Political News

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య `స‌యోధ్య` సాధ్యంకాదా?

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల జ‌గ‌డాల‌తోపాటు విద్యుత్ స‌మ‌స్య‌లు కూడా పెరుగుతున్నాయి. మ‌రో రెండు మాసాల్లో ఎండ‌లు ముద‌ర‌నున్న నేప‌థ్యంలో ఈ రెండు అంశాలు కూడా.. రెండు రాష్ట్రాల‌కూ కీల‌కంగా మారుతున్నాయి. ఖ‌రీఫ్ సాగు రెండు రాష్ట్రాల్లోనూ ముమ్మ‌రం అవుతోంది. కృష్ణా, గోదావ‌రి ఆయ‌క‌ట్టు ప్రాంతంలో రైతులు సాగుకు సిద్ధ‌మ‌య్యారు. ఏపీలో అయితే.. నాట్లు కూడా ప‌డుతున్నాయి. ఈ ప‌రిణామాల‌తో జ‌లాల ప్రాధాన్యం పెరిగింది.

మ‌రోవైపు .. ఎండాకాలం ప్రారంభానికి ముందే.. విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. మారుతున్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు విద్యుత్ వాడ‌కాన్ని ఇప్ప‌టి నుంచే పెంచుతున్నాయి. ప‌గ‌టి పూట తీవ్ర ఎండ‌, రాత్రి వేళ‌లలో చ‌లి తీవ్ర‌త కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ప‌గ‌టి పూట విద్యుత్ వాడ‌కం గ‌త వారం రోజులుగా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య అటు నీరు, ఇటు విద్యుత్ విష‌యంపై కూడా.. ర‌గ‌డ ప్రారంభ‌మైంది. అయితే.. ఇది తీవ్ర వివాదంగా మారక ముందే ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ఉంద‌ని.. నిపుణులు చెబుతున్నారు.

మ‌ధ్యే మార్గంగా ఇరు రాష్ట్రాల మంత్రులు చ‌ర్చించుకుని ప‌రిష్కారం దిశ‌గా ఆలోచ‌న చేయాల‌ని సూచిస్తున్నారు. ఏపీలో దీనిపై ఎలాంటి వివాదాలు లేక‌పోయినా.. తెలంగాణలో మాత్రం జ‌లాల‌పై రాజ‌కీయ చిక్కులు వ‌స్తున్నాయి. ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పుంజుకోవ‌డం.. జ‌లాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డిని ఇర‌కాటంలోకి నెట్టాల‌న్న వ్యూహాలు వంటివి అక్క‌డ ప్ర‌భావం చూపుతున్నాయి. ఈ క్ర‌మంలో ఏపీకి మేలు చేస్తున్న‌ట్టుగా ఏ చిన్న సంకేతం వ‌చ్చినా.. రేవంత్‌రెడ్డి స‌ర్కారును బ‌ద్నాం చేసేందుకు కేసీఆర్ ముందంజ‌లో ఉన్నారు.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. తెలంగాణ‌తో పోల్చుకుంటే ఖ‌రీఫ్ ఆయ‌క‌ట్టు ఎక్కువ‌గా ఉంది. పైగా విద్యుత్ వాడకంలోనూ హైద‌రాబాద్‌తో పోటీ ప‌డుతున్న సంకేతాలు వ‌స్తున్నాయి. దీంతో ఏపీ చ‌ర్చ‌ల‌కు మొగ్గు చూపుతోంది. స‌యోధ్య దిశ‌గానే స‌మ‌స్య ప‌రిష్కారం చేసుకుంటామ‌ని సీఎం చంద్ర‌బాబు కూడా చెబుతున్నారు. కానీ, ఎటొచ్చీ.. తెలంగాణ‌లో నెల‌కొన్న ప్ర‌త్యేక రాజ‌కీయ ప‌రిస్థితులు.. ఏమేర‌కు ఈ స‌యోధ్య దిశ‌గా అడుగులు వేసేందుకు స‌హ‌క‌రిస్తాయ‌న్న‌ది చూడాలి.

This post was last modified on February 23, 2025 12:57 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago