వైసీపీ అధినేత జగన్.. అలా రెండు పర్యటనలు ముగిశాయో లేదో.. ఇలా బెంగళూరుకు వెళ్లిపోయారు. విజయవాడలో తన పార్టీ నాయకుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఆ వెంటనే మరుసటి రోజు.. గుంటూరు మిర్చియార్డును సందర్శించారు. రైతుల కష్టాలు తెలుసుకున్నారు. దీంతో ఇక, తమ నాయకుడు.. నిత్యం ప్రజల్లోనే ఉంటారని.. ప్రజల సమ్యలు వింటారని.. రోజూ యాత్రలే నని వైసీపీ ముఖ్యులు భావించారు. ఇదే కొనసాగితే.. వైసీపీ పుంజుకుంటుందని అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా ఎవరికీ చెప్పకుండానే సతీసమేతంగా జగన్.. బెంగళూరుకు వెళ్లిపోయారు. ఆయన వెళ్లే వరకు కూడా.. పార్టీ ముఖ్య నాయకులకు, ముఖ్యంగా తాడేపల్లిలోనే ఉండేవారికి కూడా తెలియదట! ఆశ్చర్యం అనిపించినా నిజమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, పోనీ.. బెంగళూరులో ఏమైనా అత్యంత అవసరమైన పనులు ఉన్నాయా? అంటే.. అవేవీ లేదు. అయినా.. జగన్ ఎందుకు వెళ్లారు? అనేది ప్రశ్న. గత కొన్నాళ్లుగా జగన్ నడుము నొప్పితో బాధపడుతున్నారు.
దీనికి ఆయన బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇటీవల విజయవాడ, గుంటూరు పర్యటనల్లో.. ప్రసంగించిన జగన్ ఒకింత ఇబ్బంది పడినట్టు అందరూ గమనించారు. ఈ క్రమంలో నడుము నొప్పికి సంబంధించి జగన్.. చికిత్స కోసమే బెంగళూరుకు వెళ్లారన్నది పార్టీ వర్గాల మధ్య జరుగుతున్న చర్చ. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు. ఇదిలావుంటే.. జగన్ లేకపోతే.. పార్టీ కార్యక్రమాల పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్న.
ఇప్పటి వరకు .. జగన్.. దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన కానీ.. షెడ్యూల్ కానీ ఇవ్వలేదు. గతంలోనూ షెడ్యూల్ ఇచ్చినా.. ఆయన బెంగళూరు వెళ్లిపోయిన తర్వాత.. దానిని పార్టీ నాయకులు పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా అంతే చేస్తారని అనుకున్నారో. . ఏమో.. అసలు ఎవరికీ చెప్పకుండానే జగన్.. బెంగళూరు కు వెల్లిపోయారు. దీంతో పార్టీ నాయకులు కూడా.. ఎవరికి వారు సైలెంట్ అయ్యారు. మరోవైపు.. జగన్ వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలపై స్పష్టత లేదని.. తాడేపల్లి వర్గాలు చెబుతుండడం గమనార్హం.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…