తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి.. పేరు విన్నంతనే మస్త్ మజా వచ్చేస్తుంది. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ, ఎన్నెన్నో వ్యాపారాల్లో కాలు పెట్టిన మల్లారెడ్డి.. అన్నింటా సక్సెస్ నే చవిచూశారు. ఆపై రాజకీయాల్లోకి వచ్చాక… అందులోనూ తన లెగ్ గోల్డెన్ లెగ్గేనని నిరూపించుకున్నారు.
ఆదిలో టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్నిమొదలుపెట్టిన మల్లారెడ్డి.. మల్కాజిగిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఏకంగా కేసీఆర్ కేబినెట్ లో మంత్రి కూడా అయ్యారు.. ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు. 2023 ఎన్నికల్లోనూ ఆయన ఎమ్మెల్యేగా నెగ్గి రాజకీయాల్లో కూడా తనది ఉడుము పట్టేనని నిరూపించుకున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే.. మల్లారెడ్డి గురించి చాలానే ఉంది గానీ.. ఆదివారం పూట మల్లారెడ్డి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటారా? స్కూటర్ పై పాలు అమ్ముతూ మల్లారెడ్డి కనిపించి సందడి చేశారు. అది కూడా మెడలో దండలు, భుజాల చుట్టూ శాలువా కప్పుకుని మరీ ఆయన పాలు అమ్మిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తించింది.
అదేంటీ.. మల్లారెడ్డి పాలు, పూలు అమ్మిన రోజులు పోయాయి కదా. ఇప్పటికీ ఆయన ఇంకా పాలు, పూలు అమ్ముతున్నారా?? అని అనుమాన పడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఆయన స్కూటర్ పై పాలు అమ్మింది నిజం కాదు. అలా ఓ ఫోజు ఇచ్చారంతే.
సోషల్ మీడియాలో ఒకింత ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మల్లారెడ్డి… ఆదివారం బోడుప్పల్ లో ఏదో కార్యక్రమం ఉంటే.. దానికి హాజరయ్యేందుకు వెళ్లారట. ఈ సందర్భంగా అక్కడ ఓ వ్యక్తి పాల క్యాన్లను స్కూటర్ పై పెట్టుకుని వెళ్లడాన్ని మల్లారెడ్డి గమనించారు.
ఇంకేముంది… తన పాత రోజులు ఆయనకు గుర్తుకు వచ్చినట్టున్నాయి. వెంటనే సదరు వ్యక్తిని నిలిపి… అతడిని స్కూటర్ పై నుంచిదించి.. పాల క్యాన్లు ఉన్న సదరు స్కూటర్ పై ఎక్కిన మల్లారెడ్డి అలా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత స్కూటర్ దిగి తన భుజాల చుట్టూ ఉన్న శాలువా తీసి ఆ వ్యక్తిని సన్మానించి అలా వెళ్లిపోయారు.
This post was last modified on February 16, 2025 7:43 pm
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…