Trends

డిజిటల్ కంటెంట్‌పై కేంద్రం కన్ను: నియంత్రణ తప్పనిసరి

ఇటీవల ఓటీటీ, సోషల్ మీడియా వేదికలపై అసభ్య, అనుచిత కంటెంట్ పెరుగుతున్నట్లు అనేక ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. ఐటీ చట్టం-2021లోని మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా నిబంధనలు పాటించాలని హెచ్చరించింది. చిన్నారులు, యువత ఈ కంటెంట్‌కు అసలు చూపించని విధంగా అన్ని ప్లాట్‌ఫామ్‌లు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది.

ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో రణ్‌వీర్ అలహాబాదియా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అందరికీ గుర్తు చేసింది. వయస్సు ఆధారంగా కంటెంట్‌ను విభజించడం, A రేటెడ్ కంటెంట్ పిల్లలకు అందకుండా చూడటం అత్యవసరమని. కంటెంట్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రధానంగా, స్వీయ నియంత్రణ ప్రతి ఓటీటీ, సోషల్ మీడియా సంస్థల బాధ్యతగా కేంద్రం పేర్కొంది. ఎలాంటి కంటెంట్ ప్రదర్శించినా, అది సమాజ నైతికతను దెబ్బతీయకూడదని, ఎవరినీ అవమానించేలా లేకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఏ విధంగానైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే, తక్షణమే ఆ కంటెంట్‌ను తొలగించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు కూడా ఇటీవల యూట్యూబ్ వంటి వేదికలపై ఆంక్షలు పెంచాలని, అనుచిత కంటెంట్‌ను కట్టడి చేయాలని సూచించిన విషయం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో, డిజిటల్ వేదికలు తమ కంటెంట్‌పై మరింత జాగ్రత్తగా ఉండాలని, మార్గదర్శకాల మేరకు సమాజం, పిల్లలకు హాని కలిగించే విషయాలను పూర్తిగా నియంత్రించాలని కేంద్రం మరోసారి స్పష్టంగా హెచ్చరించడం ఇప్పుడు కీలకంగా మారింది.

This post was last modified on February 20, 2025 6:37 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

48 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago