Political News

ఓర్నీ: ఉనికిలో లేని శాఖకు మంత్రి.. పంజాబ్ సిత్రం తెలిస్తే అవాక్కే!

ఇలా కూడా జరుగుతుందా? అన్న ఆశ్చర్యానికి గురి చేసే ఉదంతం ఒకటి పంజాబ్ లో చోటు చేసుకుంది. అక్కడ ఒక మంత్రిగారు ఉనికిలో లేని ఒక శాఖకు ఎంపికయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శాఖ అన్నది లేకున్నా.. అందులో గడిచిన 20 నెలలుగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ తప్పిదాన్ని తాజాగా గుర్తించి నాలుకర్చుకున్న అధికారులు దాన్ని సవరించే పనిలో పడ్డారు. విన్నంతనే విచిత్రంగా అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..2022 మార్చిలో భగవంత్ మాన్ నేత్రత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే.

2023 మేలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా అప్పటివరకు వ్యవసాయం.. రైతు సంక్షేమ శాఖల్ని నిర్వహిస్తున్న కులదీప్ సింగ్ ధలివాల్ కు ఎన్ఆర్ఐ వ్యవహారాలు.. ఆడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ బాధ్యతల్ని అదనంగా అప్పగించినట్లుగా ప్రకటించారు. అయితే.. ఆడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ అన్నదే లేని విషయాన్ని ఇటీవల గుర్తించారు. అది కూడా సదరు మంత్రిగారు.. తన ఫోర్టుపోలియేకు సంబంధించిన శాఖకు ప్రధాన కార్యదర్శి లేకపోవటాన్ని గుర్తించి ఆరా తీశారు. ప్రభుత్వాన్ని వివరణ కోరారు. దీంతో.. జరిగిన తప్పును గుర్తించిన ప్రభుత్వం వెంటనే దిద్దుబాటుచర్యల్నిచేపట్టింది.

తాజాగా ఈ శాఖకు సంబంధించి గెజిట్ విడుదల చేశారు. దీనిపై బీజేపీ విమర్శలకు దిగింది. పంజాబ్ లో పాలన జోక్ గా మారిందని.. లేని శాఖకు 20 నెలలుగా మంత్రి ఎలా ఉన్నారు? అని ప్రశ్నిస్తోంది. ఉనికిలో లేని శాఖ గురించి ముఖ్యమంత్రికే తెలీదు.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. అయినా.. ఉనికిలో లేని శాఖకు తనను మంత్రిని చేశారన్న విషయం సదరు మంత్రికి 20 నెలలకు కానీ గుర్తించటం ఏమిటో కదా?

This post was last modified on February 23, 2025 1:12 pm

Share

Recent Posts

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

2 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

2 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

3 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

3 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

6 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

7 hours ago