Political News

వైసీపీపై `పిడుగు`.. రాళ్లు!

ప్ర‌తిప‌క్షం వైసీపీకి కీల‌క‌మైన జిల్లాల్లో ఒక‌టి ఉమ్మ‌డి గుంటూరు. ఈ జిల్లాలో గ‌త ఆరేళ్లుగా ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసుకుని మ‌రీ రాజ‌కీయాలను దూకుడు పెంచారు. ప‌ల్నాడులోని వారికే మంత్రులుగా కూడా జ‌గ‌న్ అవ‌కాశం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఇద్ద‌రు మంత్రులు ఉంటే.. ఇద్ద‌రూ ప‌ల్నాడుకు చెందిన వారే ఉండేవారు. వైసీపీకి అలాంటి బ‌ల‌మైన జిల్లాగా ఉన్న ప‌ల్నాడులో ఇప్పుడు పిడుగు ప‌డింది. గ‌తంలో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వైసీపీ ఇప్పుడు దానిని వ‌దులుకోవాల్సి వ‌చ్చింది.

తాజాగా జ‌రిగిన పిడుగురాళ్ల మునిసిప‌ల్ వైస్ చైర్మ‌న్ ప‌ద‌విని టీడీపీ ద‌క్కించుకుంది. గ‌తంలో వైసీపీ త‌రఫున విజ‌యం ద‌క్కించుకున్న వారంతా.. ఇప్పుడు కూట‌మికి జై కొట్టారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే య‌ర‌ప‌తి నేని శ్రీనివాస‌రావు కీల‌కంగా మార‌డం గ‌మ‌నార్హం.

ఆయ‌న ఎంట్రీతో వైసీపీకి చెందిన 20 మంది కౌన్సిల‌ర్లు సైకిల్ ఎక్కారు. దీంతో గ‌త నాలుగు రోజులుగా వాయిదా ప‌డుతున్న పిడుగురాళ్ల వైస్ చైర్మ‌న్ ఎన్నిక‌ను తాజాగా నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో అంద‌రూ.. మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గా ఉన్నం భారతికి జై కొట్టారు.

పిడుగురాళ్ల 30వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న ఉన్నం భారతికి కౌన్సిలర్లు మద్దతు పల‌క‌డంతో ఆమె ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 2022లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. దీంతో వైసీపీ చాలా చోట్ల ఏక‌గ్రీవాలు చేసుకుంది. ఈ క్ర‌మంలో కొన్ని చోట్ల వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి.

అయితే.. తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటోంది. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారు. ఈ క్ర‌మంలోనే పిడుగు రాళ్ల‌లోనూ ప‌రిణామాలు మారిపోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 17, 2025 3:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

1 hour ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

2 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

2 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

4 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

4 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

6 hours ago