Political News

అప్పుడు విన‌లేదు.. ఇప్పుడు వింటారా? : వైసీపీ టాక్‌!

వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మాట వింటామ‌ని.. జ‌గ‌న్ 2.0లో వారికే ప్ర‌ధానంగా ప్రాధాన్యం ఇస్తామ‌ని మాజీ సీఎం జ‌గ‌న్ త‌ర‌చుగా చెబుతున్నారు. ఆ మాట చెప్ప‌గానే.. ప‌లు జిల్లాల నుంచి నాయ‌కులు తాడేప‌ల్లి ప్యాల‌స్‌కు క్యూ క‌డుతున్నారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారిని మార్పు చేయాల‌ని వారు కోరుతున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందు గ‌త ఏడాది కూడా.. అనేక మంది నాయ‌కులు ఇవే డిమాండ్ల‌ను తెర‌మీదికి తెచ్చారు.

నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌(అప్ప‌టి) పెత్త‌నం ఎక్కువైంద‌ని.. తాము వేగ‌లేక పోతున్నామ‌ని వారు తెలి పారు. అలాంటి వారికి టికెట్ ఇవ్వ‌ద్ద‌ని, వారిని ప్రోత్స‌హించ‌ద్ద‌ని కూడా చెప్పారు. ఇసుక‌, మ‌ద్యం, భూముల విష‌యంలో వారు చేస్తున్న అవినీతిని కూడా వైసీపీ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు అధినేత ముందు పెట్టారు. కానీ, అప్పట్లో వారి మాట‌ల‌ను లైట్ తీసుకున్న జ‌గ‌న్‌.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నాయ‌కుల‌కే అవ‌కాశం ఇచ్చారు. ఈ ప్ర‌భావం పార్టీలో చీలిక‌లు తెచ్చింది.

ఫ‌లితంగా వైసీపీ కంచుకోట‌లుగా ఉన్న మాచ‌ర్ల వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సైకిల్ దూసుకుపోయింది. ఇప్పుడు మీ మాటే వింటాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు తాడేప‌ల్లికి వ‌చ్చి మ‌రోసారి అక్క‌డి నేత‌ల‌పై ఫిర్యాదులు చేయ‌డం ప్రారంభించారు. ఇలాంటి వారిని తొల‌గించాల‌ని వారు కోరుతున్నారు. ప్ర‌స్తుతం మాజీ ఎమ్మెల్యేలే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌లుగా ఉన్నారు. ఇలాంటి వారితో తాము క‌లిసి ముందుకు న‌డ‌వ‌లేమ‌ని చెబుతున్నారు.

అయితే.. వీరి ఆవేద‌న ఎలా ఉన్నా. జ‌గ‌న్ స‌ద‌రు ఇంచార్జ్‌ల‌ను మార్చే ప్ర‌య‌త్నం చేసే అవ‌కాశం లేదు. వారికి.. జ‌గ‌న్ కు ఉన్న బాండింగ్ కావొచ్చు.. సామాజిక వ‌ర్గాల‌ప‌రంగా, ఆర్థికంగా కూడా బ‌లంగా ఉన్న నాయ‌కులు కావొచ్చు. ఏదేమైనా.. ఇత‌ర నాయ‌కులు కోరుతున్న‌ట్టుగా జ‌గ‌న్ చేసే అవ‌కాశం అయితే లేకుండా పోయింది. కానీ, ప్ర‌స్తుతానికి వారి విన‌తులు మాత్రం తీసుకుంటున్నారు. చివ‌ర‌కు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on February 21, 2025 8:40 am

Share
Show comments
Published by
Kumar
Tags: YCPYS Jagan

Recent Posts

మాయమైన వైవీఎస్.. మళ్లీ వచ్చారు

టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…

3 hours ago

మహాభారతం పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారా

ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…

4 hours ago

యుద్ధం వద్దంటున్న తెలుగు హీరోయిన్

కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి…

5 hours ago

మే 30 వదిలేయడం లాభమా నష్టమా

నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్…

5 hours ago

ఇస్రో కేంద్రాలు, పోర్టుల వద్ద హై అలర్ట్

పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష…

5 hours ago

పాక్ ది ఎంతటి పన్నాగమో తెలుసా..?

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ…

5 hours ago