మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా తుది ఫలితం వెలువడక ముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ నాని దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన కనిపించిన దాఖలానే లేదని చెప్పాలి. గడచిన 8 నెలలుగా గుడివాడకు దూరంగానే ఉంటున్న నాని… ఎప్పుడన్నా అవసరం అయితే తప్పించి గుడివాడకు రాలేదు. అలా వచ్చిన సందర్భాల్లోనూ చడీచప్పుడు లేకుండా వచ్చిన పనిని క్షణాల్లో పూర్తి చేసుకుని ఆయన వెళ్లిపోయేవారు. ఇక వైసీపీ కార్యక్రమాల్లోనూ ఆయన పెద్దగా కనిపించలేదనే చెప్పాలి.
తాజాగా తన స్నేహితుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయ్యాక కొడాలి మరింతగా గాయబ్ అయిపోయారట. నాని అరెస్టు తర్వాత కొడాలి నాని వంతేనంటూ టీడీపీ శ్రేణులతో పాటుగా వైసీపీ శ్రేణుల్లోనూ గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గుసగుసలు నిజమేనన్నట్టుగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నాని ఏకంగా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గుడివాడలో లేకుంటా హైదరాబాద్ లో ఉంటారులే అని నిన్నటిదాకా నాని అనుచరులు భావిస్తూ వచ్చారు. ఏదైనా ముఖ్య విషయం ఉంటే… ఫోన్ ద్వారా ఆయనకు చేరవేసేవారు. అయితే ఇప్పుడు నానికి ఫోన్ చేద్దామంటూ ఆయన ఫోన్లన్నీ స్విచ్ఛాఫ్ అని వస్తున్నాయట. దీంతో ఇప్పుడు నాని ఎక్కడున్నారని ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారట.
ఇదిలా ఉంటే… వైసీపీ హయాంలో రెండున్నరేళ్ల పాటు మంత్రిగా వ్యవహరించిన నాని… ఆ తర్వాతి రెండున్నరేళ్లు మంత్రిగా లేకున్నా కూడా తనదైన శైలిలో టీడీపీపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా జగన్ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ తో తన నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటినీ ఇప్పుడు కూటమి సర్కారు బయటకు తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే నానిపై గుడివాడలో 3 కేసులు నమోదు అయ్యాయట. తాజాగా వైసీపీ జమానాలో జరిగిన లిక్కర్ దందాపైనా విచారణ జరుగుతోంది. ఇందులోనూ నాని అడ్డంగా బుక్ అవుతారని, ఆ కేసు కూడా నానిపై నమోదు కావడం ఖాయమేనని సమాచారం. ఈ మొత్తం వ్యవహారాలన్నీ తెలుసుకున్న మీదటే నాని అండర్ గ్రౌండ్ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
This post was last modified on February 17, 2025 7:59 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…