Political News

`మూడు` ప‌థ‌కాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌… ఏపీ బ‌డ్జెట్‌లో మెరుపులు ఖాయం!

ఈ నెల 28 లేదా మార్చి 1న ఏపీ వార్షిక(2025-26) బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనిపై అన్ని వ‌ర్గాల‌లోనూ ఆశ‌లు మెండుగా ఉన్నాయి. విద్యార్థుల నుంచి గృహిళుల వ‌ర‌కు, రైతుల నుంచి పారిశ్రామిక వేత్త‌ల వ‌ర‌కు.. కేటాయింపుల‌పై ఎక్కువ‌గా ఎదురు చూస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా సూప‌ర్ సిక్స్ హామీల‌పై నిధులు ఏరేంజ్‌లో కేటాయిస్తోంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఈ విష‌యంపై ఇటు కూట‌మి పార్టీల్లోనూ.. అటు సాధార‌ణ ప్ర‌జ‌ల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్ర‌ధానంగా మూడు ప‌థ‌కాల‌కు ఈ ద‌ఫా తొలి పూర్తిస్థాయి బ‌డ్జెట్‌లో కూట‌మి ప్ర‌భుత్వం నిధులు కేటాయిస్తున్నట్టు తెలిసింది. గ‌త ఏడాదిఎన్నిక‌ల్లో ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల్లో.. కీల‌క‌మైన‌వి మూడు ఉన్నాయి.

1) మాతృవంద‌నం, 2) రైతుల‌కు అన్న‌దాత సుఖీభ‌వ‌, 3) నిరుద్యోగ భృతి. అదేవిధంగా ఆడ‌బిడ్డ నిధి కూడా ఉంది. ఇవ‌న్నీ కూడా.. సొమ్ముల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హారాలే. దీంతో ఎనిమిది నెల‌లు గ‌డిచినా.. వీటిపై స‌ర్కారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక పోయింది.

తాజాగా ప్ర‌వేశ పెట్టే బ‌డ్జ‌ట్ ఏప్రిల్ నుంచి అమ‌లు కానున్న నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాదిలో అయినా.. ఈ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల‌ని ప్ర‌జ‌ల నుంచి ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. మ‌రీ ముఖ్యంగా విప‌క్షాల నుంచి కూడా.. కొంత మేర‌కు విమ‌ర్శ‌లు ప్రారంభ‌మ‌య్యాయి.

దీనిని దృష్టిలో ఉంచుకున్న కూట‌మి ప్ర‌భుత్వం.. మూడు ప‌థ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకుంది. వీటిలో ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు వ‌రంగా మారే.. మాతృవంద‌నం ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు.

అదేవిధంగా రైతులను మెప్పించేందుకు అన్న‌దాత సుఖీభ‌వ కింద‌.. ఏటా ఇస్తామ‌న్న రూ.20 వేల‌ను ఇవ్వ‌నున్నారు. అయితే.. దీనిలో కేంద్రం ఇస్తున్న 6000 వేల రూపాయ‌లు మిన‌హాయించి.. మిగిలిన మొత్తాన్ని ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ మేర‌కు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించిన‌ట్టు స‌మాచారం. అలాగే.. నిరుద్యోగ భృతి కోసం కూడా.. నిధుల కేటాయింపు జ‌రిగిన‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా.. ఈ ఏడాది కూట‌మి ప్ర‌భుత్వం పెట్టే పూర్తిస్థాయి బ‌డ్జెట్‌లో మెరుపులు ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

Kumar

Recent Posts

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

1 hour ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

2 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

5 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

9 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

9 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

11 hours ago