ఏపీకి మంగళవారం ఓ విశిష్ట అతిథి విచ్చేశారు. నేరుగా ఏపీ రాజదాని అమరావతి వచ్చిన సదరు అతిథి… ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోనూ భేటీ అయ్యారు. ఆ విశిష్ట అతిథి మరెవరో కాదు… ఈ తరం నేతలంతా వీహెచ్ గా… ఆత్మీయులంతా హన్మన్నగా పిలుచుకునే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు. మంగళవారం హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఆయన ఉదయం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం సాయంత్రం వేళ ఆయన పవన్ తో భేటీ అయ్యారు.
ఉదయం వేళ చంద్రబాబును కలిసిన వీహెచ్… చంద్రబాబుతో కలిసి నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోను చూసినంతనే ఏదో మర్యాదపూర్వక భేటీనే అని అంతా అనుకున్నారు. ఏదో వ్యక్తిగత పనో, లేదంటే… ఆన్ ద వే జర్నీలో భాగంగానో అమరావతిలో ఆగిన వీహెచ్ పనిలో పనిగా చంద్రబాబును పలకరించి వెళదాం అన్నట్లుగా సాగి ఉంటారన్న వాదనలు వినిపించాయి. అయితే కొందరు మాత్రం బాబు, వీహెచ్ ల భేటీ వెనుక ఏదో పెద్ద రాజకీయ వ్యూహమే ఉందంటూ విశ్లేషణలు ప్రారంభించారు. కొందరైతే ఏకంగా తెలంగాణ టీడీపీ పగ్గాలు వీహెచ్ తీసుకుంటారా? అన్న కోణంలోనూ కథనాలు అల్లేశారు.
తీరా సాయంత్రం వేళ… మంగళగిరిలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వీహెచ్.. డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హన్మన్న చేతిలో ఏవో కొన్ని పత్రాలు కనిపించాయి. ఆ పత్రాలను పవన్ చేతిలో పెట్టిన వీహెచ్… ఆయన పక్కనే మంచంపై కూర్చుని వీహెచ్ దాని గురించి వివరించారు. ఆ సంగతేమిటన్న విషయంలోకి వెళితే.. ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన దివంగత కాంగ్రెస్ నేత దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని, ఆయన పేరిట ఓ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని అందులో పవన్ ను వీహెచ్ కోరారు. సామాజిక పింఛన్లతో పాటు కార్మికులు పలు సౌకర్యాల అందజేతకు బీజం వేసిన దామోదరం సేవలను మరిచిపోరాదని ఈ సందర్భంగా వీహెచ్ గుర్తు చేశారట. మరి ఈ వినతి పత్రాన్ని వీహెచ్.. చంద్రబాబుకు కూడా ఇచ్చారా? లేదా? అన్న విషయం అయితే తెలియరాలేదు.
This post was last modified on February 26, 2025 10:05 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…