Political News

నేను ఊహించ‌లేదు: ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు అభినందన‌లు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను సీఎం చంద్ర‌బాబు అభినందించారు. అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై ప్ర‌సంగించిన సీఎం.. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చూస్తున్న‌పంచాయ‌తీ రాజ్ ను ప్ర‌స్తావించారు. త‌న శాఖ‌ను పవ‌న్ క‌ల్యాణ్ అద్భుతంగా ముందుకు న‌డిపిస్తున్నార‌ని చెప్పారు. తాను అస్స‌లు ఊహించ‌లేద‌ని.. చాలా బాగా ప‌నిచేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. దీనికిగాను తాను ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నాన‌ని చెప్పారు. ముఖ్యంగా ఏపీలో చేప‌డుతున్న స్వ‌చ్ఛాంద్ర కార్య‌క్ర‌మాన్ని డిప్యూటీ సీఎంగా ఆయ‌న ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్నార‌ని తెలిపారు.

“ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పల్లె పండుగ కార్య‌క్ర‌మం ద్వారా ఒకే రోజు రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ లు పెట్టారు. ఇది అంత తేలిక విష‌యం కాదు. గ‌తంలో మేం అను కున్నా.. చేయ‌లేక‌పోయాం. కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ సాధించారు” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అదేస‌మ‌యంలో మూడో శ‌నివారాన్ని స్వ‌చ్ఛాంద్ర‌కు కేటాయించ‌గానే.. తాను కూడా మూడో శ‌నివారం అన్ని ప‌నులు ప‌క్క‌న పెట్టి దానికోస‌మే క‌ష్ట‌ప‌డు తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఒకే రోజు నిధులు కేటాయించ‌డం ద్వారా ప‌నులు వేగంగా చేసేందుకు ప్ర‌య‌త్నించార‌న్నారు.

అదేవిధంగా గ‌త వైసీపీ పాల‌న‌పైనా చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌తంలో పంచాయ‌తీల సొమ్మునునొక్కేశార‌ని, దారి మ‌ళ్లించార‌ని క‌నీసం మంచినీటి స‌దుపాయాల‌కు కూడా నిధులు ఇవ్వ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. అందుకే పంచాయ‌తీల్లో స‌మ‌స్య‌లు పెరిగిపోయాయ‌ని వ్యాఖ్యానించారు. అలాంటి క్లిష్ట‌మైన శాఖ‌ను కూడా తీసుకుని పవన్ క‌ల్యాణ్ బ్రహ్మాండంగా నాయకత్వం వహించి ముందుకు తీసుకెళుతున్నారని దీనిని చూసి మిగిలిన శాఖల మంత్రులు కూడా స్ఫూర్తి పొందాల‌ని చంద్ర‌బాబు సూచించారు.

గ‌త ప్ర‌భుత్వం ఆర్థిక సంఘం నిధుల‌ను దారి మ‌ళ్లించింద‌న్న ముఖ్య‌మంత్రి.. దీనిపై ఢిల్లీలో ప్ర‌శ్నించిన‌ప్పుడు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితిని ఎదుర్కొన్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. “ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేశారు. ఆ డబ్బులు తిరిగి చెల్లించి సెకండ్ ఇన్ స్టాల్ మెంట్ తీసుకువచ్చిన ఘనత పవన్ కే చెల్లింది” అని చంద్ర‌బాబు అన్నారు. అయితే.. పంచాయ‌తీల్లో గ‌త ఐదేళ్లు ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ప‌నులు నిలిచిపోయాయ‌ని, ర‌హ‌దారుల నిర్మాణం ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయింద‌న్నారు. దీంతో ఇప్పుడు ప‌నులు చేప‌డుతున్నా కొంత మంద‌కొడిగా సాగుతోంద‌ని చెప్పారు. ఈ విష‌యంలో కూడా.. దృష్టి పెడితే.. మ‌రింత‌గా పంచాయ‌తీ వ్య‌వ‌స్థ అభివృద్ది చెందుతుంద‌ని చెప్పారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

3 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

5 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

7 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

8 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

8 hours ago