వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీ అసెంబ్లీ నుంచి వరుసబెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ ను మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు అక్కడి నుంచి బదిలీ చేశారు.
నెల్లూరు జిల్లాను దాటించి… ఏకంగా పల్నాడు జిల్లాకు బదిలీ అయిపోయిన అనిల్… నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే టీడీపీకి అనుకూలంగా వీచిన గాలిలో అనిల్ పరాజయం పాలయ్యారు. అటు నెల్లూరు సిటీ కూడా వైసీపీ చేతిలో నుంచి టీడీపీ ఖాతాలో పడిపోయింది.
అయినా ఉన్నట్టుండి… అనిల్ నెల్లూరు సిటీ నుంచి బదిలీ అయిపోవడానికి గల కారణాలు ఏమిటన్న దిశగా చర్చ సాగినా… పెద్దగా రీజన్లు బయటకు రాలేదు. తాజాగా ఆ కారణాలేమిటన్న దానిపై ఇప్పుడు వైసీపీలో జోరుగా చర్చ సాగుతోంది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్… కేవలం రెండు కారణాలతోనే నెల్లూరు నుంచి ఓడిపోయే నరసరావుపేట పార్లమెంటుకు బదిలీ అయిపోయారని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ అనిల్… ఆ రెండు కారణాలతోనే ఆయనకు దూరమైపోయారన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో అనిల్ కలిసి సాగలేకపోయారు. కాకాణి, అనిల్ ల మధ్య నిత్యం వివాదాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కాకాణికి జగన్ నుంచి మద్దతు లభించగా… అనిల్ మాత్రం ఒంటరి అయిపోయారట. కాకాణితో విభేధాలు ఎందుకంటూ జగన్ కోటరీ నుంచి వచ్చిన హెచ్చరికలను కూడా అనిల్ ఖాతరు చేయలేదట.
అదే సమయంలో పార్టీని వీడిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో అనిల్ సఖ్యతగా మెలగుతున్నారన్న ఫిర్యాదులు రాగా… అనిల్ ను జగన్ క్షణాల్లో నెల్లూరు సిటీ నుంచి బదిలీ చేసారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఓ వైపు కాకాణితో గొడవలు, మరోవైపు వేమిరెడ్డితో సఖ్యతలే అనిల్ కొంప ముంచాయని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
This post was last modified on February 16, 2025 10:31 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…