టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం సరదా సరదాగా గడిపారు. ఓ వైపు పార్టీ వ్యవహారాలు, మరోవైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో క్షణం తీరిక లేకుండా సాగుతున్న లోకేశ్… చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయి కేంద్రంగా జరిగిన దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ను చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ టీమిండియా జెర్సీ వేసి మరీ ఎంజాయ్ చేసిన తీరు ఆసక్తి రేకెత్తించింది.
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీలో అన్నీ తానై సాగుతున్న లోకేశ్… వాస్తవానికి ఇప్పుడు ఫుల్ బిజీ కిందే లెక్క. అయితే ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఒత్తిడి ఆహ్వానం మేరకు గతంలోనే లోకేశ్ దుబాయి వెళ్లేందుకు ఒప్పుకున్నట్లుగా సమాచారం. ఆ మేరకే అప్పటికే టూర్ ఏర్పాట్లు అన్ని సిద్ధం అయిపోవడంతో లోకేశ్ దుబాయి వెళ్లక తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక లోకేశ్, చిన్నిల వెంట ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన టీడీపీ నేత సానా సతీశ్ కూడా దుబాయి వెళ్లారు. దుబాయి వెళ్లాక వీరితో పుష్ప దర్శకుడు సుకుమార్ జాయిన్ అయ్యారు. వీరిలో లోకేశ్, చిన్నిలు టీమిండియా జెర్సీల్లో కనిపిస్తే… సానా, సుకుమార్ లు సాధారణ దుస్తుల్లోనే కనిపించారు. నలుగురూ కలిసి ఫొటోలుకు ఫోజులివ్వడంతో పాటుగా నలుగురూ ఒకే చోట కూర్చుని మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే… ఆదివారం రాత్రే లోకేశ్ అమరావతి తిరిగి రానున్నట్లు సమాచారం.
This post was last modified on February 23, 2025 6:23 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…