Political News

మోదీతో రేవంత్ భేటీ…గంటసేపు కీలక చర్చ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. మోదీతో బేటీ కోసం మంగళవారం రాత్రికే రేవంత్ ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అదికారిక నివాసం చేరుకున్న రేవంత్… అక్కడే మోదీతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతల భేటీ గంటకు పైగానే కొనసాగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీఎంతో మోదీ గంటకు పైగానే భేటీ కావడం గమనార్హం.

ఈ భేటీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం గురించి రేవంత్ ప్రదానంగా ప్రస్తావించినట్లు సమాచారం. మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇతోదిక సహకారం అవసరమని రేవంత్ చెప్పారట. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పలు పద్దుల కింద కేంద్రం నుంచి విడుదల కానున్న నిధులను కూడా ప్రస్తావించిన రేవంత్… నిధుల సత్వర విడుదల కోసం మోదీని ప్రత్యేకంగా అభ్యర్థించినట్లు సమాచారం. రేవంత్ అభ్యర్థనలకు మోదీ నుంచి సానుకూల స్పందన లభించిందని సీఎంఓ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే… శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో చిక్కుకుపోయిన కార్మికులు, వారిని బయటకు తీసుకువచ్చేందుకు సాగుతున్న సహాయక చర్యలపైనా మోదీ, రేవంత్ ల భేటీలో కీలక చర్చ జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన రోజే రేవంత్ కు మోదీ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి ఎలాంటి సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన మోదీ… అప్పటికప్పుడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తెలంగాణకు పంపారు. తాజాగా అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, తాజా స్థితిగతులను మోదీకి రేవంత్ వివరించినట్లు సమాచారం. వీలయినంత త్వరగా కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన ప్రధానికి వివరించారు.

This post was last modified on February 26, 2025 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

3 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

6 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

7 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

8 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

8 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

8 hours ago