Political News

రాహుల్ తో రేవంత్ భేటీ… గంటలో ఏం చర్చించారంటే?

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి… శనివారం మధ్యాహ్నం రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం 10 .జన్ పథ్ లో సాగిన వీరి భేటీ దాదాపుగా గంటపాటు కొనసాగింది. తెలంగాణకు సంబంధించి పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం.

ఇటీవలే తెలంగాణలో జరిగిన కుల గణణపై రాహుల్ కు రేవంత్ ఓ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే దిశగా ఆలోచన చేస్తున్నామని… అందుకు పార్టీ నుంచి అనుమతి కావాలని కూడా రాహుల్ ను రేవంత్ కోరినట్లు సమాచారం.

అంతేకాకుండా పీసీసీ పునర్వ్యవస్థీకరణపైనా కీలక చర్చే జరిగిందట. ఇక వాయిదా పడ్డ కేబినెట్ విస్తరణపై నేతలిద్దరూ చర్చించినట్లు సమాచారం. అయితే కేబినెట్ విస్తరణపై రాహుల్ పెద్దగా ఆసక్తి చూపలేదని, ఇంకొంత సమయం గడచిన తర్వాత చూద్దాంలే అన్నట్లు తెలుస్తోంది.

ఇక టీపీసీసీ ఇంచార్జీగా దీపాదాస్ మున్షిని ఆ పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్ పార్టీ… ఆ ప్లేస్ లో రాహుల్ కోర్ టీంలో అత్యంత ప్రతిభావంతురాలుగా పేరు తెచ్చుకున్న మీనాక్షీ నటరాజన్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రాహుల్ తో రేవంత్ ఒకింత లోతుగానే చర్చించినట్లు సమాచారం.

రాహుల్ కు మీనాక్షి అత్యంత నమ్మకస్తురాలు అయిన నేపథ్యంలో ఆమెకు మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటుగా ఆమె సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు సాగనున్నట్లు రాహుల్ కు రేవంత్ చెప్పినట్లు సమాచారం. మొత్తంగా ఇటీవలి ఢిల్లీ టూర్ లో రాహుల్ అపాయింట్ మెంట్ లభించని రేవంత్ కు ఈ దఫా ఢిల్లీ వెళ్లిన మరునాడే రాహుల్ తో భేటీ కావడం ప్రాదాన్యం సంతకరించుకుంది.

This post was last modified on February 15, 2025 4:23 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాలయ్య పుట్టిన రోజు కానుకలు ఇవేనా?

నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…

2 hours ago

కన్నడ నుంచి మరో బిగ్ మూవీ

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…

5 hours ago

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

8 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

9 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

9 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

10 hours ago