Political News

తెలుగు రాష్ట్రాల‌కు నిధులు… మాపై వివ‌క్ష‌: తెలంగాణ‌!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం విపత్తుల స‌హాయ నిధులు విడుద‌ల చేసింది. ఏపీ, తెలం గాణ స‌హా మొత్తం ఐదు రాష్ట్రాల‌(త్రిపుర‌, ఒడిశా, నాగాలాండ్‌)కు ఈ నిధుల‌ను విడుద‌ల చేసింది. ఏపీకి 606 కోట్ల రూపాయ‌ల‌ను విడు ద‌ల చేసిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం 231 కోట్ల రూపాయ‌ల‌ను మాత్ర‌మే ఇచ్చింది. ఈ నిధుల‌ను విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, ప్ర‌జ‌ల పున‌రావాసానికి మాత్ర‌మేకేటాయించాల‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఈ నిధుల‌ను ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తే.. వ‌డ్డీతో స‌హా వ‌సూలు చేయ‌నుంది.

ఏపీకి రూ.606 కోట్లు కేటాయించ‌డం వెనుక‌.. రెండు కార‌ణాలు ఉన్నాయి. ఏపీలో తీర‌ప్రాంత జిల్లాలు విశాఖ‌, ఉభ‌య గోదావ‌రి, ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్ర‌కాశం ఉన్నాయి. ఇవ‌న్నీ కూడా విప‌త్తు ప్ర‌భావిత జిల్లాలుగా గుర్తింపు పొందాయి. ఈ నేప‌థ్యంలో తుఫాన్లు, ఇత‌ర వ‌రద‌లు వంటివి ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో నిధుల కేటాయింపులో ఎక్కువ మొత్తం ఏపీ కేటాయించారు. అయితే.. ఈ నిధుల‌ను కేవ‌లం కేటాయించిన కార్య‌క్ర‌మానికే వినియోగించాల‌ని తేల్చి చెప్పింది.

మాపై విప‌క్ష‌: తెలంగాణ‌

కాగా.. తెలంగాణ స‌ర్కారు ఈ విప‌త్తు నిధుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించింది. త‌మ‌పై కేంద్రం వివ‌క్ష ప్ర‌ద‌ర్శి స్తోంద‌ని మంత్రి మ‌ల్లు భ‌ట్టు విక్ర‌మార్క వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రానికి తీర ప్రాంతం లేక‌పోయినా.. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే వ‌ర‌ద‌ల కార‌ణంగా.. అనేక జిల్లాలు ముంపులో చిక్కుకుంటున్నాయ‌ని.. భ‌ద్రాద్రి జిల్లాలో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు, ఖ‌మ్మం జిల్లాలో ప్ర‌జ‌ల‌కు గ‌తంలో ఇస్తామ‌న్న విప‌త్తు నిధుల‌ను ఇవ్వ‌లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. కేంద్రం ఇస్తున్న నిధులు రాష్ట్రాలు క‌డుతున్న ప‌న్నుల నుంచే ఇస్తున్నార‌ని.. దీనికి లెక్క‌లు చూపాల‌ని కోరడం స‌మంజ‌సం కాద‌ని మ‌రో మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అన్నారు. విప‌త్తు నిధులు అంటే.. కేవ‌లం వ‌ర‌ద‌లు, వ‌ర్షాలు వ‌చ్చిన‌ప్పుడే కాదు.. అవి రాకుండా చేప‌ట్టేందుకు చేసే కార్య‌క్ర‌మాల‌కు కూడా వినియోగించుకుంటామ‌ని.. ఆయ‌న తెలిపారు. కానీ, ఆంక్ష‌లు పెట్ట‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు.

This post was last modified on February 19, 2025 5:16 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

3 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

6 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

7 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

8 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

8 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

8 hours ago