Political News

మీరు బాగా చెయ్యండి, జగన్ ను కుడా మేము ప్రశ్నిస్తాం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వం భద్రత కల్పించకపోవడంపై లెక్కలేనన్ని విశ్లేషణలు, విమర్శలు, సమర్థంపులు వినిపిస్తున్నాయి. వీటిలో ఎవరి వాదన వారిదే. టీడీపీ వారేమో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారికి భద్రత ఎలా కల్పిస్తామని ప్రశ్నిస్తున్నారు. నిజమే.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి భద్రత కల్పించడానికి వీల్లేదు. మిర్చి రైతులను పరామర్శించడం చట్ట వ్యతిరేకమా? ఎన్నికల కోడ్ ఉంటే… రైతుల సమస్యలను గాలికి వదిలేయాలా? అని వైసీపీ వాదిస్తోంది. అదీ కరెక్టేనని అనిపిస్తుంది. ఇక న్యూట్రల్ వర్గాలేమో.. అయినా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న జగన్ కు సెక్యూరిటీ కల్పించేది కేంద్రం కదా… ఈ విషయంతో చంద్రబాబు సర్కారుకు ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నాయి. ఇదీ నిజమే. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా…కొన్ని పర్యటనల్లో స్థానిక పోలీసులు కొంత మేర భద్రతా చర్యలు చేపట్టాలి కదా అన్నది మరో వాదన.

ఈ వ్యవహారంలో ఏ వాదన విన్నా.. అదే కరెక్టు అని చెప్పక తప్పని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో వైసీపీకి చెందిన సీనియర్ మోస్ట్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు, జగన్ కు తండ్రి సమానుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. శుక్రవారం తన కుమారుడు, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి నేపథ్యంలో నెల్లూరులోని తన సొంతింటిలో తనను కలిసిన ఓ టీవీ ఛానెల్ తో మేకపాటి తన మనసులోని మాటను ఎలాంటి బేషజాలు లేకుండానే బయటపెట్టారు. ఓ సీనియర్ మోస్ట్ రాజకీయ నేతగా… ఏ వర్గాన్ని వెనకేసుకుని రాకుండా… రెండు వర్గాలకూ హిత బోధ చేసిన మేకపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ వయసులో చిన్నవాడని… అనుభవం లేని కారణంగా పాలనలో కొన్ని తప్పులు చేసి ఉండవచ్చని ఒప్పుకున్నారు. అదే సమయంలో సుదీర్గ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తెలిసి మరీ తప్పులు చేయరాదు కదా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా మేకపాటి సీనియర్ ఏమన్నారన్న విషయానికి వస్తే… జగన్ ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ప్రస్తుతం ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత లభిస్తోందని మేకపాటి తెలిపారు. ఇక సీఎం హోదాలో చంద్రబాబుకు కూడా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని ఆయన గుర్తు చేశారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కవర్ లో ఉన్న జగన్ సెక్యూరిటీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సబబు కాదని ఆయన అన్నారు. మొన్నటి గుంటూరు మిర్చి యార్డు పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్ కు భద్రత కరువైన వైనం తనను విస్మయానికి గురి చేసిందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. జగన్ అనుభవ లేమితో తప్పులు చేసే ఉండొచ్చు… అలాగని జగన్ తప్పులు చేశారని… 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తప్పులు చేయకూడదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఎవరు ఉన్నా.. విపక్ష నేతలను, విపక్ష పార్టీలను గౌరవించి తీరాల్సిందేనన్నారు. ఇప్పుడు చంద్రబాబు అలా వ్యవహరిస్తే.. రేపు జగన్ అధికారంలోకి వస్తే.. ఆయన తప్పు చేస్తున్నా తాము ఆయనను నిలదీస్తామని మేకపాటి చెప్పుకొచ్చారు.

This post was last modified on February 21, 2025 6:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

7 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

8 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

8 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

8 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

8 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago