Political News

నాకు పోలీసు భద్రత కల్పించలేదు: జగన్

మీర్చికి గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోతున్నారని, ఈ క్రమంలోనే గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించేందుకు పులివెందుల ఎమ్మెల్యే జగన్ పర్యటిస్తారని వైసీపీ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. జగన్ సభ, ర్యాలీ చేయబోరని, కేవలం మిర్చి రైతులతో మాట్లాడారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే పోలీసుల మాటలను బేఖాతరు చేసిన జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తానే ప్రతిపక్ష నాయయుడిని అని చెప్పుకున్న జగన్…తనకు పోలీసుల భద్రత కల్పించలేదని ఆరోపించారు. అంతేకాదు, ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, రేపు ప్రతిక్షంలో టీడీపీ ఉన్నప్పుడు తాము కూడా ఇలా పోలీసుల భద్రత తీసేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని చంద్రబాబును జగన్ హెచ్చరించారు. మిర్చి రైతుల ఇబ్బందులును చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలో ఏ పంట వేసినా గిట్టుబాటు ధర లేదని జగన్ ఆరోపించారు. క్వింటా మిర్చి అమ్మితే రూ.10-12 వేలు కూడా రావడం లేదని అన్నారు. వైసీపీ హయాంలో మిర్చి క్వింటాకు రూ.21 నుంచి 27 వేల వరకు ధర వచ్చేదని చెప్పారు. రైతులు పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఉందని విమర్శించారు. రాబోయే రోజుల్లో రైతుల తరఫున ఉద్యమిస్తామని అన్నారు. రైతులను దళారులకు చంద్రబాబు ప్రభుత్వం అమ్మేసిందని ఆరోపించారు.

తమ హయాంలో రైతులకు ఎంతో మేలు చేసిన ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. ఇకనైనా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు మిర్చి యార్డుకు రావాలని, రైతుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని రైతుల తరఫున హెచ్చరిస్తున్నామని చెప్పారు.

అయితే, తాజాగా జగన్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించి పోలీసులు వద్దంటున్నా వినకుండా మిర్చి యార్డుకు జగన్ రావడం తప్పు అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. తాను తప్పు చేసింది కాకుండా తన లాగే చంద్రబాబునూ తప్పు చేయమంటోన్న జగన్ అంటూ నెటిజన్లు జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

Kumar

Recent Posts

శ్రీనగర్.. ఈ ఏడాది సమ్మర్ విన్నర్.. ఎంత భారీగా ఫ్లైట్ జర్నీలంటే?

ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…

8 minutes ago

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

2 hours ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

6 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

7 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

9 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

10 hours ago