వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీ అసెంబ్లీ నుంచి వరుసబెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ ను మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు అక్కడి నుంచి బదిలీ చేశారు.
నెల్లూరు జిల్లాను దాటించి… ఏకంగా పల్నాడు జిల్లాకు బదిలీ అయిపోయిన అనిల్… నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే టీడీపీకి అనుకూలంగా వీచిన గాలిలో అనిల్ పరాజయం పాలయ్యారు. అటు నెల్లూరు సిటీ కూడా వైసీపీ చేతిలో నుంచి టీడీపీ ఖాతాలో పడిపోయింది.
అయినా ఉన్నట్టుండి… అనిల్ నెల్లూరు సిటీ నుంచి బదిలీ అయిపోవడానికి గల కారణాలు ఏమిటన్న దిశగా చర్చ సాగినా… పెద్దగా రీజన్లు బయటకు రాలేదు. తాజాగా ఆ కారణాలేమిటన్న దానిపై ఇప్పుడు వైసీపీలో జోరుగా చర్చ సాగుతోంది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్… కేవలం రెండు కారణాలతోనే నెల్లూరు నుంచి ఓడిపోయే నరసరావుపేట పార్లమెంటుకు బదిలీ అయిపోయారని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ అనిల్… ఆ రెండు కారణాలతోనే ఆయనకు దూరమైపోయారన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో అనిల్ కలిసి సాగలేకపోయారు. కాకాణి, అనిల్ ల మధ్య నిత్యం వివాదాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కాకాణికి జగన్ నుంచి మద్దతు లభించగా… అనిల్ మాత్రం ఒంటరి అయిపోయారట. కాకాణితో విభేధాలు ఎందుకంటూ జగన్ కోటరీ నుంచి వచ్చిన హెచ్చరికలను కూడా అనిల్ ఖాతరు చేయలేదట.
అదే సమయంలో పార్టీని వీడిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో అనిల్ సఖ్యతగా మెలగుతున్నారన్న ఫిర్యాదులు రాగా… అనిల్ ను జగన్ క్షణాల్లో నెల్లూరు సిటీ నుంచి బదిలీ చేసారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఓ వైపు కాకాణితో గొడవలు, మరోవైపు వేమిరెడ్డితో సఖ్యతలే అనిల్ కొంప ముంచాయని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
This post was last modified on February 16, 2025 10:31 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…