Political News

వైసీపీలో `గ్యాప్` తీరుస్తున్నారు… నేత‌లు బ‌య‌ట‌కు!

ఎట్ట‌కేల‌కు వైసీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితం త‌ర్వాత‌.. వైసీపీ 11 స్థానాల‌కు జారిపోయిన త‌ర్వాత‌.. ఇప్పుడిప్పుడే విధాన ప‌ర‌మైన అంశాల‌తో వైసీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డం ప్రారంభించారు. తాజాగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి.. కూటమి ప్ర‌భుత్వానికి ప్ర‌శ్న‌లు సంధించారు. జ‌గ‌న్ బ‌య‌ట‌కు రాకూడ‌దా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు .. జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌స్తే.. కూట‌మి స‌ర్కారు త‌ప్పులు బ‌య‌ట ప‌డ‌తాయ‌ని ఆందోళ‌న క‌నిపిస్తోంద‌న్నారు.

అంతేకాదు.. రైతుల‌ను పరామ‌ర్శించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌లేద‌న్న వెంక‌ట్రామిరెడ్డి.. ఇది త‌ప్పుకాదా? అని నిల‌దీశారు. పైగా ఇల్లీగ‌ల్ యాక్టివిటీ అని పేరు పెట్ట‌డాన్ని కూడా ఆయ‌న ఖండించారు. జ‌గ‌న్ బ‌య‌ట‌కు రాకూడ‌ద‌న్న ఏకైక ఉద్దేశంతోనే భ‌ద్ర‌త‌ను త‌గ్గించార‌ని.. వెంక‌ట్రామిరెడ్డి వ్యాఖ్యా నించారు. మ‌రోవైపు.. ఉత్త‌రాంధ్ర‌లోనూ.. సీనియ‌ర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.

మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం.. తాజా ప‌రిణామాల‌పై స్పందించారు. అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా రియాక్ట్ అయ్యారు. జ‌గ‌న్‌కు అనుకూలంగా వారు మాట్లాడారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు ఎంతో కాలం ప‌ట్ట‌ద‌ని వ్యాఖ్యానించారు. జగన్‌మోహన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

అయితే.. త‌మ నాయ‌కుడు ప్ర‌జా నాయ‌కుడ‌ని.. ఆయ‌న‌కు ఎవ‌రి భ‌ద్ర‌తా అవ‌స‌రం లేద‌ని.. ప్ర‌జ‌లే జ‌గ‌న‌ను కాపాడుకుంటార‌ని వారు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. వైసీపీలో గ‌త 9 నెల‌లుగా నెల‌కొన్న స్త‌బ్ద‌త వీడిపోయింద‌ని.. నాయ‌కులు ఇప్పుడిప్పుడే లైన్‌లో ప‌డుతున్నార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే.. ఇది మున్ముందు వ‌ర‌కు కొన‌సాగుతుందా? లేక‌.. ఏదో కంటితుడుపుగా మీడియా ముందుకు వ‌చ్చారా? అనేది రాబోయే రోజుల్లోనే తేల‌నుంది.

Kumar

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

2 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

4 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

6 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

6 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

7 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

7 hours ago