Political News

గ్రీవెన్స్ స్టైల్ నే మార్చేసిన నారా లోకేశ్

గ్రీవెన్స్… అంటే ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిశీలించడం, వాటిని పరిష్కరించడం అన్నది ప్రతి రాజకీయ నేతకూ ఓ తప్పనిసరి కార్యక్రమమే. ఆయా సమస్యలను తీర్చేది అధికారులే అయినా… వాటి పరిష్కారానికి రాజకీయ నేతల నుంచే అడుగులు పడాలి. అంతేకాకుండా ప్రజల నుంచి అందే ఫిర్యదులను స్వీకరించడం, వాటిని పరిశీలించడం, వాటి ఫరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం… ఓ రాజకీయ నేత పనితీరును ఇట్టే పట్టించేస్తాయి.

ఆయా నేతలకు గ్రీవెన్స్ సెల్ ఓ బెంచ్ మార్క్ గా నిలుస్తోంది. ఫలానా నేతకు తమ సమస్యను ఇస్తే పరిష్కారం అయిపోయినట్టేనన్న భావన కలిగితే… ఆ నేతకు ఇక తిరుగు ఉండదనే చెప్పాలి.

ఇప్పటిదాకా దాదాపుగా ఏ నేత అయినా… తన వద్దకు వస్తున్న ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వాటిని తన పీఏలు, పీఎస్ లకు అందిస్తున్నారు. వాటి పరిష్కారంపై దృష్టి సారించండి అంటూ తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటిదాకా గ్రీవెన్స్ లో జరుగుతున్నది ఇదే.

అసలు ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల్లో ఏమేం ఉంటున్నది పరిశీలిస్తున్న నేతలు దాదాపుగా లేరనే చెప్పాలి. అయితే ఆయా నేతల స్థాయి, హోదాలను బట్టి తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావన ప్రజల్లో కలుగుతోంది. అయితే ఈ తరహా భావనలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పటాపంచలు చేశారు.

ప్రస్తుతం లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల స్వీకరణ ఓ మహా క్రతువుగా సాగుతోంది. మంగళగిరిలో నిత్యం ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తున్న లోకేశ్.. వాటిలో ఏఏ అంశాలు ఉంటున్నాయన్న విషయాన్ని అక్కడికక్కడే పరిశీలించి…వాటి పరిష్కారం కోసం అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నారు.

అంతేకాకుండా ఆయా సమస్యల పరిష్కారం ఎలా సాధ్యమన్న విషయాన్ని కూడా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న వైనం నిజగానే ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా లోకేశ్ కు అందిన ఫిర్యాదులు కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం అయిపోతున్న తీరుపైనా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఆదివారం నెల్లూరు జిల్లాలో జరిగిన మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్ కోసం వెళ్లిన లోకేశ్… తిరిగి తిరుపతికి వెళుతున్న సందర్భంగా దారి వెంట ఫిర్యాదులను పట్టుకుని పలువురు నిలుచున్న వైనాన్ని చూసి తన కాన్వాయ్ ను ఆపారు. వినతిులతో వచ్చిన వారిని దగ్గరికి పిలిచి ఒక్కొక్కరి నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా తాను నిలుచున్నది రోడ్డుపై అన్న విషయాన్ని కూడా మచిరిపోయిన లోకేశ్… ప్రతి ఫిర్యాదును అక్కడికక్కడే సమగ్రంగా పరిశీలించి… బాధితులతో మాట్లాడి.. వాటి పరిష్కారంపై తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుపై లోకేశ్ ఫిర్యాదులను పరిశీలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

This post was last modified on February 17, 2025 11:04 am

Share
Show comments
Published by
Kumar
Tags: Nara Lokesh

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

24 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago