ఏపీకి మంగళవారం ఓ విశిష్ట అతిథి విచ్చేశారు. నేరుగా ఏపీ రాజదాని అమరావతి వచ్చిన సదరు అతిథి… ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోనూ భేటీ అయ్యారు. ఆ విశిష్ట అతిథి మరెవరో కాదు… ఈ తరం నేతలంతా వీహెచ్ గా… ఆత్మీయులంతా హన్మన్నగా పిలుచుకునే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు. మంగళవారం హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఆయన ఉదయం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం సాయంత్రం వేళ ఆయన పవన్ తో భేటీ అయ్యారు.
ఉదయం వేళ చంద్రబాబును కలిసిన వీహెచ్… చంద్రబాబుతో కలిసి నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోను చూసినంతనే ఏదో మర్యాదపూర్వక భేటీనే అని అంతా అనుకున్నారు. ఏదో వ్యక్తిగత పనో, లేదంటే… ఆన్ ద వే జర్నీలో భాగంగానో అమరావతిలో ఆగిన వీహెచ్ పనిలో పనిగా చంద్రబాబును పలకరించి వెళదాం అన్నట్లుగా సాగి ఉంటారన్న వాదనలు వినిపించాయి. అయితే కొందరు మాత్రం బాబు, వీహెచ్ ల భేటీ వెనుక ఏదో పెద్ద రాజకీయ వ్యూహమే ఉందంటూ విశ్లేషణలు ప్రారంభించారు. కొందరైతే ఏకంగా తెలంగాణ టీడీపీ పగ్గాలు వీహెచ్ తీసుకుంటారా? అన్న కోణంలోనూ కథనాలు అల్లేశారు.
తీరా సాయంత్రం వేళ… మంగళగిరిలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వీహెచ్.. డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హన్మన్న చేతిలో ఏవో కొన్ని పత్రాలు కనిపించాయి. ఆ పత్రాలను పవన్ చేతిలో పెట్టిన వీహెచ్… ఆయన పక్కనే మంచంపై కూర్చుని వీహెచ్ దాని గురించి వివరించారు. ఆ సంగతేమిటన్న విషయంలోకి వెళితే.. ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన దివంగత కాంగ్రెస్ నేత దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని, ఆయన పేరిట ఓ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని అందులో పవన్ ను వీహెచ్ కోరారు. సామాజిక పింఛన్లతో పాటు కార్మికులు పలు సౌకర్యాల అందజేతకు బీజం వేసిన దామోదరం సేవలను మరిచిపోరాదని ఈ సందర్భంగా వీహెచ్ గుర్తు చేశారట. మరి ఈ వినతి పత్రాన్ని వీహెచ్.. చంద్రబాబుకు కూడా ఇచ్చారా? లేదా? అన్న విషయం అయితే తెలియరాలేదు.
This post was last modified on February 26, 2025 10:05 am
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…