Political News

కేంద్రం నుంచి ఏదొచ్చినా… ఏపీదే అగ్ర తాంబూలం

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నుంచి విడుదలయ్యే నిధులు ఏవైనా కూడా… వాటిలో ఏపీకి అగ్ర తాంబూలం లభిస్తోంది. మొన్నటికి మొన్న కేంద్ర సాధారణ బడ్జెట్ లో అయినా… ఆ తర్వాత వచ్చిన రైల్వే బడ్జెట్ లో అయినా ఏపీకి భారీ కేటాయింపులు దక్కాయి. ఈ కేటాయింపుల్లో ఏ ఇతర రాష్ట్రంతో పోల్చినా కూడా.. ఏపీకే భారీ కేటాయింపులు లభించాయి. ఏపీకి దక్కుతున్న ప్రత్యేక కేటాయింపులను పక్కనపెట్టినా కూడా ఆయా శాఖల వారీగా కేంద్రం విడుదల చేస్తున్న నిధుల్లో ఏపీకే సింహ భాగం దక్కుతున్నాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన విపత్తుల నిధుల్లోనూ అదే జరిగింది.

గతేడాది దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు చోటుచేసుకోగా… ఆయా రాష్ట్రాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసిన కేంద్రం తాజాగా బుధవారం ప్రకృతి విపత్తు నిధులను విడుదల చేసింది. మొత్తం 5 రాష్ట్రాలకు కలిపి కేంద్రం రూ.1554.99 కోట్లను కేటాయించింది. త్వరలోనే ఈ నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధుల్లో ఏపీకి అత్యధికంగా రూ.608.8 కోట్లు దక్కనున్నాయి. అదే సమయంలో తెలంగాణకు రూ.231.75 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్ కు రూ.170.99 కోట్లు వంతున కేటాయింపులు జరిగాయి.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్ కింద కేటాయించిన ఈ నిధులు త్వరలోనే ఆయా రాష్ట్రాలకు అందనున్నాయి. వాస్తవానికి ఏపీలో గతేడాది ప్రకృతి విపత్తుల కారణంగా భారీ ఎత్తున నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం నష్టాన్ని అంచనా వేసిన కేంద్రం… జరిగిన నష్టానికి సరిపడే రీతిలోనే విపత్తు నిధుల కింద రాష్ట్రానికి రూ.608.8 కోట్లను కేటాయించింది. కేంద్రంతో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయడు నెరపుతున్న సత్సంబంధాల కారణంగానే…. అంశం ఏదైనా కూడా ఏపీకి నిధుల కేటాయింపులో అగ్ర తాంబూలం లభిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on February 19, 2025 4:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

33 minutes ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

46 minutes ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

7 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

9 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

9 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

10 hours ago