ప్రతిపక్షం వైసీపీకి కీలకమైన జిల్లాల్లో ఒకటి ఉమ్మడి గుంటూరు. ఈ జిల్లాలో గత ఆరేళ్లుగా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుని మరీ రాజకీయాలను దూకుడు పెంచారు. పల్నాడులోని వారికే మంత్రులుగా కూడా జగన్ అవకాశం ఇవ్వడం గమనార్హం.
ఇద్దరు మంత్రులు ఉంటే.. ఇద్దరూ పల్నాడుకు చెందిన వారే ఉండేవారు. వైసీపీకి అలాంటి బలమైన జిల్లాగా ఉన్న పల్నాడులో ఇప్పుడు పిడుగు పడింది. గతంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ ఇప్పుడు దానిని వదులుకోవాల్సి వచ్చింది.
తాజాగా జరిగిన పిడుగురాళ్ల మునిసిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. గతంలో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న వారంతా.. ఇప్పుడు కూటమికి జై కొట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే యరపతి నేని శ్రీనివాసరావు కీలకంగా మారడం గమనార్హం.
ఆయన ఎంట్రీతో వైసీపీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు సైకిల్ ఎక్కారు. దీంతో గత నాలుగు రోజులుగా వాయిదా పడుతున్న పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నికను తాజాగా నిర్వహించారు. ఈ క్రమంలో అందరూ.. మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గా ఉన్నం భారతికి జై కొట్టారు.
పిడుగురాళ్ల 30వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న ఉన్నం భారతికి కౌన్సిలర్లు మద్దతు పలకడంతో ఆమె ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 2022లో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. దీంతో వైసీపీ చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి.
అయితే.. తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటోంది. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే పిడుగు రాళ్లలోనూ పరిణామాలు మారిపోవడం గమనార్హం.
This post was last modified on February 17, 2025 3:55 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…