Political News

వైసీపీలో `గ్యాప్` తీరుస్తున్నారు… నేత‌లు బ‌య‌ట‌కు!

ఎట్ట‌కేల‌కు వైసీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితం త‌ర్వాత‌.. వైసీపీ 11 స్థానాల‌కు జారిపోయిన త‌ర్వాత‌.. ఇప్పుడిప్పుడే విధాన ప‌ర‌మైన అంశాల‌తో వైసీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డం ప్రారంభించారు. తాజాగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి.. కూటమి ప్ర‌భుత్వానికి ప్ర‌శ్న‌లు సంధించారు. జ‌గ‌న్ బ‌య‌ట‌కు రాకూడ‌దా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు .. జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌స్తే.. కూట‌మి స‌ర్కారు త‌ప్పులు బ‌య‌ట ప‌డ‌తాయ‌ని ఆందోళ‌న క‌నిపిస్తోంద‌న్నారు.

అంతేకాదు.. రైతుల‌ను పరామ‌ర్శించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌లేద‌న్న వెంక‌ట్రామిరెడ్డి.. ఇది త‌ప్పుకాదా? అని నిల‌దీశారు. పైగా ఇల్లీగ‌ల్ యాక్టివిటీ అని పేరు పెట్ట‌డాన్ని కూడా ఆయ‌న ఖండించారు. జ‌గ‌న్ బ‌య‌ట‌కు రాకూడ‌ద‌న్న ఏకైక ఉద్దేశంతోనే భ‌ద్ర‌త‌ను త‌గ్గించార‌ని.. వెంక‌ట్రామిరెడ్డి వ్యాఖ్యా నించారు. మ‌రోవైపు.. ఉత్త‌రాంధ్ర‌లోనూ.. సీనియ‌ర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.

మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం.. తాజా ప‌రిణామాల‌పై స్పందించారు. అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా రియాక్ట్ అయ్యారు. జ‌గ‌న్‌కు అనుకూలంగా వారు మాట్లాడారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు ఎంతో కాలం ప‌ట్ట‌ద‌ని వ్యాఖ్యానించారు. జగన్‌మోహన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

అయితే.. త‌మ నాయ‌కుడు ప్ర‌జా నాయ‌కుడ‌ని.. ఆయ‌న‌కు ఎవ‌రి భ‌ద్ర‌తా అవ‌స‌రం లేద‌ని.. ప్ర‌జ‌లే జ‌గ‌న‌ను కాపాడుకుంటార‌ని వారు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. వైసీపీలో గ‌త 9 నెల‌లుగా నెల‌కొన్న స్త‌బ్ద‌త వీడిపోయింద‌ని.. నాయ‌కులు ఇప్పుడిప్పుడే లైన్‌లో ప‌డుతున్నార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే.. ఇది మున్ముందు వ‌ర‌కు కొన‌సాగుతుందా? లేక‌.. ఏదో కంటితుడుపుగా మీడియా ముందుకు వ‌చ్చారా? అనేది రాబోయే రోజుల్లోనే తేల‌నుంది.

This post was last modified on February 23, 2025 1:00 pm

Share
Show comments
Published by
Kumar
Tags: JaganYSRCP

Recent Posts

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

35 minutes ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

4 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

4 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

4 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

5 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

6 hours ago