Political News

గ్రీవెన్స్ స్టైల్ నే మార్చేసిన నారా లోకేశ్

గ్రీవెన్స్… అంటే ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిశీలించడం, వాటిని పరిష్కరించడం అన్నది ప్రతి రాజకీయ నేతకూ ఓ తప్పనిసరి కార్యక్రమమే. ఆయా సమస్యలను తీర్చేది అధికారులే అయినా… వాటి పరిష్కారానికి రాజకీయ నేతల నుంచే అడుగులు పడాలి. అంతేకాకుండా ప్రజల నుంచి అందే ఫిర్యదులను స్వీకరించడం, వాటిని పరిశీలించడం, వాటి ఫరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం… ఓ రాజకీయ నేత పనితీరును ఇట్టే పట్టించేస్తాయి.

ఆయా నేతలకు గ్రీవెన్స్ సెల్ ఓ బెంచ్ మార్క్ గా నిలుస్తోంది. ఫలానా నేతకు తమ సమస్యను ఇస్తే పరిష్కారం అయిపోయినట్టేనన్న భావన కలిగితే… ఆ నేతకు ఇక తిరుగు ఉండదనే చెప్పాలి.

ఇప్పటిదాకా దాదాపుగా ఏ నేత అయినా… తన వద్దకు వస్తున్న ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వాటిని తన పీఏలు, పీఎస్ లకు అందిస్తున్నారు. వాటి పరిష్కారంపై దృష్టి సారించండి అంటూ తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటిదాకా గ్రీవెన్స్ లో జరుగుతున్నది ఇదే.

అసలు ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల్లో ఏమేం ఉంటున్నది పరిశీలిస్తున్న నేతలు దాదాపుగా లేరనే చెప్పాలి. అయితే ఆయా నేతల స్థాయి, హోదాలను బట్టి తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావన ప్రజల్లో కలుగుతోంది. అయితే ఈ తరహా భావనలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పటాపంచలు చేశారు.

ప్రస్తుతం లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల స్వీకరణ ఓ మహా క్రతువుగా సాగుతోంది. మంగళగిరిలో నిత్యం ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తున్న లోకేశ్.. వాటిలో ఏఏ అంశాలు ఉంటున్నాయన్న విషయాన్ని అక్కడికక్కడే పరిశీలించి…వాటి పరిష్కారం కోసం అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నారు.

అంతేకాకుండా ఆయా సమస్యల పరిష్కారం ఎలా సాధ్యమన్న విషయాన్ని కూడా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న వైనం నిజగానే ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా లోకేశ్ కు అందిన ఫిర్యాదులు కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం అయిపోతున్న తీరుపైనా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఆదివారం నెల్లూరు జిల్లాలో జరిగిన మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్ కోసం వెళ్లిన లోకేశ్… తిరిగి తిరుపతికి వెళుతున్న సందర్భంగా దారి వెంట ఫిర్యాదులను పట్టుకుని పలువురు నిలుచున్న వైనాన్ని చూసి తన కాన్వాయ్ ను ఆపారు. వినతిులతో వచ్చిన వారిని దగ్గరికి పిలిచి ఒక్కొక్కరి నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా తాను నిలుచున్నది రోడ్డుపై అన్న విషయాన్ని కూడా మచిరిపోయిన లోకేశ్… ప్రతి ఫిర్యాదును అక్కడికక్కడే సమగ్రంగా పరిశీలించి… బాధితులతో మాట్లాడి.. వాటి పరిష్కారంపై తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుపై లోకేశ్ ఫిర్యాదులను పరిశీలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

This post was last modified on February 17, 2025 11:04 am

Share
Show comments
Published by
Kumar
Tags: Nara Lokesh

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

8 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

45 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago