ఎట్టకేలకు వైసీపీ నాయకులు బయటకు వస్తున్నారు. ఎన్నికల ఫలితం తర్వాత.. వైసీపీ 11 స్థానాలకు జారిపోయిన తర్వాత.. ఇప్పుడిప్పుడే విధాన పరమైన అంశాలతో వైసీపీ నాయకులు బయటకు రావడం ప్రారంభించారు. తాజాగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి.. కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. జగన్ బయటకు రాకూడదా? అని ప్రశ్నించారు. అంతేకాదు .. జగన్ బయటకు వస్తే.. కూటమి సర్కారు తప్పులు బయట పడతాయని ఆందోళన కనిపిస్తోందన్నారు.
అంతేకాదు.. రైతులను పరామర్శించేందుకు వచ్చిన జగన్కు భద్రత కల్పించలేదన్న వెంకట్రామిరెడ్డి.. ఇది తప్పుకాదా? అని నిలదీశారు. పైగా ఇల్లీగల్ యాక్టివిటీ అని పేరు పెట్టడాన్ని కూడా ఆయన ఖండించారు. జగన్ బయటకు రాకూడదన్న ఏకైక ఉద్దేశంతోనే భద్రతను తగ్గించారని.. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యా నించారు. మరోవైపు.. ఉత్తరాంధ్రలోనూ.. సీనియర్లు బయటకు వస్తున్నారు.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. తాజా పరిణామాలపై స్పందించారు. అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా రియాక్ట్ అయ్యారు. జగన్కు అనుకూలంగా వారు మాట్లాడారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదని వ్యాఖ్యానించారు. జగన్మోహన్రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అయితే.. తమ నాయకుడు ప్రజా నాయకుడని.. ఆయనకు ఎవరి భద్రతా అవసరం లేదని.. ప్రజలే జగనను కాపాడుకుంటారని వారు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే.. వైసీపీలో గత 9 నెలలుగా నెలకొన్న స్తబ్దత వీడిపోయిందని.. నాయకులు ఇప్పుడిప్పుడే లైన్లో పడుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే.. ఇది మున్ముందు వరకు కొనసాగుతుందా? లేక.. ఏదో కంటితుడుపుగా మీడియా ముందుకు వచ్చారా? అనేది రాబోయే రోజుల్లోనే తేలనుంది.
This post was last modified on February 23, 2025 1:00 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…