Political News

వంశీతో జగన్ ములాఖాత్ పై టీడీపీ రియాక్షన్

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, ఫిర్యాదుదారుడిపై బెదిరింపుల కేసులు వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో వంశీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నేరుగా విజయవాడ జైలుకు వెళ్లారు. జైలులో వంశీని పరామర్శించిన జగన్… ఆ తర్వాత బయటకు వచ్చి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారంటూ కూటమి సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. వంశీతో ములాఖత్ ను ముగించుకుని జగన్ అటు వెళ్లారో, లేదో… టీడీపీ ఆయనపై విరుచుకుపడింది. అక్రమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన వంశీని ఎలా పరామర్శిస్తారని జగన్ ను టీడీపీ నిలదీసింది. ఈ మేరకు జగన్ కు 10 ప్రశ్నలతో కూడిన లేఖాస్త్రాన్ని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంధించారు.

ఈ లేఖలో పల్లా… వంశీ చేసిన అక్రమాలను ఏకరువు పెట్టారు. దళిత ఉద్యోగి అయిన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి, బెదిరించి… ఆ చర్య ద్వారా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఉల్లంఘించిన వంశీని ఎలా కలుస్తారని జగన్ ను ప్రశ్నించారు. దళితులపై కంటే కూడా వారిపై దాడులకు తెగబడే వంశీ లాంటి వారికి మద్దతు ఇస్తున్నారంటే… మీ వైఖరి ఏమిటో తెలపాలని కూాడా పల్లా ప్రశ్నించారు. ఇలా పలు కీలక అంశాలను జగన్ కు సంధించిన పల్లా… అసలు వంశీతో ములాఖత్ ద్వారా జనానికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని కూడా ఆయన జగన్ ను ప్రశ్నించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో మహిళలను అవమానించిన వంశీని ఏ రీతిన సమర్థిస్తావని కూడా ఆయన ప్రశ్నించారు. తల్లి, చెల్లిలపైనే అసభ్య పోస్టులు పెట్టించిన మీకు మహిళలంటే గౌరవం లేని వంశీ లాంటి వారే మంచిగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు.

ఆపై గన్నవరం నియోజకవర్గం కేంద్రంగా సాగించిన అక్రమాల చిట్టాను పల్లా విప్పారు. పట్టిసీమ గట్టు మట్టిని అక్రమంగా తరలించి… రైతుల ద్రోహిగా వంశీ నిలిచారని ఆయన విమర్శించారు. వంశీ కారణంగా గన్నవరంలో 11 వేల మంది సొంతింటి కల దూరమైందన్న విషయాన్ని గుర్తు చేశారు. చెరువులు, కొండలను అక్రమంగా తవ్వించి గ్రావెల్ మాఫియాను నడిపిన వంశీకి మద్దతు ఎలా తెలుపుతారంటూ ఆయన జగన్ ను నిలదీశారు. ఎయిర్ పోర్టు భూములను కూడా వంశీ దురాక్రమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బెజవాడ రూరల్ మండలంలో ఏకంగా 9 గ్రామాల్లో వంశీ భూకబ్జా కోరుగా ఉన్నారని కూడా పల్లా విమర్శించారు.

This post was last modified on February 18, 2025 9:03 pm

Share

Recent Posts

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

1 minute ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

4 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

7 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

10 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

10 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

10 hours ago