ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని నిర్ణయించారు. అమరావతి విశిష్టత, అభివృద్ధి వంటివి ప్రపంచవ్యాప్తంగా వీరి ద్వారా ప్రచారం చేయించనున్నారు.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. బ్రాండ్ అంబాసిడర్లను ఏర్పాటు చేయడం ద్వారా.. అమరావతిని ప్రపంచ స్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.
తద్వారా.. రాజధానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడంతోపాటు.. విద్యాసంస్థలను, విదేశీ సంస్థలను కూడా ఆకర్షించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. నిజానికి ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపంచ స్థాయిలో పలు దేశాల పత్రికలు, మీడియాకు ప్రకటనలు ఇస్తున్నారు.
అయినప్పటికీ.. మరింత జోష్ పెంచేలా తాజాగా బ్రాండ్ అంబాసిడర్ల నియామకంపై కసరత్తు చేసిన చంద్రబాబు ఆదిశగా కీలక అడుగులు వేశారు.
బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించే వారు.. అభివృద్ధి, సాంకేతికత, సమాజ సేవ, సామాజిక బాధ్యత వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగి ఉండాలి. బ్రాండింగ్ విషయంలో ప్రతిభ కలిగినవారై ఉండాలి.
అమరావతి అభివృద్ధిపై అంకితభావం, నిబద్ధత, స్థానిక ప్రజలతో మమేకమైనవారై ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను సీఆర్డీఏ పరిశీలించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనుంది.
బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికయ్యేవారి పదవీ కాలం ఏడాదిగా నిర్ణయించారు. అయితే.. బ్రాండ్ అంబాసిడర్ల నియామకం పూర్తిగా సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రానికి ఒకరు చొప్పున ఎంపిక చేయడం ద్వారా దేశంలోనూ.. ప్రపంచ స్థాయిలో మరికొందరిని ఎంపిక చేసి వారి ద్వారా కూడా ప్రచారం చేయనున్నారు.
భారత దేశంలోనే మేటి నగరంగా అమరావతిని నిర్మించాలన్న చంద్రబాబు లక్ష్యం ఈ విధంగా మరింత పుంజుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on February 15, 2025 7:05 pm
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…