Political News

గ్రీవెన్స్ స్టైల్ నే మార్చేసిన నారా లోకేశ్

గ్రీవెన్స్… అంటే ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిశీలించడం, వాటిని పరిష్కరించడం అన్నది ప్రతి రాజకీయ నేతకూ ఓ తప్పనిసరి కార్యక్రమమే. ఆయా సమస్యలను తీర్చేది అధికారులే అయినా… వాటి పరిష్కారానికి రాజకీయ నేతల నుంచే అడుగులు పడాలి. అంతేకాకుండా ప్రజల నుంచి అందే ఫిర్యదులను స్వీకరించడం, వాటిని పరిశీలించడం, వాటి ఫరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం… ఓ రాజకీయ నేత పనితీరును ఇట్టే పట్టించేస్తాయి.

ఆయా నేతలకు గ్రీవెన్స్ సెల్ ఓ బెంచ్ మార్క్ గా నిలుస్తోంది. ఫలానా నేతకు తమ సమస్యను ఇస్తే పరిష్కారం అయిపోయినట్టేనన్న భావన కలిగితే… ఆ నేతకు ఇక తిరుగు ఉండదనే చెప్పాలి.

ఇప్పటిదాకా దాదాపుగా ఏ నేత అయినా… తన వద్దకు వస్తున్న ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వాటిని తన పీఏలు, పీఎస్ లకు అందిస్తున్నారు. వాటి పరిష్కారంపై దృష్టి సారించండి అంటూ తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటిదాకా గ్రీవెన్స్ లో జరుగుతున్నది ఇదే.

అసలు ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల్లో ఏమేం ఉంటున్నది పరిశీలిస్తున్న నేతలు దాదాపుగా లేరనే చెప్పాలి. అయితే ఆయా నేతల స్థాయి, హోదాలను బట్టి తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావన ప్రజల్లో కలుగుతోంది. అయితే ఈ తరహా భావనలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పటాపంచలు చేశారు.

ప్రస్తుతం లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల స్వీకరణ ఓ మహా క్రతువుగా సాగుతోంది. మంగళగిరిలో నిత్యం ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తున్న లోకేశ్.. వాటిలో ఏఏ అంశాలు ఉంటున్నాయన్న విషయాన్ని అక్కడికక్కడే పరిశీలించి…వాటి పరిష్కారం కోసం అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నారు.

అంతేకాకుండా ఆయా సమస్యల పరిష్కారం ఎలా సాధ్యమన్న విషయాన్ని కూడా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న వైనం నిజగానే ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా లోకేశ్ కు అందిన ఫిర్యాదులు కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం అయిపోతున్న తీరుపైనా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఆదివారం నెల్లూరు జిల్లాలో జరిగిన మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్ కోసం వెళ్లిన లోకేశ్… తిరిగి తిరుపతికి వెళుతున్న సందర్భంగా దారి వెంట ఫిర్యాదులను పట్టుకుని పలువురు నిలుచున్న వైనాన్ని చూసి తన కాన్వాయ్ ను ఆపారు. వినతిులతో వచ్చిన వారిని దగ్గరికి పిలిచి ఒక్కొక్కరి నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా తాను నిలుచున్నది రోడ్డుపై అన్న విషయాన్ని కూడా మచిరిపోయిన లోకేశ్… ప్రతి ఫిర్యాదును అక్కడికక్కడే సమగ్రంగా పరిశీలించి… బాధితులతో మాట్లాడి.. వాటి పరిష్కారంపై తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుపై లోకేశ్ ఫిర్యాదులను పరిశీలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

This post was last modified on February 17, 2025 11:04 am

Share

Recent Posts

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

16 minutes ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

2 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

7 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

8 hours ago

బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ… సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…

9 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

9 hours ago