ఏపీ అసెంబ్లీలో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ సీట్లను గెలుచుకున్న వైసీపీ పరిస్థితిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు ముందు ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలతో స్ట్రాంగ్ గా కనిపించిన వైసీపీ… ఎన్నికల తర్వాత ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ బలంతో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. అంటే… ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత కూడా రాని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాలకు రాబోమంటూ చెప్పిన జగన్… తన వ్యూహాన్ని మార్చుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. సోమవారం నాటి సమావేశాల ప్రారంభం సందర్భంగా తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ సభకు వచ్చారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో మొదలుతాయి కదా. అంటే… అసెంబ్లీ మెయిన్ హాలులో జరిగే గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీ సభ్యులు (ఎమ్మెల్యేలు)తో పాటుగా శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) కూడా హాజరవుతారు. అసెంబ్లీలో వైసీపీకి 11 మంది సభ్యులే ఉన్నా… మండలిలో మాత్రం ఆ పార్టీకి ఇప్పటికీ 36 మంది సభ్యులు ఉన్నారు. గవర్నర్ ప్రసంగం ఉండటంతో 10 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎమ్మెల్సీలతో కలిసి జగన్ అలా అసెంబ్లీకి గ్రాండ్ గానే ఎంట్రీ ఇచ్చారు. సభలోనూ మొత్తంగా రెండు సభల్లోని తన పార్టీ సభ్యులు కూర్చోవడంతో రెండు వరుసల మేర వైసీపీ సభ్యులు కనిపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ వస్తున్న సందర్భంగానూ ఆ పార్టీ సంఖ్యాబలం ఘనంగానే కనిపించింది. ఫరవా లేదు… ఈ మాత్రం బలం ఉంటే ఇక నడిపించేయొచ్చు అన్న భావన వైసీపీ శ్రేణుల్లో కనిపించింది.
అయితే మంగళవారం నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు వేర్వేరుగానే జరుగుతాయి కదా. అంటే అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు, శాసన మండలి సమావేశాలకు ఎమ్మెల్సీలు విడివిడిగానే హాజరు అవుతారు. అంటే… రేపు కూడా వైసీపీ అసెంబ్లీకి వస్తే.. అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య జగన్ తో కలుపుకున్నా 11 మాత్రమే అవుతుంది. అంటే… అసెంబ్లీలో ఒక్కటంటే ఒక్క వరుస కుర్చీలు కూడా నిండని పరిస్థితి. ఇక మండలి విషయానికి వస్తే 36 మంది సభ్యులతో ఉన్న వైసీపీ మరింత కాలం పాటు మండలిలో ఓ రేంజిలో సత్తా చాటే అవకాశం అయితే ఉంది. వరుసగా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయిపోతూ ఉంటే.. ఆ సీట్లన్నీ దాదాపుగా అధికార పక్షం ఖాతాలో పడిపోతూ ఉంటాయి. ఫలితంగా ఇప్పుడు కాకున్నా సమీప భవిష్యత్తులోనే మండలిలోనూ వైసీపీ బలహీనంగా మారిపోయే ప్రమాదం లేకపోలేదు.
This post was last modified on February 24, 2025 12:17 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…