Political News

అప్పుడు విన‌లేదు.. ఇప్పుడు వింటారా? : వైసీపీ టాక్‌!

వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మాట వింటామ‌ని.. జ‌గ‌న్ 2.0లో వారికే ప్ర‌ధానంగా ప్రాధాన్యం ఇస్తామ‌ని మాజీ సీఎం జ‌గ‌న్ త‌ర‌చుగా చెబుతున్నారు. ఆ మాట చెప్ప‌గానే.. ప‌లు జిల్లాల నుంచి నాయ‌కులు తాడేప‌ల్లి ప్యాల‌స్‌కు క్యూ క‌డుతున్నారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారిని మార్పు చేయాల‌ని వారు కోరుతున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందు గ‌త ఏడాది కూడా.. అనేక మంది నాయ‌కులు ఇవే డిమాండ్ల‌ను తెర‌మీదికి తెచ్చారు.

నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌(అప్ప‌టి) పెత్త‌నం ఎక్కువైంద‌ని.. తాము వేగ‌లేక పోతున్నామ‌ని వారు తెలి పారు. అలాంటి వారికి టికెట్ ఇవ్వ‌ద్ద‌ని, వారిని ప్రోత్స‌హించ‌ద్ద‌ని కూడా చెప్పారు. ఇసుక‌, మ‌ద్యం, భూముల విష‌యంలో వారు చేస్తున్న అవినీతిని కూడా వైసీపీ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు అధినేత ముందు పెట్టారు. కానీ, అప్పట్లో వారి మాట‌ల‌ను లైట్ తీసుకున్న జ‌గ‌న్‌.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నాయ‌కుల‌కే అవ‌కాశం ఇచ్చారు. ఈ ప్ర‌భావం పార్టీలో చీలిక‌లు తెచ్చింది.

ఫ‌లితంగా వైసీపీ కంచుకోట‌లుగా ఉన్న మాచ‌ర్ల వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సైకిల్ దూసుకుపోయింది. ఇప్పుడు మీ మాటే వింటాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు తాడేప‌ల్లికి వ‌చ్చి మ‌రోసారి అక్క‌డి నేత‌ల‌పై ఫిర్యాదులు చేయ‌డం ప్రారంభించారు. ఇలాంటి వారిని తొల‌గించాల‌ని వారు కోరుతున్నారు. ప్ర‌స్తుతం మాజీ ఎమ్మెల్యేలే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌లుగా ఉన్నారు. ఇలాంటి వారితో తాము క‌లిసి ముందుకు న‌డ‌వ‌లేమ‌ని చెబుతున్నారు.

అయితే.. వీరి ఆవేద‌న ఎలా ఉన్నా. జ‌గ‌న్ స‌ద‌రు ఇంచార్జ్‌ల‌ను మార్చే ప్ర‌య‌త్నం చేసే అవ‌కాశం లేదు. వారికి.. జ‌గ‌న్ కు ఉన్న బాండింగ్ కావొచ్చు.. సామాజిక వ‌ర్గాల‌ప‌రంగా, ఆర్థికంగా కూడా బ‌లంగా ఉన్న నాయ‌కులు కావొచ్చు. ఏదేమైనా.. ఇత‌ర నాయ‌కులు కోరుతున్న‌ట్టుగా జ‌గ‌న్ చేసే అవ‌కాశం అయితే లేకుండా పోయింది. కానీ, ప్ర‌స్తుతానికి వారి విన‌తులు మాత్రం తీసుకుంటున్నారు. చివ‌ర‌కు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on February 21, 2025 8:40 am

Share
Show comments
Published by
Kumar
Tags: YCPYS Jagan

Recent Posts

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

33 minutes ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

2 hours ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

2 hours ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

2 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

3 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

4 hours ago