Political News

బాబు, పవన్ లతో హన్మన్న భేటీ.. మ్యాటరేంటంటే?

ఏపీకి మంగళవారం ఓ విశిష్ట అతిథి విచ్చేశారు. నేరుగా ఏపీ రాజదాని అమరావతి వచ్చిన సదరు అతిథి… ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోనూ భేటీ అయ్యారు. ఆ విశిష్ట అతిథి మరెవరో కాదు… ఈ తరం నేతలంతా వీహెచ్ గా… ఆత్మీయులంతా హన్మన్నగా పిలుచుకునే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు. మంగళవారం హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఆయన ఉదయం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం సాయంత్రం వేళ ఆయన పవన్ తో భేటీ అయ్యారు.

ఉదయం వేళ చంద్రబాబును కలిసిన వీహెచ్… చంద్రబాబుతో కలిసి నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోను చూసినంతనే ఏదో మర్యాదపూర్వక భేటీనే అని అంతా అనుకున్నారు. ఏదో వ్యక్తిగత పనో, లేదంటే… ఆన్ ద వే జర్నీలో భాగంగానో అమరావతిలో ఆగిన వీహెచ్ పనిలో పనిగా చంద్రబాబును పలకరించి వెళదాం అన్నట్లుగా సాగి ఉంటారన్న వాదనలు వినిపించాయి. అయితే కొందరు మాత్రం బాబు, వీహెచ్ ల భేటీ వెనుక ఏదో పెద్ద రాజకీయ వ్యూహమే ఉందంటూ విశ్లేషణలు ప్రారంభించారు. కొందరైతే ఏకంగా తెలంగాణ టీడీపీ పగ్గాలు వీహెచ్ తీసుకుంటారా? అన్న కోణంలోనూ కథనాలు అల్లేశారు.

తీరా సాయంత్రం వేళ… మంగళగిరిలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వీహెచ్.. డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హన్మన్న చేతిలో ఏవో కొన్ని పత్రాలు కనిపించాయి. ఆ పత్రాలను పవన్ చేతిలో పెట్టిన వీహెచ్… ఆయన పక్కనే మంచంపై కూర్చుని వీహెచ్ దాని గురించి వివరించారు. ఆ సంగతేమిటన్న విషయంలోకి వెళితే.. ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన దివంగత కాంగ్రెస్ నేత దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని, ఆయన పేరిట ఓ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని అందులో పవన్ ను వీహెచ్ కోరారు. సామాజిక పింఛన్లతో పాటు కార్మికులు పలు సౌకర్యాల అందజేతకు బీజం వేసిన దామోదరం సేవలను మరిచిపోరాదని ఈ సందర్భంగా వీహెచ్ గుర్తు చేశారట. మరి ఈ వినతి పత్రాన్ని వీహెచ్.. చంద్రబాబుకు కూడా ఇచ్చారా? లేదా? అన్న విషయం అయితే తెలియరాలేదు.

This post was last modified on February 26, 2025 10:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

31 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

8 hours ago