టాలీవుడ్ ప్రముఖ నటుడు, మొన్నటిదాకా వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హార్డ్ కోర్ ఫ్యాన్ గా వ్యవహరించిన పోసాని కృష్ణ మురళి అరెస్టయ్యారు. ఏపీ నుంచి వచ్చిన పోలీసులు…హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోం భుజాలో నివాసం ఉంటున్న కృష్ణమురళి నివాసంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు చెందిన కీలక నేతలపైై ఘాటు పదజాలంతో పోసాని దూషించిన సంగతి తెలిసిందే.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ లు విపక్షంలో ఉండగా… వారిపై పోసాని ఘాటు పదాలతో విరుచుకుపడేవారు. వైసీపీ నేతగా ఉంటూనే సినిమాలకు ఇబ్బంది లేకుండా సాగిన పోసాని… ఎప్పుడు ఏ అవకాశం లభించినా…చంద్రబాబు, లోకేశ్, పవన్ లను తులనాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసేవారు. చంద్రబాబును పోసాని టార్గెట్ చేసినంతగా మరెవరూ చేయలేదంటే కూడా అతిశయోక్తి కాదేమో. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారం చేపట్టగానే…ఒక్కసారిగా పోసాని ఆత్మరక్షణలో పడిపోయారు.
అంతేకాకుండా గతంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో బెంబేలెత్తిపోయిన పోసాని… వైసీపీకి రాజీనామా చేశారు. తన వ్యాఖ్యలు బాదించి ఉంటే సారీ అంటూ బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. ఇకపై రాజకీయాల జోలికి వెళ్లబోనని, రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించారు. ఇదంతా జరిగిన తర్వాత కొంతకాలం పాటు బాగానే ఉన్నా.. ఉన్నట్టుండి బుధవారం రాత్రి కడప జిల్లా రాయచోటి పోలీసులు పోసాని ఇంటి తలుపు తట్టారు. రాయచోటి పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసులో అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ఆయనకు తెలియజేశారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని రాయచోటికి తరలిస్తున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…