Political News

లోకేశ్ దెబ్బకు వైసీపీ వణికిపోతోందిగా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ దెబ్బకు వైసీపీ నిజంగానే వణికిపోతోందని చెప్పక తప్పదు. ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తీరే నిదర్శనమని చెప్పక తప్పదు. ఇప్పటికే 11 మందితో కూడిన వైసీపీ శాసన సభా పక్షం సమావేశాలకు హాజరయ్యేందుకే వణికిపోతోంది. ఏదో 60 రోజుల నిబంధనతోనే వైసీపీ సభ్యులు సోమవారం నాటి సభకు వచ్చారే తప్పించి… మంగళవారం నాటి సమావేశాల వైపే వారు కన్నెత్తి చూడలేదు. ఇలా సభకు రాకపోవడానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడమే కారణమని వైసీపీ చెబుతున్నా… సభకు వచ్చి అదే అంశంపై పోరాటం చేయవచ్చు కదా అన్న డిమాండ్లు ఒకింత గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే శాసనమండలిలో మెజారిటీ ఉన్న వైసీపీ నిర్మాణాత్మక ఆరోపణలు చేయడంలో ఎందుకు విఫలమవుతోందన్న ప్రశ్నలూ ఇప్పుడు కొత్తగా తెర మీదకు వస్తున్నాయి.

మంగళవారం నాటి సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాలు ప్రారంభం కాగా… అవకాశం వచ్చినా కూడా దానిని వైసీపీ సద్వినియోగం చేసుకోలేకపోతోందని చెప్పాలి. వైసీపీ తరఫున మాట్లాడిన వరుదు కల్యాణి గానీ, చంద్రశేఖర రెడ్డి గానీ.. అధికార పక్షాన్ని నిర్మాణాత్మక ప్రశ్నలతో నిలువరించలేకపోయారు. ఏదో అధికార పక్షాన్ని తమదైన శైలి ఆరోపణలతో టార్గెట్ చేయడానికి యత్నించిన వైసీపీ వాదనలను ఎప్పటికప్పుడు లోకేశ్ సమర్థంగా తిప్పికొట్టిన తీరు ఆకట్టుకుంది. నోటి మాటలతో కాకుండా ఆధారాలతో విపక్షం ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పిన లోకేశ్… అదే సమయంలో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులతో పాటుగా ఎంతో అనుభవం ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా బదులు ఇచ్చేందకు నానా తంటాలు పడ్డారు.

కేంద్రం నుంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువచ్చే విషయంలో అయినా… విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల రాజీనామాల విషయంలో అయినా వైసీపీ వాదనలను లోకేశ్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఒకేసారి వర్సిటీల వీసీల రాజీనామాలకు బెదిరింపులే కారణమన్న చంద్రశేఖరరెడ్డి ఆరోపణలకు వేగంగా స్పందించిన లోకేశ్… అందుకు ఆధారాలు ఇవ్వాలంటూ విపక్షాన్ని నిలదీశారు. ఈ సమయంలో కల్పించుకున్నబొత్స విచారణకు ఆదేశాలు జారీ చేయాలని కోరగా.. ఆధారాలు లేకుండా వైసీపీ చెప్పిన ప్రతి అంశం ఆధారంగా విచారణలకు ఆదేశిస్తూ సాగలేమని తేల్చి చెప్పారు. ఆధారాలు ఉంటే ఇస్తే.. విచారణకు తనకేమీ అభ్యంతరం లేదని, ఆధారాలు ఇస్తే.. ఇక్కడికిక్కడే విచారణకు ఆదేశాలు ఇస్తానని లోకేశ్ చెప్పడంతో బొత్స కూడా బదులు చెప్పలేక అలా కూర్చుండిపోయారు. మొత్తంగా తనదైన శైలిలో సత్తా చాటిన లోకేశ్… మెజారిటీ ఉన్న మండలిలోనూ వైసీపీని వణికించేశారని చెప్పక తప్పదు.

Satya

Recent Posts

చరణ్ లైనప్ లో పెద్ది ఇంపాక్ట్

పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్‌లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్‌ని నిలబెట్టుకోవాలి.…

4 minutes ago

ప్రమోషన్లు నిల్లు… సినిమా కిల్లు

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…

20 minutes ago

సినిమా థియేటర్ లో స్పిరిట్ షూట్ ఎలాగయ్య వంగా

టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్‌లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…

46 minutes ago

అర్జున్ మార్కెట్ బ్రతికే ఉంది

ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…

2 hours ago

15 ఏళ్ల సూర్యవంశీ… రికార్డులేంటి స్వామి…!

రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్‌ను పూర్తిగా తన సొంతం…

2 hours ago

ఆర్సీబీ గెలిస్తే ఆస్తులు ధ్వంసం చేస్తారా… ఇదెక్కడి ఫ్యానిజం?

​ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…

3 hours ago