భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతగా కొనసాగుతున్నారు. మోదీ బృందంలో ఉన్నవారంతా కూడా వారి వారి విభాగాల్లో లబ్ధ ప్రతిష్టులే. జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్న అజిత్ దోవల్ అయితేనేం… ప్రిన్సిపల్ సెక్రటరీ టూ పీఎంగా కొనసాగుతున్న ప్రమోద్ కుమార్ మిశ్రా అయితేనేం… కేబినెట్ లో అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, జై శంకర్, కిరణ్ రిజిజు.. ఇలా ఎవరిని తీసుకున్నా.. అంతా సత్తా కలిగిన వారే. ఇప్పుడు ఈ టీంలో మరో ‘శక్తి’మంతుడు చేరిపోయారు. ఆయన మరెవరో కాదు…మొన్నటిదాకా రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా పనిచేసి రిటైర్ అయిన శక్తికాంత దాస్.
ప్రధాన మంత్రికి రెండో ముఖ్య కార్యదర్శి(సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టూ పీఎం)గా శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ శక్తికాంత దాస్ నియామకానికి సంబంధించి శనివారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులో దాస్ కొనసాగింపునకు సంబంధించి ఆ కమిటీ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించింది. మూడో పర్యాయం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పదవిలో ఉన్నంత కాలం ఆయనకు దాస్ రెండో ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే ఈ టెర్మ్ లో మోదీ పీఎంగా ఉన్నంతకాలం దాస్ సదరు పోస్టులో కొనసాగుతారన్న మాట.
ఒరిస్సాకు చెందిన శక్తికాంత దాస్… ఢిల్లీలోని ప్రసిద్ధ సెయింట్ స్టీఫెన్ సన్ కళాశాలలో చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన దాస్… తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారిగా విధుల్లోకి చేరిపోయారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో పలు హోదాల్లో పనిచేసిన దాస్… అత్యదిక కాలం పాటు కేంద్ర సర్వీసుల్లోనే కొనసాగారు. వాణిజ్య వ్యవహారాలు, రసాయనాలు, ఆర్థిక శాఖల కార్యదర్శిగా పనిచేసిన దాస్… అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, ఎన్డీబీ వంటి సంస్థల్లో భారత ప్రతినిధిగా సేవలు అందించారు. బ్రిక్స్ సహా పలు అంతర్జాతీయ కూటముల్లో ఆయన భారత ప్రతినిధిగా సత్తా చాటారు. ఈ క్రమంలోనే ఆయనకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ పదవి దక్కగా… తాజాగా ఏకంగా మోదీ టీంలోనే కీలక సభ్యుడిగా చేరిపోయారు. చదివింది హిస్టరీనే అయినా.. ఆర్థిక వ్యవహారాల్లో మంచి పట్టు కలిగిన అధికారిగా దాస్ గుర్తింపు సంపాదించుకున్నారు.
This post was last modified on February 23, 2025 2:35 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…