Political News

ఒంగోలు వైసీపీ కాదు… ఒంగోలు జనసేన

ఏపీలో విపక్షం వైసీపీకి మంగళవారం ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి మంచి పట్టు ఉన్న ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో దాదాపుగా పార్టీ ఖాళీ అయిపోయింది. ఒంగోలు నగర పాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్లుగా ఉన్న వారిలో ఏకంగా 20 మంది సోమవారం రాత్రి జనసేనలో చేరిపోయారు. ఇటీవలే జనసేనలో చేరిపోయిన జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వీరంతా పవన్ కల్యాణ్ చేత జనసేన కండువాలు కప్పించుకున్నారు. ఈ చేరికలతో ఒంగోలులో ఇక వైసీపీ ఖాళీ అయిపోయినట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

ఒంగోలు కార్పొరేషన్ కు 2021లో ఎన్నికలు జరగగా… నాడు అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఏకంగా 41 సీట్లను గెలుచుకుంది. టీడీపీకి 6 సీట్లు దక్కగా… ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఓ స్థానాన్ని జనసేన గెలిచింది. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురు కావడం.. టీడీపీ, జనసేన, బీజేపీల ఆధ్వర్యంలోని కూటమికి రికార్డు మెజారిటీ దక్కడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జగన్ మామ బాలినేని స్వయంగా వైసీపీకి రాజీనామా చేసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. ఆ తర్వాత వైసీపీకి చెందిన 19 మంది వైసీపీ కార్పొరేటర్లను ఆయన జనసేనలోకి తీసుకెళ్లిపోయారు. పలితంగా టీడీపీకి మద్దతు పలికిన వీరంతా చర్మన్ పదవితో పాటు వైస్ చైర్మన్ పదవిని టీడీపీ ఖాతాలో వేసేశారు.

తాజాగా వైసీపీలోనే కొనసాగుతున్న 22 మంది కార్పొరేటర్లలో 20 మంది బాలినేని వెంట నడిచేందుకు సిద్ధపడ్డారు. ఇదే విషయాన్ని ఇటీవలే పవన్ వద్ద ప్రస్తావించిన బాలినేని…ఫిబ్రవరిలోనే ఒంగోలు వస్తే గ్రాండ్ గా బహిరంగ సభ ఏర్పాటు చేసి 20 మంది కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకుందామని ప్రతిపాదించారు. అయితే పవన్ అనారోగ్యం, ఇతరత్రా షెడ్యూల్ కారణంగా పవన్ ఒంగోలు టూర్ కు వెళ్లలేకపోయారు. ఇంకెంత కాలం ఆగాలంటూ కార్పొరేటర్లు అడగడంతో బాలినేని ప్లాన్ మార్చేశారు. 20 మంది కార్పొరేటర్లను తీసుకుని పవన్ వద్దకే వెళ్లిపోయారు. అలా మంగళగిరికి వచ్చిన కార్పొరేటర్లు అందరికీ స్వయంగా కండువాలు కప్పిన పవన్.. అందరినీ సాదరగంగా జనసేనలోకి ఆహ్వానించారు. వెరసి ఇప్పుడు ఒంగోలు వైసీపీ కాస్తా… ఒంగోలు జనసేనగా మారిపోయింది.

This post was last modified on February 26, 2025 8:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago