Political News

చంద్ర‌బాబు చెప్పిన ఆ ఒక్క మాట‌తో నిర‌స‌న విర‌మించారు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పిన ఒకే ఒక్క‌మాట మంత్రంగా ప‌నిచేసింది. అప్ప‌టి వ‌ర‌కు గుంటూరు మిర్చి యార్డులో ఆందోళ‌న‌, నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైతులు.. చంద్ర‌బాబు చెప్పిన మాట‌తో నిర‌స‌న విర‌మించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మిర్చి రైతులు.. త‌మ‌కు గిట్టుబాటు ధ‌ర ల‌భించ‌డం లేద‌ని.. క‌నీసం ఖ‌ర్చులు కూడా రావ‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 ఉమ్మ‌డి జిల్లాల్లో పండిన మిర్చిని తీసుకుని గుంటూరు మిర్చి యార్డుకు వ‌చ్చిన రైత‌న్న‌లు వారాల త‌ర‌బ‌డి అక్క‌డే ఉన్నారు.

ప్ర‌స్తుతం మ‌ద్ద‌తు ధ‌ర రూ.7.5 వేలు ఉంది. కానీ, ఈ ధ‌ర‌కు అమ్మితే.. త‌మ‌కు ఖ‌ర్చులు కూడా రావ‌ని వారు వాపోతున్నారు. ఇక‌, మార్కెట్ ధ‌ర రూ.13,500గా ఉంది. ఇది కూడా త‌మ‌కు గిట్టుబాటు ధ‌ర రావ‌డం లేద‌ని చెబుతున్నారు. గ‌తంల 2022-23 మ‌ధ్య ఉన్న 22000-23000 ధ‌ర ఇప్పించాల‌ని వారు కోరుతున్నారు. కానీ, ప్ర‌భుత్వం ఈ దిశ‌గా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఇదే నిర‌స‌న‌కు, ధ‌ర్నాల‌కు దారి తీశాయి. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్క‌డ ప‌ర్య‌టించి రైతును ప‌రామ‌ర్శించారు.

ఆ వెంట‌నే ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు.. మిర్చి ధ‌ర‌ల ప‌త‌నంపై కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌తో చ‌ర్చించారు. దేశ‌వ్యాప్తంగా ఇలాంటి ప‌రిస్థితి ఉంద‌ని మంత్రి చెప్పిన‌ప్ప‌టికీ.. ఏపీని ప్ర‌త్యేకంగా ప‌రిగ‌ణించాల‌ని.. నాణ్య‌మైన మిర్చి ఏపీలోనే పండుతోంద‌ని చంద్ర‌బాబు గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు. గ‌తంలో ఇచ్చిన ధ‌ర‌ల‌కే ఇప్పుడు ఇప్పించాల‌ని సూచించారు. మార్కెట్ ఇంట‌ర్ వెన్ష‌న్ ధ‌ర‌లు కాకుండా.. సాగుకు అయ్యే నిజ ఖ‌ర్చుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని నిర్ణ‌యించాల‌ని కోరారు.

దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆ వెంట‌నే చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. మిర్చిరైతుల‌కు న్యాయం చేస్తామ‌ని, ఇప్పుడే కేంద్ర మంత్రితోనూ చ‌ర్చించామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. మిర్చిని కేంద్రం కొనుగోలు చేసేలా ఒప్పిస్తామ‌న్నారు. దీనిపై రైతులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని సూచించారు. ఈ విషయం తెలియ‌గానే.. రైతులు త‌మ ఆందోళ‌న‌ను విర‌మించారు. మ‌రోవైపు రాష్ట్ర అధికారులు కూడా రైతుల‌తో చ‌ర్చించారు. చంద్ర‌బాబు సూచ‌న‌ల‌ను వారికి చేర‌వేశారు. దీంతో ప్ర‌స్తుతానికి ఆందోళ‌న విర‌మిస్తున్న‌ట్టు రైతు సంఘాలు ప్ర‌క‌టించాయి.

Kumar

Recent Posts

శ్రీనగర్.. ఈ ఏడాది సమ్మర్ విన్నర్.. ఎంత భారీగా ఫ్లైట్ జర్నీలంటే?

ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…

2 hours ago

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

4 hours ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

8 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

9 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

11 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

11 hours ago