Political News

లోకేశ్ దెబ్బకు వైసీపీ వణికిపోతోందిగా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ దెబ్బకు వైసీపీ నిజంగానే వణికిపోతోందని చెప్పక తప్పదు. ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తీరే నిదర్శనమని చెప్పక తప్పదు. ఇప్పటికే 11 మందితో కూడిన వైసీపీ శాసన సభా పక్షం సమావేశాలకు హాజరయ్యేందుకే వణికిపోతోంది. ఏదో 60 రోజుల నిబంధనతోనే వైసీపీ సభ్యులు సోమవారం నాటి సభకు వచ్చారే తప్పించి… మంగళవారం నాటి సమావేశాల వైపే వారు కన్నెత్తి చూడలేదు. ఇలా సభకు రాకపోవడానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడమే కారణమని వైసీపీ చెబుతున్నా… సభకు వచ్చి అదే అంశంపై పోరాటం చేయవచ్చు కదా అన్న డిమాండ్లు ఒకింత గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే శాసనమండలిలో మెజారిటీ ఉన్న వైసీపీ నిర్మాణాత్మక ఆరోపణలు చేయడంలో ఎందుకు విఫలమవుతోందన్న ప్రశ్నలూ ఇప్పుడు కొత్తగా తెర మీదకు వస్తున్నాయి.

మంగళవారం నాటి సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాలు ప్రారంభం కాగా… అవకాశం వచ్చినా కూడా దానిని వైసీపీ సద్వినియోగం చేసుకోలేకపోతోందని చెప్పాలి. వైసీపీ తరఫున మాట్లాడిన వరుదు కల్యాణి గానీ, చంద్రశేఖర రెడ్డి గానీ.. అధికార పక్షాన్ని నిర్మాణాత్మక ప్రశ్నలతో నిలువరించలేకపోయారు. ఏదో అధికార పక్షాన్ని తమదైన శైలి ఆరోపణలతో టార్గెట్ చేయడానికి యత్నించిన వైసీపీ వాదనలను ఎప్పటికప్పుడు లోకేశ్ సమర్థంగా తిప్పికొట్టిన తీరు ఆకట్టుకుంది. నోటి మాటలతో కాకుండా ఆధారాలతో విపక్షం ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పిన లోకేశ్… అదే సమయంలో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులతో పాటుగా ఎంతో అనుభవం ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా బదులు ఇచ్చేందకు నానా తంటాలు పడ్డారు.

కేంద్రం నుంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువచ్చే విషయంలో అయినా… విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల రాజీనామాల విషయంలో అయినా వైసీపీ వాదనలను లోకేశ్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఒకేసారి వర్సిటీల వీసీల రాజీనామాలకు బెదిరింపులే కారణమన్న చంద్రశేఖరరెడ్డి ఆరోపణలకు వేగంగా స్పందించిన లోకేశ్… అందుకు ఆధారాలు ఇవ్వాలంటూ విపక్షాన్ని నిలదీశారు. ఈ సమయంలో కల్పించుకున్నబొత్స విచారణకు ఆదేశాలు జారీ చేయాలని కోరగా.. ఆధారాలు లేకుండా వైసీపీ చెప్పిన ప్రతి అంశం ఆధారంగా విచారణలకు ఆదేశిస్తూ సాగలేమని తేల్చి చెప్పారు. ఆధారాలు ఉంటే ఇస్తే.. విచారణకు తనకేమీ అభ్యంతరం లేదని, ఆధారాలు ఇస్తే.. ఇక్కడికిక్కడే విచారణకు ఆదేశాలు ఇస్తానని లోకేశ్ చెప్పడంతో బొత్స కూడా బదులు చెప్పలేక అలా కూర్చుండిపోయారు. మొత్తంగా తనదైన శైలిలో సత్తా చాటిన లోకేశ్… మెజారిటీ ఉన్న మండలిలోనూ వైసీపీని వణికించేశారని చెప్పక తప్పదు.

This post was last modified on February 25, 2025 3:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

1 hour ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

1 hour ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

2 hours ago

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

2 hours ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

3 hours ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

3 hours ago