Political News

కేంద్రం నుంచి ఏదొచ్చినా… ఏపీదే అగ్ర తాంబూలం

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నుంచి విడుదలయ్యే నిధులు ఏవైనా కూడా… వాటిలో ఏపీకి అగ్ర తాంబూలం లభిస్తోంది. మొన్నటికి మొన్న కేంద్ర సాధారణ బడ్జెట్ లో అయినా… ఆ తర్వాత వచ్చిన రైల్వే బడ్జెట్ లో అయినా ఏపీకి భారీ కేటాయింపులు దక్కాయి. ఈ కేటాయింపుల్లో ఏ ఇతర రాష్ట్రంతో పోల్చినా కూడా.. ఏపీకే భారీ కేటాయింపులు లభించాయి. ఏపీకి దక్కుతున్న ప్రత్యేక కేటాయింపులను పక్కనపెట్టినా కూడా ఆయా శాఖల వారీగా కేంద్రం విడుదల చేస్తున్న నిధుల్లో ఏపీకే సింహ భాగం దక్కుతున్నాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన విపత్తుల నిధుల్లోనూ అదే జరిగింది.

గతేడాది దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు చోటుచేసుకోగా… ఆయా రాష్ట్రాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసిన కేంద్రం తాజాగా బుధవారం ప్రకృతి విపత్తు నిధులను విడుదల చేసింది. మొత్తం 5 రాష్ట్రాలకు కలిపి కేంద్రం రూ.1554.99 కోట్లను కేటాయించింది. త్వరలోనే ఈ నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధుల్లో ఏపీకి అత్యధికంగా రూ.608.8 కోట్లు దక్కనున్నాయి. అదే సమయంలో తెలంగాణకు రూ.231.75 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్ కు రూ.170.99 కోట్లు వంతున కేటాయింపులు జరిగాయి.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్ కింద కేటాయించిన ఈ నిధులు త్వరలోనే ఆయా రాష్ట్రాలకు అందనున్నాయి. వాస్తవానికి ఏపీలో గతేడాది ప్రకృతి విపత్తుల కారణంగా భారీ ఎత్తున నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం నష్టాన్ని అంచనా వేసిన కేంద్రం… జరిగిన నష్టానికి సరిపడే రీతిలోనే విపత్తు నిధుల కింద రాష్ట్రానికి రూ.608.8 కోట్లను కేటాయించింది. కేంద్రంతో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయడు నెరపుతున్న సత్సంబంధాల కారణంగానే…. అంశం ఏదైనా కూడా ఏపీకి నిధుల కేటాయింపులో అగ్ర తాంబూలం లభిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on February 19, 2025 4:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

3 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

6 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

7 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

8 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

8 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

8 hours ago