుకుపడేవారు. వైసీపీ నేతగా ఉంటూనే సినిమాలకు ఇబ్బంది లేకుండా సాగిన పోసాని… ఎప్పుడు ఏ అవకాశం లభించినా…చంద్రబాబు, లోకేశ్, పవన్ లను తులనాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసేవారు. చంద్రబాబును పోసాని టార్గెట్ చేసినంతగా మరెవరూ చేయలేదంటే కూడా అతిశయోక్తి కాదేమో. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారం చేపట్టగానే…ఒక్కసారిగా పోసాని ఆత్మరక్షణలో పడిపోయారు.
అంతేకాకుండా గతంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో బెంబేలెత్తిపోయిన పోసాని… వైసీపీకి రాజీనామా చేశారు. తన వ్యాఖ్యలు బాదించి ఉంటే సారీ అంటూ బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. ఇకపై రాజకీయాల జోలికి వెళ్లబోనని, రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించారు. ఇదంతా జరిగిన తర్వాత కొంతకాలం పాటు బాగానే ఉన్నా.. ఉన్నట్టుండి బుధవారం రాత్రి కడప జిల్లా రాయచోటి పోలీసులు పోసాని ఇంటి తలుపు తట్టారు. రాయచోటి పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసులో అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ఆయనకు తెలియజేశారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని రాయచోటికి తరలిస్తున్నారు.
This post was last modified on February 26, 2025 10:16 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…