Political News

“ఈ 5 ఏళ్లు రేవంత్ గారు సిఎం, వచ్చేరోజుల్లో బీసీలే సిఎం” : మహేష్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పదవిపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశం వేదికగా రేవంత్ సీఎం పదవితో పాటుగా భవిష్యత్తులో బీసీలకు దక్కనున్న ప్రాధాన్యతపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఐధేళ్లు రేవంతే సీఎంగా కొనసాగుతారని వ్యాఖ్యానించిన మహేశ్… ఈ ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే… బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత సీఎం పదవి చేపడతారని ఆయన చెప్పడం గమనార్హం.

తన సీఎం పదవిపై ఇదివరకే రేవంత్ రెడ్డి ఇదే దిశగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణకు తాను రెడ్డి సీఎంగా చివరి నేతను అయినా పరవాలేదు అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీనే ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న రేవంత్… అందుకు తానేమీ బాధ పడేది కూడా లేదని తేల్చి చెప్పారు. రేవంత్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చిన రోజుల వ్యవధిలోనే మహేశ్ కుమార్ గౌడ్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కుల గణన నేపథ్యంలో రేవంత్ ఆ తరహా వ్యాఖ్యలు చేయగా… ఇప్పుడు మహేశ్ కూడా అదే తరహాలో స్పందించడం గమనార్హం.

అయినా తాజా ప్రెస్ మీట్ లో మహేశ్ కుమార్ గౌడ్ ఏమన్నారన్న విషయానికి వస్తే… బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చారు. ఏదో ఒక రోజున తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవుతారన్న మహేశ్.. అది కూడా కాంగ్రెస్ పార్టీలోనే అవుతారని అన్నారు. రానున్న ఎన్నికలు బీసీల చుట్టే తిరుగుతాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. గతంలో బీసీలు సీఎం కాలేదు కాబట్టే… రాహుల్ గాంధీ ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీసీలే సీఎం అవుతారన్న మహేశ్… ఈ ఐదేళ్ల పాటు సీఎంగా రేవంతే కొనసాగుతారని ఆయన పేర్కొన్నారు.

This post was last modified on February 17, 2025 7:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago