Political News

కేసు వాపస్ తీసుకుంటే 40 లక్షలు అన్నారు, ఇప్పుడేమో….

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ హయాంలో జరిగిన దాడి ఘటనలో వంశీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయినా… అరెస్ట్ ముప్పు నుంచి రక్షణ పొందుతూ వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

అయినా కూడా ఈ కేసు తనకు ఎప్పుడైనా ముప్పేనని భావించిన వంశీ… ఏకంగా ఆ కేసునే కొట్టివేయించుకుంటే సరిపోలా? అన్న దిశగా సాగారు. ఈ యత్నాలే వంశీని కటకటాల వెనక్కి పంపాయని చెప్పక తప్పదు.

ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న టీడీపీ గన్నవరం కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ను వంశీ అండ్ కో ట్రాప్ చేసింది. కేసును వాపస్ తీసుకునేలా అతడిని ఒప్పంచేందుకు వంశీ వ్యూహం రచించారు. ఆ వ్యూహంలో భాగంగానే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన వంశీ అనుచరులు… కేసును వాపస్ తీసుకోవాలని బెదిరించారట. తాము చెప్పినట్లు చేయకుంటే చంపేస్తామని కూడా అతడిని వారు బెదిరించారట.

అంతేకాకుండా తాము చెప్పినట్లు వింటే… రూ.40 లక్షలు నజరానాగా ఇస్తామని ప్రలోభపెట్టారట. ఓ వైపు మాట వినకుంటే ప్రాణాలు తీస్తామనే బెదిరింపులు… మరోవైపు మాట వింటే రూ.40 లక్షల నజరానా… సత్యవర్ధన్ వారి మాట వినేలా చేసిందని తేలింది. రూ.40 లక్షలకు ఒప్పందం కుదిరితే… అందులో రూ.20 వేలను సత్యవర్థన్ చేతిలో అడ్వాన్స్ రూపేణా పెట్టిన వంశీ అండ్ కో మిగతా మొత్తం పని అయ్యాక ఇస్తామని చెప్పారట.

ఈ క్రమంలో వంశీ అండ్ కో చెప్పినట్లుగా ఇటీవలే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు వెళ్లిన సత్యవర్ధన్…తాను పెట్టిన కేసును ఉపసంహరించుకుంటానని న్యాయమూర్తికి తెలిపాడు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన న్యాయమూర్తి… కేసు ఉపసంహరించుకుంటానని మాట చెబితే సరిపోదని, స్టేట్ మెంట్ ఇవ్వగలరా? అంటూ ప్రశ్నించారట. అసలే అక్కడ రూ.40 లక్షల నజరానా ఊరిస్తుంటే… ముందూ వెనుకా ఆలోచించకుండా స్టేట్ మెంట్ ఇచ్చేందుకు తాను సిద్ధమేనని సత్యవర్ధన్ తెలిపాడు.

ఆపై అన్నీ చకచకా జరిగిపోయాయి. తాము చెప్పిన మాట విన్న సత్యవర్ధన్ కు వంశీ అండ్ కో రూ.40 లక్షలు ఇవ్వాలి కదా. అందుకు విరుద్ధంగా అదిగో ఇదిగో అంటూ వాయిదా వేశారట. ఈలోగానే వారి కుట్ర బయటపడటంతో కథ అడ్డం తిరిగిపోయింది. అంటే… కేసు విత్ డ్రా చేసుకున్న సత్యవర్ధన్ కు రూ.40 లక్షలకు బదులుగా కేవలం రూ.20 మాత్రమే అందాయట.

This post was last modified on February 16, 2025 10:42 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

40 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

46 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago