టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయంగా, పాలనా పరంగా సత్తా చాటుతున్నారు. 42 ఏళ్ల వయసుకే పార్టీకి రికార్టు విక్టరీ అందించిన లోకేశ్.. గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీని చేజిక్కించుకున్నారు. తనతో కలిసి బరిలోకి దిగిన జనసేన, బీజేపీలకు కూడా రికార్డు విజయాలను అందించి అన్ని పార్టీల దృష్టిని ఆకర్షించారు. పాలనలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిన లోకేశ్.. తనదైన మార్కును చూపుతున్నారు. అటు పార్టీ, ఇటు పాలనలో యమా స్పీడుగా సాగుతున్న లోకేశ్ ఫిట్ నెస్ విషయంలోనూ బాగానే కసరత్తులు చేస్తున్నట్టున్నారు. గతంలో మాదిరి బొద్దు లుక్కును వదిలేసిన లోకేశ్.. ఇప్పుడు తన ఎత్తుకు తగ్గ లావుతో ఫిట్ గా కనిపిస్తున్నారు.
పార్టీ కార్యకర్తలతో సమావేశం నిమిత్తం బుధవారం తిరుపతి వెళ్లిన లోకేశ్.. పార్టీ కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి వెళ్లారు. పద్మావతి వర్సిటీకి మొన్నటిదాకా ఇంచార్జీ వీసీగా కొనసాగిన ప్రొఫెసర్ ఉమను మంగళవారం పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వర్సిటీని ఓ సారి చూసొద్దామనుకున్నారో, ఏమో తెలియదు గానీ… నేరుగా వర్సిటీకి వెళ్లిన లోకేశ్.. అక్కడ స్టూడెంట్స్ తో కలిసి కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మహిళా ప్రొఫెసర్లు, గర్ల్ స్టూడెంట్లతో కలిసి లోకేశ్ కాసేపు షటిల్ ఆడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
సాధారణంగా పాలిటిక్స్ లో ఉన్న వారు ఫిజికల్ గా ఫిట్ కనిపించడం అరుదే. ఒకవేళ ఫిట్ గా ఉన్న ఆయా ఆటలు ఆడటం ఇబ్బందిగా ఫీలవుతారు. అయితే లోకేశ్ లో ఈ రెండూ కనిపించలేదు. షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కు మాదిరిగా ఒడుపుగా రాకెట్ పట్టిన లోకేశ్… చక్కగా షటిల్ ఆడారు. సర్వీస్ చేయడంతో పాటుగా షాట్లు కూడా లోకేశ్ ఎంతో నేర్పు ఉన్న ఆటగాడిలా ఆడారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ తో ఆయన చలాకీగా మాట్లాడుతూ… తాను ఆడుతూ వారిని ఆడిస్తూ అలా సాగిపోయారు. ఇక చివరగా తనతో షటిల్ ఆడిన స్టూడెంట్స్, ప్రొఫెసర్లతో కలిసి ఫొటోలు దిగారు.
This post was last modified on February 19, 2025 4:54 pm
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…