ఏపీ రాజధాని అమరావతికి మరో మణిహారం లభించింది. నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యం లో కీలకమైన బాహ్యవలయ రహదారి(ఔటర్ రింగ్ రోడ్డు)ని మరింత విస్తరించేందుకు ప్రతిపాదించిన ఫైలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి శనివారం అర్ధరాత్రి దాటాక కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాజధాని నిర్మాణంలో కీలకమైన ఓ ఆర్ ఆర్ నిర్మాణ పనులు శర వేగంగా జరగనున్నాయి.
ఏంటీ రహదారి..
రాజధాని ప్రాంతాన్ని.. కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలతో కలుపుతూ ఈ ఔటర్ రింగు రోడ్డును నిర్మించనున్నారు. ఈ పరిధిలోని ప్రాంతం మొత్తం దాదాపు రాజధానిగానే భావిస్తారు. ఈ మొత్తం ఔటర్ రింగు రోడ్డు.. 190 కిలో మీటర్లు ఉంటుంది. దీంతో విజయవాడ తూర్పు బైపాస్ను రద్దు చేసి.. పూర్తిగా ఆయా ప్రాంతాలను ఈ ఔటర్ పరిధిలోకి తీసుకువస్తారు. దీనికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపగా.. తాజాగా కేంద్రం ఆమోద ముద్ర కూడా లభించింది.
భూసేకరణ
కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఐదు జిల్లాల పరిధిలో భూసేకరణ చేపడతారు. సోమవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. భూములు ఇచ్చే వారిని స్వచ్ఛందంగా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ వివాదాల భూములు ఉంటే.. వాటిని సత్వరమే పరిష్కరించే బాధ్యతను కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది. సాధ్యమైనంత వేగంగా భూసేకరణ చేయాలని సర్కారు నిర్ణయించింది.
ఈ దఫాలోనే పూర్తి!
కూటమి హయాంలోనే ఈ ఓఆర్ ఆర్ను పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం కొన్నాళ్ల కిందటే నిర్ణయం తీసుకుంది. తద్వారా రాజధాని అమరావతి నిర్మాణ వేగం పుంజుకోవడంతో పాటు, పెట్టుబడులు కూడా త్వరగా వస్తాయన్న అంచనా వుంది. ఇక, భూసేకరణ నుంచి నిర్మాణం వరకు కూడా.. కేంద్రమే భరించనుంది. అయితే.. భూసేకరణ ప్రక్రియ, మ్యుటేషన్కు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
This post was last modified on February 23, 2025 1:50 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…