Political News

సోమిరెడ్డి గారూ.. ‘సందడి’ లేదండి!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతాయని… కూటమి సర్కారును విపక్ష వైసీపీ కడిగిపారేస్తుందని.. వైసీపీ చేసే వాదనలను కూటమి తుత్తునీయలు చేస్తుందని అంతా ఆశించారు. ఆ మేరకే…సోమవారం నాటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా మధ్యాహ్నం దాకా టీవీలకు అతుక్కుపోయాయి. అయితే వారి ఆశలన్నీ అడియాశలే అయిపోయాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతుందనుకున్న వైసీపీ తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరంటూ పాత పాట పాడేసి అసెంబ్లీ సమావేశాలకు ఇక రాబోమంటూ చెప్పేసి వెళ్లిపోయింది. గవర్నర్ ప్రసంగం ముగియగానే.. కూటమి పార్టీలు కూడా ఇంటికెళ్లాయి.

మంగళవారం నాటి సమావేశాలకు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు మాత్రమే సభకు రాగా… వైసీపీ వారు మాత్రం వారి పనుల్లో బిజీ అయిపోయి అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక శాసనమండలికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి పార్టీలకు చెందిన మంత్రుల ఎదురు దాడికి బెంబేలెత్తి మధ్యాహ్నానికే ఇంటికెళ్లిపోయారు. ఫలితంగా ఇటు అసెంబ్లీతో పాటుగా అటు కౌన్సిల్ లోనూ కూటమి పార్టీల ప్రకటనలు, కీలక అంశాల ప్రస్తావనలు తప్పించి… వాడీవేడీ చర్చలు లేకుండాపోయాయి. అయినా విపక్షం లేకుండా జరిగే సమావేశాలను ఏ టీవీ ఛానెల్ అయినా ఎందుకు ప్రసారం చేస్తుంది? అందుకే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పినట్టుగా సందడి అన్నదే కనిపించడం లేదు.

సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ వైఖరిపై సోమిరెడ్డి నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజల్లో తమకు 40 శాతం మంది ఓట్లేశారని చెబుతున్న వైసీపీ… ఆ 40 శాతం ప్రజల సమస్యలపై అయినా చర్చించేందుకు అసెంబ్లీకి రావాలి కదా అని ఆయన వ్యాఖ్యానించారు. విపక్షమన్నది లేకుండా జరిగే సభల్లో సందడే ఉండదని కూడా ఆయన అన్నారు. కనీసం సందడి కోసమైనా వైసీపీ సభ్యులు సభకు రావాలంటూ ఆయన అభిప్రాయపడ్డారు. అయినా నిబంధనల మేరకు దక్కే ప్రధాన ప్రతిపక్ష హోదాను సాకుగా చూపి అసెంబ్లీ సమావేశాలను బాయికాట్ చేయడం ఏమీ బాగోలేదని కూడా సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులు లేకపోవడంతో కొరవడిన సందడిని తిరిగి తీసుకువచ్చేలా చేయాలని జనం సోమిరెడ్డిని కోరుతున్నారు.

This post was last modified on February 25, 2025 3:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

1 hour ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

3 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago