Political News

చంద్ర‌బాబు చెప్పిన ఆ ఒక్క మాట‌తో నిర‌స‌న విర‌మించారు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పిన ఒకే ఒక్క‌మాట మంత్రంగా ప‌నిచేసింది. అప్ప‌టి వ‌ర‌కు గుంటూరు మిర్చి యార్డులో ఆందోళ‌న‌, నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైతులు.. చంద్ర‌బాబు చెప్పిన మాట‌తో నిర‌స‌న విర‌మించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మిర్చి రైతులు.. త‌మ‌కు గిట్టుబాటు ధ‌ర ల‌భించ‌డం లేద‌ని.. క‌నీసం ఖ‌ర్చులు కూడా రావ‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 ఉమ్మ‌డి జిల్లాల్లో పండిన మిర్చిని తీసుకుని గుంటూరు మిర్చి యార్డుకు వ‌చ్చిన రైత‌న్న‌లు వారాల త‌ర‌బ‌డి అక్క‌డే ఉన్నారు.

ప్ర‌స్తుతం మ‌ద్ద‌తు ధ‌ర రూ.7.5 వేలు ఉంది. కానీ, ఈ ధ‌ర‌కు అమ్మితే.. త‌మ‌కు ఖ‌ర్చులు కూడా రావ‌ని వారు వాపోతున్నారు. ఇక‌, మార్కెట్ ధ‌ర రూ.13,500గా ఉంది. ఇది కూడా త‌మ‌కు గిట్టుబాటు ధ‌ర రావ‌డం లేద‌ని చెబుతున్నారు. గ‌తంల 2022-23 మ‌ధ్య ఉన్న 22000-23000 ధ‌ర ఇప్పించాల‌ని వారు కోరుతున్నారు. కానీ, ప్ర‌భుత్వం ఈ దిశ‌గా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఇదే నిర‌స‌న‌కు, ధ‌ర్నాల‌కు దారి తీశాయి. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్క‌డ ప‌ర్య‌టించి రైతును ప‌రామ‌ర్శించారు.

ఆ వెంట‌నే ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు.. మిర్చి ధ‌ర‌ల ప‌త‌నంపై కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌తో చ‌ర్చించారు. దేశ‌వ్యాప్తంగా ఇలాంటి ప‌రిస్థితి ఉంద‌ని మంత్రి చెప్పిన‌ప్ప‌టికీ.. ఏపీని ప్ర‌త్యేకంగా ప‌రిగ‌ణించాల‌ని.. నాణ్య‌మైన మిర్చి ఏపీలోనే పండుతోంద‌ని చంద్ర‌బాబు గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు. గ‌తంలో ఇచ్చిన ధ‌ర‌ల‌కే ఇప్పుడు ఇప్పించాల‌ని సూచించారు. మార్కెట్ ఇంట‌ర్ వెన్ష‌న్ ధ‌ర‌లు కాకుండా.. సాగుకు అయ్యే నిజ ఖ‌ర్చుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని నిర్ణ‌యించాల‌ని కోరారు.

దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆ వెంట‌నే చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. మిర్చిరైతుల‌కు న్యాయం చేస్తామ‌ని, ఇప్పుడే కేంద్ర మంత్రితోనూ చ‌ర్చించామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. మిర్చిని కేంద్రం కొనుగోలు చేసేలా ఒప్పిస్తామ‌న్నారు. దీనిపై రైతులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని సూచించారు. ఈ విషయం తెలియ‌గానే.. రైతులు త‌మ ఆందోళ‌న‌ను విర‌మించారు. మ‌రోవైపు రాష్ట్ర అధికారులు కూడా రైతుల‌తో చ‌ర్చించారు. చంద్ర‌బాబు సూచ‌న‌ల‌ను వారికి చేర‌వేశారు. దీంతో ప్ర‌స్తుతానికి ఆందోళ‌న విర‌మిస్తున్న‌ట్టు రైతు సంఘాలు ప్ర‌క‌టించాయి.

This post was last modified on February 21, 2025 8:43 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

10 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

11 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

11 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

12 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

13 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

16 hours ago