Political News

మోదీతో రేవంత్ భేటీ…గంటసేపు కీలక చర్చ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. మోదీతో బేటీ కోసం మంగళవారం రాత్రికే రేవంత్ ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అదికారిక నివాసం చేరుకున్న రేవంత్… అక్కడే మోదీతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతల భేటీ గంటకు పైగానే కొనసాగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీఎంతో మోదీ గంటకు పైగానే భేటీ కావడం గమనార్హం.

ఈ భేటీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం గురించి రేవంత్ ప్రదానంగా ప్రస్తావించినట్లు సమాచారం. మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇతోదిక సహకారం అవసరమని రేవంత్ చెప్పారట. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పలు పద్దుల కింద కేంద్రం నుంచి విడుదల కానున్న నిధులను కూడా ప్రస్తావించిన రేవంత్… నిధుల సత్వర విడుదల కోసం మోదీని ప్రత్యేకంగా అభ్యర్థించినట్లు సమాచారం. రేవంత్ అభ్యర్థనలకు మోదీ నుంచి సానుకూల స్పందన లభించిందని సీఎంఓ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే… శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో చిక్కుకుపోయిన కార్మికులు, వారిని బయటకు తీసుకువచ్చేందుకు సాగుతున్న సహాయక చర్యలపైనా మోదీ, రేవంత్ ల భేటీలో కీలక చర్చ జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన రోజే రేవంత్ కు మోదీ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి ఎలాంటి సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన మోదీ… అప్పటికప్పుడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తెలంగాణకు పంపారు. తాజాగా అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, తాజా స్థితిగతులను మోదీకి రేవంత్ వివరించినట్లు సమాచారం. వీలయినంత త్వరగా కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన ప్రధానికి వివరించారు.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

2 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

3 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

3 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

3 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

4 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

6 hours ago